అలా జరిగితే జగన్ నెత్తిన పాలుపోసినట్టే : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని పరిస్థితులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నా ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ఏపీ దివాళా తీసింది. లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నా అభివృద్ధి లేదు. ఏ రంగంలో అభివృద్ధి చెందిందో చెప్పమంటే ఒక్క మంత్రీ సమాధానం చెప్పడం లేదు. అప్పులిస్తే తప్పించి జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు. మంత్రులందరూ డమ్మీలు. సీఎంకి సజ్జల వాయిస్. అన్ని శాఖలకి సంబంధించి సజ్జలే మాట్లాడుతారు. రెండున్నరేళ్లలో ఏ పార్టీ వారూ సీఎంని కలవలేకపోయారు. ఏపీలో వన్ మ్యాన్ షో కొనసాగుతుంది. ముఠా పాలన సాగుతుంది. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. దళితులపైనా అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితికి దిగజారారని ఆయన అన్నారు.
అంతేకాకుండా పట్టాభిని అరెస్ట్ చేశారు. మరి ఆయన ఇంటిపైనా, టీడీపీ కార్యాలయంపైన దాడి చేసిన వారిని అరెస్ట్ చేయరా..? అని ప్రశ్నించారు. ప్రజలు పోరాటానికి సమాయత్తమవుతున్నారు. సీపీఐ పోరాటానికి సిద్దమైంది. చంద్రబాబు కోరినట్టు రాష్ట్రపతిపాలన పెడితే, జగన్ నెత్తిన పాలుపోసినట్టే. జగన్ స్థానికంగానే పోరాటం చేయాలి. టీడీపీ గతంలో రాష్ట్రపతి పాలనని వ్యతిరేకించి పోరాటం చేసిందని గుర్తు చేశారు.
Also Read
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
రైతుల్లోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రైతులు చనిపోతే కనీసం పీఎం సంతాపం తెలపలేదు. సీఎం జగన్ కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడలేడు. పీఎంకి కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేకున్నారు. ఎంపీలు చేతకాని దద్దమ్మలు. అప్పులు తెచ్చి అకౌంట్లలో వేయడానికి సీఎం ఎందుకు..? బ్యాంక్ ఆఫీసర్ చాలు అంటూ ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!