Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Analysis Ycp Focused On Chandrababus Delhi Tour

బాబు ఢిల్లీ టూర్ పై ఫోకస్ పెట్టిన వైసీపీ?

Published Date :October 24, 2021 , 2:02 pm
By Lakshmi Narayana
బాబు ఢిల్లీ టూర్ పై ఫోకస్ పెట్టిన వైసీపీ?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఏపీలో రాజకీయాలు మరోసారి హిటెక్కాయి. టీడీపీ నేత పట్టాభి ఎపిసోడ్ తో గడిచిన రెండుమూడ్రోజులుగా టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సీన్ మారిపోయింది. ఎవరికీవారు తగ్గెదేలే అన్నట్లు వ్యహరిస్తుండటంతో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అయితే టీడీపీ తన సమస్యను ఆంధ్రప్రదేశ్ సమస్యగా చూపిస్తూ పోరాటం చేస్తుండటంతో ఆపార్టీకి ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదు. ఇదే అదనుగా వైసీపీ సైతం టీడీపీపై ఎదురుదాడికి దిగుతోంది. దీంతో ఏపీలో పొలిటికల్ వార్ కు తెరలేచినట్లయింది.

పట్టాభి వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య అగ్గిరాజుకుంది. బంద్ లు, అరెస్టులు, కేసులు, మాటలదాడితో ఏపీ అట్టుకుపోయింది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజ్రులుపాటు తమ టీడీపీ ఆఫీసులోనే నిరసన దీక్ష పూర్తి చేసుకున్నారు. అయితే టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని చంద్రబాబు నాయుడు బీజేపీకి దగ్గరయ్యేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి అపాయిమ్మెంట్ ను చంద్రబాబు కోరినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read

  • Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
  • Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
  • love Or Attraction: లవ్‌లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
  • Valentine's Day: వాలెంటైన్ ఎవరు..? ప్రేమికుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది..?
Add as a preferred
source on google

ఈ పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబుకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారైంది. సోమవారం నుంచి ఆయన రెండ్రోజులు ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యల నెలకొందని చంద్రబాబు రాష్ట్రపతికి వివరించే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు. అయితే రాష్ట్రపతి విధించాలంటే అంతా ఈషామాషీ విషయం కాదు. దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన కేవలం పోలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నారనే టాక్ విన్పిస్తోంది.

ఈ పర్యటనలోనే ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాను కలువాలని చంద్రబాబు భావిస్తున్నారు. వారి అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వీరిద్దరిలో ఏ ఒక్కరి అపాయింట్మెంట్ బాబుకు దొరికినా సీఎం జగన్ బీజేపీ పట్ల తన ఆలోచనను మార్చుకునే అవకాశం ఉందని టాక్. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని బీజేపీకి అన్ని విషయాల్లో మద్దతు ఇస్తూ వస్తున్నారు. అయినా కేంద్రం నుంచి ఏపీకి సరైన సహకారం లభించడం లేదని సీఎం జగన్ భావిస్తున్నారు.

ఇలాంటి సమయంలో జగన్ కు వ్యతిరేకంగా బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయన ఊరుకునే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ఇక రాబోయే రోజుల్లో జగన్ కు బీజేపీ అవసరం కంటే.. బీజేపీకే జగన్ అవసరం ఉండనుంది. దీంతో బీజేపీకి తాము మద్దతు ఇవ్వాలో లేదో ఢిల్లీ పెద్దల నిర్ణయానికే సీఎం జగన్ వదిలేసినట్లు కన్పిస్తోంది. ఢిల్లీలో చంద్రబాబు పర్యటనపై ఫోకస్ పెట్టిన వైసీపీ బీజేపీ పెద్దల తీరును నిషితంగా గమనిస్తోంది. బీజేపీ పెద్దలు వైసీపీకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం పరిస్థితి వేరేలా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ ఢిల్లీ పెద్దలు ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తానేది మాత్రం వేచిచూడాల్సిందే..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • chandrababu
  • Delhi
  • ycp

తాజావార్తలు

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

  • TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions