PM Modi: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్కు మోడీ ఫోన్.. తాజా పరిణామాలపై చర్చ
- ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్కు మోడీ ఫోన్
- తాజా పరిణామాలపై చర్చ
- ఎక్స్లో తెలియజేసిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు, ప్రాణ నష్టంపై మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే భారతీయుల భద్రత, ఇంధన సరఫరాపై కీలకంగా మోడీ చర్చించారు.

Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
ఫోన్ సంభాషణ తర్వాత మోడీ కీలక ట్వీట్ చేశారు. ‘‘పశ్చిమాసియాలోని తీవ్రమైన పరిస్థితి గురించి చర్చించడానికి ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియన్తో మాట్లాడాను. ఉద్రిక్తతలు పెరగడం, పౌర ప్రాణనష్టం, అలాగే పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను.’’ అని రాసుకొచ్చారు.
ప్రపంచ సంక్షోభం నుంచి ఉత్పన్నమయ్యే ఆర్థిక ఒత్తిళ్లను ప్రభుత్వం ఎలా నిర్వహించిందో రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ సమయంలో భారతదేశం విధానాన్ని ప్రధానమంత్రి మోడీ గుర్తుచేవారు. ‘‘యుద్ధ పరిణామాల భారం భారత పౌరులపై పడకుండా చూసుకోవడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్ని ప్రయత్నాలు చేసింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం పెరిగినప్పుడు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ రైతులకు రూ. 300కు యూరియా బ్యాగ్ను అందించాం. ఇది అంతర్జాతీయ మార్కెట్లో రూ. 3,000 ఖర్చవుతుంది.’’ అని మోడీ అన్నారు. తాజాగా రాష్ట్ర అధికారుల సహకారం కోరుతూ.. ప్రస్తుత సంక్షోభ సమయంలో మార్కెట్ తారుమారు, తప్పుడు సమాచారంపై కఠినమైన అప్రమత్తతను పాటించాలని ప్రధాని మోడీ కోరారు.
ఇది కూడా చదవండి: Netanyahu: ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతి
గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు దిగింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. అయితే ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. ఇరాన్ పెద్దలతో దౌత్యం నిర్వహించారు. దీంతో హార్ముజ్ నుంచి భారత నౌకలు సాఫీగా పంపించేందుకు ఇరాన్ అంగీకరించింది. ప్రస్తుతం 28 నౌకలు భారత్కు వస్తున్నాయి.
Had a conversation with Iranian President, Dr. Masoud Pezeshkian, to discuss the serious situation in the region.
Expressed deep concern over the escalation of tensions and the loss of civilian lives as well as damage to civilian infrastructure.
The safety and security of…
— Narendra Modi (@narendramodi) March 12, 2026
తాజావార్తలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!