PM Modi: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్కు మోడీ ఫోన్.. తాజా పరిణామాలపై చర్చ
- ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్కు మోడీ ఫోన్
- తాజా పరిణామాలపై చర్చ
- ఎక్స్లో తెలియజేసిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు, ప్రాణ నష్టంపై మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే భారతీయుల భద్రత, ఇంధన సరఫరాపై కీలకంగా మోడీ చర్చించారు.

Also Read
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
- Kulgam: కుల్గామ్లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
ఫోన్ సంభాషణ తర్వాత మోడీ కీలక ట్వీట్ చేశారు. ‘‘పశ్చిమాసియాలోని తీవ్రమైన పరిస్థితి గురించి చర్చించడానికి ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియన్తో మాట్లాడాను. ఉద్రిక్తతలు పెరగడం, పౌర ప్రాణనష్టం, అలాగే పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను.’’ అని రాసుకొచ్చారు.
ప్రపంచ సంక్షోభం నుంచి ఉత్పన్నమయ్యే ఆర్థిక ఒత్తిళ్లను ప్రభుత్వం ఎలా నిర్వహించిందో రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ సమయంలో భారతదేశం విధానాన్ని ప్రధానమంత్రి మోడీ గుర్తుచేవారు. ‘‘యుద్ధ పరిణామాల భారం భారత పౌరులపై పడకుండా చూసుకోవడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్ని ప్రయత్నాలు చేసింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం పెరిగినప్పుడు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ రైతులకు రూ. 300కు యూరియా బ్యాగ్ను అందించాం. ఇది అంతర్జాతీయ మార్కెట్లో రూ. 3,000 ఖర్చవుతుంది.’’ అని మోడీ అన్నారు. తాజాగా రాష్ట్ర అధికారుల సహకారం కోరుతూ.. ప్రస్తుత సంక్షోభ సమయంలో మార్కెట్ తారుమారు, తప్పుడు సమాచారంపై కఠినమైన అప్రమత్తతను పాటించాలని ప్రధాని మోడీ కోరారు.
ఇది కూడా చదవండి: Netanyahu: ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతి
గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు దిగింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. అయితే ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. ఇరాన్ పెద్దలతో దౌత్యం నిర్వహించారు. దీంతో హార్ముజ్ నుంచి భారత నౌకలు సాఫీగా పంపించేందుకు ఇరాన్ అంగీకరించింది. ప్రస్తుతం 28 నౌకలు భారత్కు వస్తున్నాయి.
Had a conversation with Iranian President, Dr. Masoud Pezeshkian, to discuss the serious situation in the region.
Expressed deep concern over the escalation of tensions and the loss of civilian lives as well as damage to civilian infrastructure.
The safety and security of…
— Narendra Modi (@narendramodi) March 12, 2026
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!