ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష.. దీనికి ప్రతిగా వైసీపీ ప్రజాగ్రహ దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగితే రాష్ట్ర బంద్ చేస్తారా అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో ట్వీట్లు చేశారు. జగన్ గారి హుందాతనాన్ని బలహీనతగా తీసుకోవద్దని, ప్రతి ఎన్నికల్లో చిత్తుగా ఓడారన్నారు విజయసాయిరెడ్డి. టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉనికిని…
చంద్రబాబు దీక్షకు కౌంటర్గా ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేత జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు ప్రజాగ్రహ దీక్షలో పాల్గొన్న మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. చంద్రబాబునాయుడుపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అండతో పట్టాభి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే దాడి జరిగిందన్నారు. పట్టాభి కి మద్దతుగా చంద్రబాబు దీక్ష చేయడం సిగ్గుచేటు అన్నారు. మా సంక్షేమ…
సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా ర్యాలీలు జరుగుతున్నాయి. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్యే గణేష్ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్లో చంద్రబాబు, పట్టాభి, అయ్యన్నపాత్రుడిపై ఫిర్యాదు చేశారు. అబీద్ సెంటర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే గణేష్ మాట్లాడారు. టీడీపీ నాయకుడు…
టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై స్పందించిన ఆయన.. మేం కూడా ఢిల్లీకి వెళ్తాం.. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం అన్నారు.. ఇక, బూతులు మాట్లాడే హక్కు కోసం టీడీపీ ధర్నాలు చేస్తుందని మండిపడ్డారు సజ్జల.. దాడి చేయటం తప్పే.. కానీ, ఆ ఆగ్రహానికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు.. మిగిలిన పార్టీలు…
టీడీపీ నేతలు సవాల్ చేస్తుంటే.. వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి ఏపీ వేదికగా టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరి ఛాలెంజ్లు చేసుకుంటున్నారు. వీరి ఛాలెంజ్ లతో ఏపీ రణరంగంగా మారింది. వైపీసీ నేతలేమో పట్టాభితో పాటు చంద్రబాబును కూడా అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూంటే.. టీడీపీ నేతలేమో గుడిలాంటి మా కార్యాలయంపై దాడికి దిగడం సిగ్గుచేటని, దమ్ముంటే ఇప్పుడు రావాలంటూ సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, టీడీపీ నేత…
చంద్రబాబు దీక్షపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. మోకాలికి బోడిగుండుకు లింకుపెట్టే తత్వం చంద్రబాబుది అన్నారు. చంద్రబాబు చరిత్ర అంత కుట్రల మయమేనని, పార్టీ ఆఫీసులో రెండు బల్లలు విరిగితే రాష్ట్రపతి పాలనా పెట్టాలా..? చంద్రబాబు జీవితమే నేరాల చిట్టాఅన్నారు. వంగవీటి రంగా, మల్లెల బాజ్జీ, ఎన్టీఆర్ మరణాలకు చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. నీతికి నిలబడిన ముద్రగడ కటుంబంపై అమానుషంగా ప్రవర్తించిది మర్చిపోయారా అని ఘాటుగా వ్యాఖ్యనించారు. చంద్రబాబుకి మతిమరుపు ఎక్కువని, ఆయన…
టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా దీక్ష చేపట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అయితే, బాబు దీక్షపై సెటైర్లు వేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష అంటూ కామెంట్ చేశారు మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి.. 36 గంటలు కాదు.. 12 గంటలు కూడా ఆయన దీక్ష చేయలేరన్నారు. కేవలం అధికారం రాలేదనే సీఎం వైఎస్ జగన్ను పట్టుకుని నానా మాటలు అంటున్నారని విమర్శించారు. చంద్రబాబు దీక్ష అంటేనే దొంగ దీక్ష అని…
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం సంచలన వీడియో విడుదల చేశారు. తనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందన్న పట్టాభి ..వీడియో తేదీ, సమయం కూడా చూపించారు. తన ఒంటిపై ప్రస్తుతం ఎలాంటి గాయాలు లేవని చూపించారు పట్టాభి. పోలీసు కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని పట్టాభి ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉదంతం నేపథ్యంలో వీడియో విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు పట్టాభి. తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుపై తనకు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. ఏపీలో టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై కేంద్రం దృష్టి పెట్టాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు ఎలా ప్రవర్తించారో, అప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. అప్పట్లో ఏపీలోకి అడుగుపెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి అర్హత లేదని చంద్రబాబు అన్నారని జీవీఎల్ ఆరోపించారు. ఇప్పుడు ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఏం ముఖం…
ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం భౌతిక దాడుల వరకు వెళ్లింది. దీంతో అధికార పార్టీపై ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. ఈ అంశంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బుధవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏపీకి కేంద్ర బలగాలు పంపాలని చంద్రబాబు హోంశాఖ అధికారులకు లేఖ రాశారు. మరోవైపు వైసీపీ దాడులకు నిరసనగా…