ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అనుకున్న ముచ్చట తీరకుండానే తిరుగు టపా కట్టేశారు. ప్రధాని మోడీ.. కేంద్ర హోంమంత్రి అమిత్షాల అపాయింట్మెంట్ దక్కలేదు. ఇంతకాదు.. అంతకాదు అని బెజవాడలో చెప్పిన టీడీపీ బృందం.. హస్తినలో ఏం చేసింది? ఎందుకు అపాయింట్మెంట్ దక్కలేదు? ఇప్పుడు అమిత్ షా ఫోన్ చేయడం కలిసొస్తుందా? అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా కరుణించని ఢిల్లీ పెద్దలు? బోస్డీకే పదం సృష్టించిన సంచలనాలతో ఏపీలో రాజకీయాలు చాలా హీటెక్కాయి. ఇప్పటి వరకు టీడీపీ చేయని డిమాండ్.. రాష్ట్రపతి…
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 29న కుప్పంలో పర్యటించనున్నారు. గత పది రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్యా కుప్పంలో చంద్రబాబు పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కుప్పంలో రెండు రోజులు పర్యటించనున్న చంద్రబాబు.. 29 కుప్పంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు 30న కుప్పం పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కుప్పంలో టీడీపీ ఉనికి కొల్పొకుండా ఉండేందుకు గ్రామస్థాయి…
టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు భగ్గమన్నాయి. ఈ ఘటనపై నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు 36గంటల దీక్ష కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్ర పరిణామాలను వివరించేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీకి వెళ్లిన ఆయన సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కలిసి ఏపీలో జరుగుతున్న పరిస్థితులను వివరించారు. టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విషయంపై కూడా రాష్ట్రపతికి వెల్లడించారు. అనంతరం మంగళవారం కేంద్ర…
ఇప్పటికీ ఏపీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. గత పది రోజులుగా ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏలూరు స్మార్ట్ సిటీ చైర్మన్ గా బొద్దాని అఖిల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడని, గద్దె దిగిపోతూ దిగిపోతూ ప్రజలను కష్టాల్లోకి నెట్టేసాడంటూ ఆరోపణలు…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.. ఏపీలో పరిణామాలపై ఫిర్యాదు చేసేందుకు హస్తినకు వెళ్లింది చంద్రబాబు టీమ్.. అయితే, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సమావేశానికి ప్రయత్నించి విఫలం అయినట్టుగా తెలుస్తోంది.. దీంతో.. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కినట్టుగా చెబుతున్నారు.. కానీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమయం ఇచ్చినప్పుడు మళ్లీ ఢిల్లీకి వచ్చేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.. ఇక, ఇంగ్లీషు, హిందీ (జాతీయ మీడియా) మీడియా…
డ్రగ్స్ విషయంలో ఏపీలో రాజకీయ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. డ్రగ్స్ను అధికార పార్టీ నేతలే సరఫరా చేయిస్తున్నానరని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుంటే.. రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపేందుకే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబుకు చిన్నమెదడు చిట్లినట్లు ఉందని.. ఆయనకు మతిపోయిందని కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. చంద్రబాబు డ్రగ్స్ వాడుతున్నాడనే అనుమానం ఉందని……
అయిననూ పోయిరావలె హస్తినకు…! ఇదే కాన్సెప్ట్తో చంద్రబాబు అండ్ కో ఢిల్లీ వెళ్లిందా? దాదాపు రెండేళ్ల తర్వాత ఢిల్లీ వెళ్లిన ఆయన ఏదైనా సాధిస్తారా? ఈ సమయంలో టీడీపీ అధినేత తీసుకున్న నిర్ణయంపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? టీడీపీ ఆఫీసులపై దాడులను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు..! టీడీపీ ఆఫీస్పై దాడి చేశారనే అంశంపై ఒక రోజు రాష్ట్ర బంద్కు పిలుపిచ్చి.. మరో రెండు రోజులు దీక్ష చేపట్టిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని…
ఏపీలో రాజకీయ దుమారం రేపిన టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో మరో ఏడుగురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 16 మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. టీడీపీ కార్యాలయం ఘటనపై ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తుంటే.. చంద్రబాబు ఏపీకి సీబీఐ, కేంద్ర బలగాలు రావద్దంటూ ఉత్తర్వులు జారీ చేసి ఇప్పుడు ఎలా అడుగుతున్నారని వైసీపీ శ్రేణులు…
టీడీపీవి డర్టీ పాలిటిక్స్.. దాడుల ఫొటోలు చూపిస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ ఆఫీసుపై దాడులు ఎందుకు జరిగాయో, రాష్ట్రపతికి చంద్రబాబు వివరిస్తే మంచిదని సూచించిన ఆయన.. కుట్రలో భాగంగానే రాష్ట్రంపై పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి దిగారని.. ప్రజాభిమానం ఉన్న సీఎంపై దుర్భాషలాడి ప్రజలు రెచ్చిపోయేలా చేసి, రాష్ట్రంలో అలజడి సృష్టించాలన్నది టీడీపీ ప్రయత్నం అని ఆరోపించారు. 2019 నుంచి వరుసగా పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపల్,…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉక్కసారి కాకరేపిన టీడీపీ నేత పట్టాభిరామ్.. ఇప్పుడు ఎక్కడున్నారు? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.. సీఎం వైఎస్ జగన్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పట్టాభి ఇంటితో పాటు, టీడీపీ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి.. ఇక, సీఎంను వ్యక్తిగతంగా దూషించిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేయగా.. బెయిల్పై ఆయన విడుదలయ్యారు.. అయితే, పట్టాభి ఇప్పుడు మాల్దీవ్స్కు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. Read Also : యూపీలో కాంగ్రెస్కు షాక్.. పార్టీకి ఇద్దరు కీలక…