పెద్దిరెడ్డి ఏమైనా పుడింగా?.. నిప్పులు చెరిగిన చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ పాలన తీరుపై మండిపడ్డారు. కుప్పం ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆదరిస్తున్నారు. ఢిల్లీ వెళ్ళాను..రాష్ట్రపతిని కలిశాను. ఏపీలో పరిస్థితులను వివరించాను ఏపీలో రాష్ట్ర ప్రేరేపిత తీవ్రవాదం నడుస్తోంది. ఏపీని పరిపాలించే అర్హత వైసీపీకి లేదు. పేదప్రజలే దేవుళ్ళు-సమాజమే దేవాలయంగా ముందుకు సాగిన పార్టీ తెలుగుదేశం అన్నారు చంద్రబాబు.
పోలీసు వ్యవస్థ సహకారంతో టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. టీడీపీ ఆఫీసుపై డీజీపీ దాడి చేయించారు. కుప్పంలో పోలీసులు ఎక్కడ..? చోటా మోటా వైసీపీ నాయకులొస్తే భారీ భద్రత..ప్రతిపక్షనేత వస్తే పోలీసులు రారు..? నాపై బాంబులు వేస్తానని ఒక వైసీపీ నేత చెప్పాడు. అలిపిరిలో 24క్లైమోర్ మెన్స్ నన్ను ఏమీ చేయలేకపోయింది. నన్ను ప్రజలే కాపాడుకుంటారన్నారు. గంజాయికి కేరాఫ్ విజయవాడ మారిందని ఆరోపించారు. ఏపీ నుంచే గంజాయి సరఫరా వివిధ రాష్ట్రాలకు యథేచ్ఛగా సాగుతోంది. ప్రత్యేక హోదా తీసుకురాలేని జగన్ కొత్త మద్యం బ్రాండ్ లను తెస్తున్నాడు. మద్యపాన నిషేధానికి కొత్త అర్థం తెచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి అని విమర్శించారు.
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే మద్యం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయి. కోవిడ్ లో కర్ఫూ ఉన్నా మద్యం షాపులు బార్లా తెరిచారు. 25సంవత్సరాలు మద్యపాన నిషేధం చేసే అవకాశమే లేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆదాయం కోసం అక్రమమార్గాలు తొక్కుతున్నారు. ఏపీలో దొంగసారా తయారవుతోంది. గంజాయి, హెరాయిన్ విచ్చలవిడి వాడకం జరుగుతోంది. ఏపీని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మారుద్దాం. యువత భవిష్యత్తును కాపాడుకుందాం. పెద్దిరెడ్డి గురించి మాట్లాడితే బాంబు లేస్తారా? పెద్దిరెడ్డి ఏమైనా పుడంగా? డీజీపీ అపీసులో పని చేసే వ్యక్తి కి టీడీపీ ఆఫీసులో పనేంటి?
రెండున్నర సంవత్సరాల కాలంలో ఎన్నో బూతులు మాట్లాడారు. ఇప్పుడు నేను బూతులు మాట్లాడుతున్నా అంటారు. నేను గట్టిగా మాట్లాడతాను కానీ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడను. రేషన్ కార్డులు ఇవ్వరు.. పెన్షన్ ఇవ్వరు. నిత్యావసర ధరలు పెరిగిన కనీసం స్పందించరు . ఇక పెట్రోల్ డీజిల్ ధరల గురించి చెప్పేది లేదు అంటూ నిప్పులు చెరిగారు చంద్రబాబు.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!