పెద్దిరెడ్డి ఏమైనా పుడింగా?.. నిప్పులు చెరిగిన చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ పాలన తీరుపై మండిపడ్డారు. కుప్పం ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆదరిస్తున్నారు. ఢిల్లీ వెళ్ళాను..రాష్ట్రపతిని కలిశాను. ఏపీలో పరిస్థితులను వివరించాను ఏపీలో రాష్ట్ర ప్రేరేపిత తీవ్రవాదం నడుస్తోంది. ఏపీని పరిపాలించే అర్హత వైసీపీకి లేదు. పేదప్రజలే దేవుళ్ళు-సమాజమే దేవాలయంగా ముందుకు సాగిన పార్టీ తెలుగుదేశం అన్నారు చంద్రబాబు.
పోలీసు వ్యవస్థ సహకారంతో టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. టీడీపీ ఆఫీసుపై డీజీపీ దాడి చేయించారు. కుప్పంలో పోలీసులు ఎక్కడ..? చోటా మోటా వైసీపీ నాయకులొస్తే భారీ భద్రత..ప్రతిపక్షనేత వస్తే పోలీసులు రారు..? నాపై బాంబులు వేస్తానని ఒక వైసీపీ నేత చెప్పాడు. అలిపిరిలో 24క్లైమోర్ మెన్స్ నన్ను ఏమీ చేయలేకపోయింది. నన్ను ప్రజలే కాపాడుకుంటారన్నారు. గంజాయికి కేరాఫ్ విజయవాడ మారిందని ఆరోపించారు. ఏపీ నుంచే గంజాయి సరఫరా వివిధ రాష్ట్రాలకు యథేచ్ఛగా సాగుతోంది. ప్రత్యేక హోదా తీసుకురాలేని జగన్ కొత్త మద్యం బ్రాండ్ లను తెస్తున్నాడు. మద్యపాన నిషేధానికి కొత్త అర్థం తెచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి అని విమర్శించారు.
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే మద్యం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయి. కోవిడ్ లో కర్ఫూ ఉన్నా మద్యం షాపులు బార్లా తెరిచారు. 25సంవత్సరాలు మద్యపాన నిషేధం చేసే అవకాశమే లేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆదాయం కోసం అక్రమమార్గాలు తొక్కుతున్నారు. ఏపీలో దొంగసారా తయారవుతోంది. గంజాయి, హెరాయిన్ విచ్చలవిడి వాడకం జరుగుతోంది. ఏపీని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మారుద్దాం. యువత భవిష్యత్తును కాపాడుకుందాం. పెద్దిరెడ్డి గురించి మాట్లాడితే బాంబు లేస్తారా? పెద్దిరెడ్డి ఏమైనా పుడంగా? డీజీపీ అపీసులో పని చేసే వ్యక్తి కి టీడీపీ ఆఫీసులో పనేంటి?
రెండున్నర సంవత్సరాల కాలంలో ఎన్నో బూతులు మాట్లాడారు. ఇప్పుడు నేను బూతులు మాట్లాడుతున్నా అంటారు. నేను గట్టిగా మాట్లాడతాను కానీ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడను. రేషన్ కార్డులు ఇవ్వరు.. పెన్షన్ ఇవ్వరు. నిత్యావసర ధరలు పెరిగిన కనీసం స్పందించరు . ఇక పెట్రోల్ డీజిల్ ధరల గురించి చెప్పేది లేదు అంటూ నిప్పులు చెరిగారు చంద్రబాబు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!