దేశంలో రాబోయేది కాంగ్రెస్ పాలన.. చింతా మోహన్ జోస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీడబ్యూసీ మెంబర్ చింతామోహన్ . దేశ పరిస్థితులు బాగాలేవని, ధరలు బాగా పెరిగిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. వంటగ్యాస్ ధర మళ్ళీ పెరగబోతోందన్నారు. గ్యాస్ సిలిండర్ వెయ్యిరూపాయలు దాటబోతోందని, పెట్రోల్ డిజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆయన అన్నారు. భారత్ దేశంలో ఆకలి కేకలు ఎక్కువగా ఉన్నాయని, నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని విమర్శించారు చింతా మోహన్.
ఒకవైపు సామాన్యుడు వందరూపాయలు సంపాదించలేక ఆకలితో అలమటించి పోతుంటే.. పారిశ్రామిక వేత్తలు రోజుకు కోట్లలో సంపాదిస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలకు బదులు డ్రగ్స్ ఇస్తున్నారని, గుజరాత్ ఫోర్ట్ లో ఒక పారిశ్రామిక వేత్త దగ్గర 3 వేల కిలోల హెరాయిన్ పట్టుబడిందని, ఆయన గురించి పట్టించుకొనే వాడేలేడన్నారు. 3 వేల కిలోల హెరాయిన్ ధర 20 వేల కోట్ల రుపాయలు. అభివృద్ది అనేది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. మోడీ అభివృద్ది పేరుతో విశాఖ ఉక్కు పరిశ్రమను అదేవిధంగా రైల్వేలను అమ్మేస్తున్నారన్నారు.
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్ని రెండు సామాజిక వర్గాలు పరిపాలిస్తున్నాయని, ఒక సామాజిక వర్గం 45 సంవత్సరాలు పరిపాలిస్తే, మరో సామాజిక వర్గం 14 సంవత్సరాలు పరిపాలించిందన్నారు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని, మరో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నారని విమర్శించారు. 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ఏంచేశారో చెప్పాలన్నారు. అపాయింట్ మెంట్ ఇచ్చారా లేదా అనేది తెలియకుండా చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడన్నారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కాపు బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారన్నారు.
చంద్రబాబు నాయుడు,జగన్ మోహన్ రెడ్డిలు పరిపాలించింది చాలు ఇక వదిలిపెట్టి వెళ్లిపోవాలన్నారు. తాను చదువుకొనేటప్పుడు 18 రూపాయల అణా పైసలు స్కాలర్ షిప్ వచ్చిందన్నారు. కానీ ఏపీలో గడచిన రెండేళ్ళ నుంచి స్కాలర్ షిప్ రావడం లేదన్నారు. దీపావళి నాటికి పెండింగ్లో వున్న స్కాలర్ షిప్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు. అనంతపురము జిల్లాకు నీలం సంజీవరెడ్డి పేరు పెట్టాలన్నారు. ప్రశాంత్ కిషోర్ లు ఎంతమంది వచ్చినా వచ్చే ఎన్నికల్లో కేంద్ర రాష్టాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రాష్టంలో టీడీపీ, వైసీపీల గురించి ప్రజలు విసిగి పోయారని, కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటున్నారన్నారు.
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!