గత ఆగస్టు 24న కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకాన్ని (యూపీఎస్) ప్రకటించింది. ఇప్పుడు వీలైనంత త్వరగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతా సవ్యంగా సాగితే ఈ నెల 15న దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది.
కాంగ్రెస్.. రాహూల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రుణమాఫీ చేశారని.. ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా... 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి తీర్మానం చేసి... 18 వేల కోట్లు బ్యాంకుల ఖాతాలో వేశారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
దేశంలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్రం వెల్లడించింది. గతేడాది కంటే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో భారీగానే వసూళ్లు అయినట్లు తెలిపింది. దాదాపు 6.5 శాతం వసూళ్లు పెరిగాయి. రూ.1.73 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు స్పష్టం చేసింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి.. కేంద్రం ఏ చేయబోతోంది. ప్రైవేటీకరిస్తాం అని ఇప్పటికే చెప్పిన కేంద్రం.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిందా.. ప్రైవేటీకరణకు బదులుగా.. మరో ఆప్షన్ను ట్రై చేస్తోందా.. ఇప్పుడివే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విశాఖ స్టీల్ప్లాంట్ మనుగడకు శాశ్వత పరిష్కారంపై కేంద్రం దృష్టిపెట్టింది.
ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున చెన్నై పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్ను సీజ్ చేశారు. ఓ ముఠా కంటైనర్లో అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న దాదాపు 110 కోట్ల రూపాయల విలువైన నిషేధిత డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
కరువుతో అల్లాడుతోంది రాయలసీమ. కరువు సీమలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కోసం కడపకు కూత వేటు దూరంలోని కొప్పర్తిలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశాయి గత ప్రభుత్వాలు. భారీ పరిశ్రమలు వస్తాయి నిరుద్యోగ సమస్య తీరుతుంది అని ఆశల పల్లకిలో ఊరేగుతున్న నిరుద్యోగ యువతకు ఎన్డీఏ ప్రభుత్వం చేదువార్త అందించింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పరిశ్రమను విజయవాడలో ఏర్పాటు చేసేలా కేంద్రానికి ప్రభుత్వం నివేదికలు పంపిందట.. రాష్ట్ర రాజధాని అమరావతిలో దాదాపు…
మహిళలకు ఒక్కొక్కరికి రూ.8 లక్షల లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 3000 మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్హెచ్జి) ఈ సంవత్సరం డ్రోన్లు ఇవ్వనున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2028 నాటికి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ మేరుక ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గతంలో కూడా వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇస్రోకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో చంద్రయాన్-4, వీనస్ మిషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్, తదుపరి తరం ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి.