Vizag Steel Plant: స్టీల్ప్లాంట్కు శాశ్వత పరిష్కారం..! సెయిల్లో విలీనం..!
- విశాఖ స్టీల్ప్లాంట్ పై శాశ్వత పరిష్కారంపై కేంద్రం దృష్టి..
- ప్రైవేటీకరణకు బదులుగా.. మరో ఆప్షన్ను ట్రై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి.. కేంద్రం ఏ చేయబోతోంది. ప్రైవేటీకరిస్తాం అని ఇప్పటికే చెప్పిన కేంద్రం.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిందా.. ప్రైవేటీకరణకు బదులుగా.. మరో ఆప్షన్ను ట్రై చేస్తోందా.. ఇప్పుడివే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విశాఖ స్టీల్ప్లాంట్ మనుగడకు శాశ్వత పరిష్కారంపై కేంద్రం దృష్టిపెట్టింది. మరో ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో విలీనం చేస్తే ఎలా ఉంటుందా అనే కోణంలో దృష్టిపెట్టింది. అలాగే.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములను ఎన్ఎండీసీకి విక్రయించే ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తోంది. ఇదే అంశాలపై సెయిల్తో పాటు.. ఎన్ఎండీసీ ఛైర్మన్లతో కేంద్రం చర్చలు జరుపుతోంది.
Read Also: Hurricane Helene : ఫ్లోరిడా, జార్జియాలో హెలెన్ హరికేన్ విధ్వంసం.. 30 మంది మృతి
Also Read
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
- Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన.. మరొకరి మృతి..!
ఆర్థికంగా కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలంటే సెయిల్లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, సెయిల్లు కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బదులుగా శాశ్వత పరిష్కారం కోసం ఈ రెండింటినీ విలీనం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే.. రుణాల నుంచి బయటపడేందుకు విశాఖ స్టీల్ప్లాంట్కు చెందిన 1500 నుంచి 2000 ఎకరాల భూములను ఎన్ఎండీసీకి విక్రయించే ప్రతిపాదనలు, బ్యాంకు రుణాల వంటి అంశాలను పరిశీలిస్తోంది. స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్. దాని కోసం పెద్ద ఉద్యమమే నడిచింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్కి మనుగడ కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు గానీ.. ఏపీలో కూటమి ప్రభుత్వం దీనిపై పెద్దగా స్పందించలేదు. అయితే.. తెరవెనక చర్చలు జరుగుతున్నాయనీ, ప్రైవేటీకరణ కాకుండా ఇతర ఆప్షన్స్ చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
తాజావార్తలు
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
-
Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
-
Pakistan Minister: “చేతులు నరికేస్తాం”.. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
-
Janhvi Kapoor: టాలీవుడ్ తర్వాత కోలీవుడ్పై ఫోకస్.. భారీ వెబ్ సిరీస్తో జాన్వీ కపూర్ డిజిటల్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!