Vizag Steel Plant: స్టీల్ప్లాంట్కు శాశ్వత పరిష్కారం..! సెయిల్లో విలీనం..!
- విశాఖ స్టీల్ప్లాంట్ పై శాశ్వత పరిష్కారంపై కేంద్రం దృష్టి..
- ప్రైవేటీకరణకు బదులుగా.. మరో ఆప్షన్ను ట్రై..
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి.. కేంద్రం ఏ చేయబోతోంది. ప్రైవేటీకరిస్తాం అని ఇప్పటికే చెప్పిన కేంద్రం.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిందా.. ప్రైవేటీకరణకు బదులుగా.. మరో ఆప్షన్ను ట్రై చేస్తోందా.. ఇప్పుడివే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విశాఖ స్టీల్ప్లాంట్ మనుగడకు శాశ్వత పరిష్కారంపై కేంద్రం దృష్టిపెట్టింది. మరో ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో విలీనం చేస్తే ఎలా ఉంటుందా అనే కోణంలో దృష్టిపెట్టింది. అలాగే.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములను ఎన్ఎండీసీకి విక్రయించే ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తోంది. ఇదే అంశాలపై సెయిల్తో పాటు.. ఎన్ఎండీసీ ఛైర్మన్లతో కేంద్రం చర్చలు జరుపుతోంది.
Read Also: Hurricane Helene : ఫ్లోరిడా, జార్జియాలో హెలెన్ హరికేన్ విధ్వంసం.. 30 మంది మృతి
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐ పట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
ఆర్థికంగా కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలంటే సెయిల్లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, సెయిల్లు కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బదులుగా శాశ్వత పరిష్కారం కోసం ఈ రెండింటినీ విలీనం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే.. రుణాల నుంచి బయటపడేందుకు విశాఖ స్టీల్ప్లాంట్కు చెందిన 1500 నుంచి 2000 ఎకరాల భూములను ఎన్ఎండీసీకి విక్రయించే ప్రతిపాదనలు, బ్యాంకు రుణాల వంటి అంశాలను పరిశీలిస్తోంది. స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్. దాని కోసం పెద్ద ఉద్యమమే నడిచింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్కి మనుగడ కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు గానీ.. ఏపీలో కూటమి ప్రభుత్వం దీనిపై పెద్దగా స్పందించలేదు. అయితే.. తెరవెనక చర్చలు జరుగుతున్నాయనీ, ప్రైవేటీకరణ కాకుండా ఇతర ఆప్షన్స్ చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!