Lady Gang: విజయవాడ నగరంలోని చౌకీ సెంటర్ పరిసరాల్లో లేడీ గ్యాంగ్ దోపిడీలతో స్థానిక వ్యాపారుల అవస్థలు పడుతున్నారు. అర్థరాత్రి సమయంలో ఈ గ్యాంగ్ వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ మార్కెట్ ప్రాంతంలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తోంది.
Theft : ఒకే రోజు.. మూడు చోరీలు… పోలీసులకే సవాల్ విసిరారు దొంగలు. కానీ పోలీసులు మాత్రం ఊరికే ఊరుకుంటారా..? జస్ట్ 24 అవర్స్లో ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. కటకటాల్లోకి నెట్టారు. ఇది హైదరాబాద్ మలక్పేట్ ప్రాంతంలో జరిగింది. హైదరాబాద్లో రోజు రోజుకు చోరీలు పెరుగుతున్నాయి. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు.. మలక్పేట్ ప్రాంతంలో ఒకే రోజు మూడు చోరీలు జరిగాయి. దీంతో ఈ చోరీలను సీరియస్గా తీసుకున్న పోలీసులు… రంగంలోకి దిగి 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు.…
Cyberabad Police: సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ. ఈ సమయంలో అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శించడానికి అనువైన సమయం. అందుకే, సైబరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి ఊరికి వెళ్లే వారికి పోలీసులు ఇచ్చిన సూచనలు ఇవే.. Also Read: Software Engineer Suicide: పెళ్లయి నెల రోజులు కాకముందే సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్.. * దూర ప్రాంతాలకు వెళ్ళే వారు తమ…
దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆకాశ్ శర్మ (44) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఇంటి ముందు టపాసులు పేలుస్తున్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరు స్కూటీపై ఉండగానే ఆకాశ్ శర్మ పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు.
Viral Video : వికాస్పురిలో బైక్పై అమ్మాయితో స్టంట్స్ చేసిన యువకుడిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల సాయంతో 24 గంటల్లో యువకుడు, యువతిని పోలీసులు గుర్తించారు.
కోల్కతా అత్యాచారం కేసులో విచారణ కొనసాగుతోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్.. నేరం చేయడానికి ఒక రోజు ముందు ఆగస్టు 8న బాధితురాలిని ఛాతీ మందుల వార్డు వరకు ఫాలో అయినట్లు పోలీసులకు చెప్పాడు. ఈ క్రమంలో.. ఆసుపత్రి ఛాతీ వార్డులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. 33 మంది వ్యక్తులు బాధితురాలితో…
గుజరాత్లో రెండు కుక్కలు, రెండు సింహాల మధ్య సూపర్ ఫైటింగ్ జరిగింది. ఇరువైపుల నుంచి పోరు తీవ్రంగానే జరిగింది. కానీ ఎలాంటి హానీ లేకుండానే ఫైటింగ్ ముగిసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
10 మంది వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున న్యూ అశోక్ నగర్లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన మామే తమపై దాడి చేశారని బాధితురాలు కాజల్ ఆరోపిస్తుంది. ఆస్తి తగాదా విషయంలో దాడికి పాల్పడినట్లు చెబుతుంది.
ఓ మహిళా డ్రైవర్ ఏమరపాటుగా కారు పార్కింగ్ చేస్తుండగా ఊహించని రీతిలో విపత్తు ఎదురైంది. చూస్తుండగానే 30 మీటర్ల గుంటలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.