Theft : హైదరాబాద్లో రోజు రోజుకు పెరుగుతున్న చోరీలు
- ఒకే రోజు మూడో చోరీ.. పోలీసులకు సవాల్
- సీసీటీవీ ఆధారాలతో 24 గంటల్లో ముగ్గురు దొంగల అరెస్ట్
- ఆర్థిక కష్టాలు, జల్సాలు.. దొంగతనానికి దారి
Theft : ఒకే రోజు.. మూడు చోరీలు… పోలీసులకే సవాల్ విసిరారు దొంగలు. కానీ పోలీసులు మాత్రం ఊరికే ఊరుకుంటారా..? జస్ట్ 24 అవర్స్లో ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. కటకటాల్లోకి నెట్టారు. ఇది హైదరాబాద్ మలక్పేట్ ప్రాంతంలో జరిగింది. హైదరాబాద్లో రోజు రోజుకు చోరీలు పెరుగుతున్నాయి. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు..
మలక్పేట్ ప్రాంతంలో ఒకే రోజు మూడు చోరీలు జరిగాయి. దీంతో ఈ చోరీలను సీరియస్గా తీసుకున్న పోలీసులు… రంగంలోకి దిగి 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఈ మూడు చోరీలు కూడా ఢిఫరెంట్ స్టైల్లో జరిగాయి. కారు డిక్కీలో ఓ వ్యక్తి డబ్బు చోరీ చేశాడు. మరో ఘటనలో స్కూటర్ డిక్కీ నుంచి డబ్బు, చెక్ పుస్తకాలు కొట్టేశాడు మరో వ్యక్తి. ఇక ఓ సెల్ఫోన్ షోరూమ్ గోడకు రంధ్రం చేసి మరీ లక్షల రూపాయలు విలువ చేసే ఫోన్లు ఎత్తుకుని పారిపోయాడు ఓ దొంగ..
Also Read
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
ఇక్కడ చూడండి.. బురఖాలో ఉన్న ఇతని పేరు మహమ్మద్ వాజిద్. గతంలో మలక్పేట్ గంజ్లో ఉల్లిపాయ వ్యాపారి షేక్ ఖుద్దూస్ వద్ద పని చేసి మానేశాడు. ప్రస్తుతం టాటా ఏస్ డ్రైవింగ్ చేస్తున్నాడు. రియాసత్ నగర్ ఓవైసీ కాలనీకి చెందిన వాజిద్.. బురఖా ధరించి వచ్చి స్కూటర్ డిక్కీలో దాచి ఉంచిన 6.50 లక్షల నగదుతోపాటు చెక్ బుక్ ఎత్తుకుని వెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ, కార్మికులు ఇచ్చిన ఆధారాల ఆధారంగా కేసు ఛేదించారు పోలీసులు. మహమ్మద్ వాజిద్ని నిందితుడిగా గుర్తించారు. అతని నివాసం నుంచి అరెస్టు చేశారు. ఆర్థిక సమస్యలు, కారు కొనాలనే కోరిక కారణంగా నిందితుడు దొంగతనం చేశాడని విచారణలో తేలింది…స్పాట్..
ఇక్కడ చూడండి.. ఇది దిల్సుఖ్ నగర్లోని బిగ్ సీ సెల్ఫోన్ షో రూమ్. ఈ గోడకు రంధ్రం చేసి.. అర్ధరాత్రి దొంగ లోపలికి ప్రవేశించాడు. లక్షల రూపాయల విలువ చేసే ఫోన్లు ఎత్తుకుని పోయాడు. అతడు చోరీ చేసిన సమయంలో సీసీ కెమెరాలు ఆన్లోనే ఉన్నాయి. వాటిల్లో దొంగతనం దృశ్యాలు రికార్డయ్యాయి. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా అతన్ని రంజన్ దాస్గా గుర్తించారు పోలీసులు. మద్యానికి బానిసయ్యాడు. అతనికి ఇల్లు లేదు. నాంపల్లి నీలోఫర్ ఆస్పత్రి వద్ద ఫుట్ పాత్పై నివసిస్తున్నట్లు గుర్తించారు. విలాసవంతమైన జీవితం గడపాలనే కోరికతో చోరీలు చేస్తున్నారని తెలిపారు పోలీసులు.. స్పాట్..
డీసీపీ చైతన్య కుమార్ మాట్లాడుతూ.. ఆర్ధిక అవసరాలు, జల్సాలు.. విలాసవంతమైన జీవితం కోసం ఎవరు దొంగతనం చేసినా అది నేరమే అవుతుంది. అలాంటి హైఫై జీవితం గడపాలంటే కష్టపడి డబ్బు సంపాదించాలి తప్ప ఇలాంటి నేరాలకు అలవాటు పడితే జైలులో జీవితం గడపాల్సి వస్తుందని పోలీసులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో