Delhi: ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి..
- ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు.. రాడ్లతో దాడి
- ఆదివారం తెల్లవారుజామున న్యూ అశోక్ నగర్లో ఘటన
- దాడిలో గాయపడ్డ ఆరుగురు
- ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
- తన మామే దాడి చేశారని బాధితురాలు కాజల్ ఆరోపణ
- ఆస్తి తగాదా విషయంలో దాడికి పాల్పడినట్లు చెబుతున్న కాజల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
10 మంది వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున న్యూ అశోక్ నగర్లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన మామే తమపై దాడి చేశారని బాధితురాలు కాజల్ ఆరోపిస్తుంది. ఆస్తి తగాదా విషయంలో దాడికి పాల్పడినట్లు చెబుతుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.
Read Also: Paris Olympics: మాజీ క్రికెటర్ కుమారుడికి ఒలింపిక్స్ లో రెండు స్వర్ణాలు..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
కాగా.. ఈ దాడిలో గాయపడిన వారిలో కాజల్, తండ్రి విమల్ అగర్వాల్, తల్లి సునీత, సోదరుడు అభిషేక్, 17 ఏళ్ల సోదరి.. 11 ఏళ్ల సోదరుడు ఉన్నారు. విమల్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మామ రామ్విలాస్తో కుటుంబానికి ఆస్తి తగాదాలు ఉన్నాయని అభిషేక్ పోలీసులకు చెప్పాడు. ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది.. అయితే మార్చిలో తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చిందని బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో.. అప్పటి నుంచి తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. మార్చి 9న తమపై దాడి చేశాడని.. ఆగస్టు 4న నోయిడాలో తన తండ్రిపై దాడికి పాల్పడ్డారని అభిషేక్ చెప్పాడు. తాజాగా.. మరోసారి పది మంది తమ ఇంట్లోకి వచ్చి దాడి చేశారని చెబుతున్నారు.
Read Also: AP Police: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలోనే పోలీస్ శాఖలో కొలువుల భర్తీ!
కాగా.. ఈ దాడికి సంబంధించిన ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. కాజల్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఆమె మేనమామ రాంవిలాస్, అతని కుమారులు చిత్రాంశు, ప్రియాంషు, బేతు.. మరికొందరు తమ కుటుంబంపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. నిందితుల కోసం వెతుకుతున్నారు.
देखिए दिल्ली के न्यू अशोक नगर इलाके का एक CCTV वीडियो सामने आया है,जिसमें करीब 10 लोग नक़ाब डाले हुए एक घर में घुसकर परिवार से मारपीट करते नज़र आ रहे है तेज़ चीख पुकार की आवाजे सुनाई दे रही है @DelhiPolice pic.twitter.com/aIee1Vu7vH
— Lavely Bakshi (@lavelybakshi) August 11, 2024
తాజావార్తలు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!