Delhi: ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి..
- ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు.. రాడ్లతో దాడి
- ఆదివారం తెల్లవారుజామున న్యూ అశోక్ నగర్లో ఘటన
- దాడిలో గాయపడ్డ ఆరుగురు
- ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
- తన మామే దాడి చేశారని బాధితురాలు కాజల్ ఆరోపణ
- ఆస్తి తగాదా విషయంలో దాడికి పాల్పడినట్లు చెబుతున్న కాజల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
10 మంది వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున న్యూ అశోక్ నగర్లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన మామే తమపై దాడి చేశారని బాధితురాలు కాజల్ ఆరోపిస్తుంది. ఆస్తి తగాదా విషయంలో దాడికి పాల్పడినట్లు చెబుతుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.
Read Also: Paris Olympics: మాజీ క్రికెటర్ కుమారుడికి ఒలింపిక్స్ లో రెండు స్వర్ణాలు..
Also Read
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
కాగా.. ఈ దాడిలో గాయపడిన వారిలో కాజల్, తండ్రి విమల్ అగర్వాల్, తల్లి సునీత, సోదరుడు అభిషేక్, 17 ఏళ్ల సోదరి.. 11 ఏళ్ల సోదరుడు ఉన్నారు. విమల్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మామ రామ్విలాస్తో కుటుంబానికి ఆస్తి తగాదాలు ఉన్నాయని అభిషేక్ పోలీసులకు చెప్పాడు. ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది.. అయితే మార్చిలో తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చిందని బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో.. అప్పటి నుంచి తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. మార్చి 9న తమపై దాడి చేశాడని.. ఆగస్టు 4న నోయిడాలో తన తండ్రిపై దాడికి పాల్పడ్డారని అభిషేక్ చెప్పాడు. తాజాగా.. మరోసారి పది మంది తమ ఇంట్లోకి వచ్చి దాడి చేశారని చెబుతున్నారు.
Read Also: AP Police: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలోనే పోలీస్ శాఖలో కొలువుల భర్తీ!
కాగా.. ఈ దాడికి సంబంధించిన ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. కాజల్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఆమె మేనమామ రాంవిలాస్, అతని కుమారులు చిత్రాంశు, ప్రియాంషు, బేతు.. మరికొందరు తమ కుటుంబంపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. నిందితుల కోసం వెతుకుతున్నారు.
देखिए दिल्ली के न्यू अशोक नगर इलाके का एक CCTV वीडियो सामने आया है,जिसमें करीब 10 लोग नक़ाब डाले हुए एक घर में घुसकर परिवार से मारपीट करते नज़र आ रहे है तेज़ चीख पुकार की आवाजे सुनाई दे रही है @DelhiPolice pic.twitter.com/aIee1Vu7vH
— Lavely Bakshi (@lavelybakshi) August 11, 2024
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!