Delhi: ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి..
- ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు.. రాడ్లతో దాడి
- ఆదివారం తెల్లవారుజామున న్యూ అశోక్ నగర్లో ఘటన
- దాడిలో గాయపడ్డ ఆరుగురు
- ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
- తన మామే దాడి చేశారని బాధితురాలు కాజల్ ఆరోపణ
- ఆస్తి తగాదా విషయంలో దాడికి పాల్పడినట్లు చెబుతున్న కాజల్.
10 మంది వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున న్యూ అశోక్ నగర్లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన మామే తమపై దాడి చేశారని బాధితురాలు కాజల్ ఆరోపిస్తుంది. ఆస్తి తగాదా విషయంలో దాడికి పాల్పడినట్లు చెబుతుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.
Read Also: Paris Olympics: మాజీ క్రికెటర్ కుమారుడికి ఒలింపిక్స్ లో రెండు స్వర్ణాలు..
Also Read
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
కాగా.. ఈ దాడిలో గాయపడిన వారిలో కాజల్, తండ్రి విమల్ అగర్వాల్, తల్లి సునీత, సోదరుడు అభిషేక్, 17 ఏళ్ల సోదరి.. 11 ఏళ్ల సోదరుడు ఉన్నారు. విమల్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మామ రామ్విలాస్తో కుటుంబానికి ఆస్తి తగాదాలు ఉన్నాయని అభిషేక్ పోలీసులకు చెప్పాడు. ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది.. అయితే మార్చిలో తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చిందని బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో.. అప్పటి నుంచి తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. మార్చి 9న తమపై దాడి చేశాడని.. ఆగస్టు 4న నోయిడాలో తన తండ్రిపై దాడికి పాల్పడ్డారని అభిషేక్ చెప్పాడు. తాజాగా.. మరోసారి పది మంది తమ ఇంట్లోకి వచ్చి దాడి చేశారని చెబుతున్నారు.
Read Also: AP Police: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలోనే పోలీస్ శాఖలో కొలువుల భర్తీ!
కాగా.. ఈ దాడికి సంబంధించిన ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. కాజల్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఆమె మేనమామ రాంవిలాస్, అతని కుమారులు చిత్రాంశు, ప్రియాంషు, బేతు.. మరికొందరు తమ కుటుంబంపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. నిందితుల కోసం వెతుకుతున్నారు.
देखिए दिल्ली के न्यू अशोक नगर इलाके का एक CCTV वीडियो सामने आया है,जिसमें करीब 10 लोग नक़ाब डाले हुए एक घर में घुसकर परिवार से मारपीट करते नज़र आ रहे है तेज़ चीख पुकार की आवाजे सुनाई दे रही है @DelhiPolice pic.twitter.com/aIee1Vu7vH
— Lavely Bakshi (@lavelybakshi) August 11, 2024
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!