Delhi: ఢిల్లీలో దారుణం.. దీపావళి సంబరాల్లో కాల్పులు.. ఇద్దరి హత్య
- ఢిల్లీలో దారుణం
- దీపావళి సంబరాల్లో కాల్పులు
- ఇద్దరి హత్య.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆకాశ్ శర్మ (44) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఇంటి ముందు టపాసులు పేలుస్తున్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరు స్కూటీపై ఉండగానే ఆకాశ్ శర్మ పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. నిలబడి ఉన్న మరో వ్యక్తి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఐదు రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిందితులను వెంబడించిన మేనల్లుడిపై కూడా కాల్పులు జరపడంతో అతడు కూడా చనిపోయాడు. ఒకేరోజు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: ChatGPT Search Engine: గూగుల్కు చెక్ పెట్టేందుకు చాట్జీపీటీ సెర్చ్ఇంజిన్ రెడీ..
Also Read
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
గురువారం దీపావళి సందర్భంగా ఢిల్లీలోని షాహదారాలోని ఫార్ష్ బజార్ ప్రాంతంలో ఓ కుటంబం ఇంటి ముందు టపాసులు పేలుస్తున్నారు. ఆకాశ్ శర్మ (44), మేనల్లుడు రిషబ్ శర్మ (16), కుమారుడు క్రిష్ శర్మ (15) ఇంటి ముందు దీపావళి టపాసులు కాలుస్తున్నారు. అప్పుడే ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు శర్మ ఇంటి ముందు ఆగి నమ్మకంగా నటించారు. కానీ జరగబోయే విపత్తును ఆకాశ్ శర్మ ఊహించలేకపోయాడు. పిల్లలు టపాసులు వెలిగిస్తుండగా.. ఆకాశ్ శర్మ ఇంటి గేటు తీసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతలో నిందితుల్లో ఒకడు తుపాకీ తీసుకుని ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. గేటు దగ్గరే చనిపోయాడు. ఈ ఘటనతో అక్కడే ఉన్న పిల్లలు షాక్ అయ్యారు. పారిపోతున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా మేనల్లుడిపై కూడా కాల్పులు జరపడంతో రిషబ్ శర్మ కూడా చనిపోయాడు. కుమారుడు క్రిష్ శర్మ గాయపడడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: RBI Repo Rate: రెపో రేటును 25 పాయింట్లు తగ్గించనున్న ఆర్బీఐ?
దూరపు బంధువైన యువకుడు ఆకాశ్ శర్మకు నెల రోజుల క్రితం రూ.70,000 అప్పుగా ఇచ్చాడు. అయితే ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో ఈ ఘాతుకానికి తెగబడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయంలో మృతుడిపై ఇదే వరకే కేసు నమోదైందని వెల్లడించారు. ఇక ఈ కేసులో నిందితుల్లో ఒకరైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ కోసం యువకుడు సుపారీ ఇచ్చి షూటర్ను నియమించుకున్నాడు. నిందితులు 17 రోజుల క్రితమే హత్యకు ప్లాన్ చేశారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
Farsh Bazaar double murder cctv
A man and his cousin shot dead while celebrating Diwali. #delhimurder #DelhiPolice #Delhicrime pic.twitter.com/Z8b4iFkS3f— Shehla J (@Shehl) November 1, 2024
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!