Delhi: ఢిల్లీలో దారుణం.. దీపావళి సంబరాల్లో కాల్పులు.. ఇద్దరి హత్య
- ఢిల్లీలో దారుణం
- దీపావళి సంబరాల్లో కాల్పులు
- ఇద్దరి హత్య.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆకాశ్ శర్మ (44) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఇంటి ముందు టపాసులు పేలుస్తున్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరు స్కూటీపై ఉండగానే ఆకాశ్ శర్మ పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. నిలబడి ఉన్న మరో వ్యక్తి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఐదు రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిందితులను వెంబడించిన మేనల్లుడిపై కూడా కాల్పులు జరపడంతో అతడు కూడా చనిపోయాడు. ఒకేరోజు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: ChatGPT Search Engine: గూగుల్కు చెక్ పెట్టేందుకు చాట్జీపీటీ సెర్చ్ఇంజిన్ రెడీ..
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
గురువారం దీపావళి సందర్భంగా ఢిల్లీలోని షాహదారాలోని ఫార్ష్ బజార్ ప్రాంతంలో ఓ కుటంబం ఇంటి ముందు టపాసులు పేలుస్తున్నారు. ఆకాశ్ శర్మ (44), మేనల్లుడు రిషబ్ శర్మ (16), కుమారుడు క్రిష్ శర్మ (15) ఇంటి ముందు దీపావళి టపాసులు కాలుస్తున్నారు. అప్పుడే ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు శర్మ ఇంటి ముందు ఆగి నమ్మకంగా నటించారు. కానీ జరగబోయే విపత్తును ఆకాశ్ శర్మ ఊహించలేకపోయాడు. పిల్లలు టపాసులు వెలిగిస్తుండగా.. ఆకాశ్ శర్మ ఇంటి గేటు తీసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతలో నిందితుల్లో ఒకడు తుపాకీ తీసుకుని ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. గేటు దగ్గరే చనిపోయాడు. ఈ ఘటనతో అక్కడే ఉన్న పిల్లలు షాక్ అయ్యారు. పారిపోతున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా మేనల్లుడిపై కూడా కాల్పులు జరపడంతో రిషబ్ శర్మ కూడా చనిపోయాడు. కుమారుడు క్రిష్ శర్మ గాయపడడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: RBI Repo Rate: రెపో రేటును 25 పాయింట్లు తగ్గించనున్న ఆర్బీఐ?
దూరపు బంధువైన యువకుడు ఆకాశ్ శర్మకు నెల రోజుల క్రితం రూ.70,000 అప్పుగా ఇచ్చాడు. అయితే ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో ఈ ఘాతుకానికి తెగబడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయంలో మృతుడిపై ఇదే వరకే కేసు నమోదైందని వెల్లడించారు. ఇక ఈ కేసులో నిందితుల్లో ఒకరైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ కోసం యువకుడు సుపారీ ఇచ్చి షూటర్ను నియమించుకున్నాడు. నిందితులు 17 రోజుల క్రితమే హత్యకు ప్లాన్ చేశారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
Farsh Bazaar double murder cctv
A man and his cousin shot dead while celebrating Diwali. #delhimurder #DelhiPolice #Delhicrime pic.twitter.com/Z8b4iFkS3f— Shehla J (@Shehl) November 1, 2024
తాజావార్తలు
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!