తెలంగాణలో అధికార బీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య.. మాటల యుద్ధంతో పాటు సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా చెప్పుతో కొట్టుకునే వ్యాఖ్యలు రచ్చ చేస్తున్నాయి.. ఇప్పుడు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి బహిరంగ సవాల్ విసిరారు.. మా ముఖ్యమంత్రి కేసీఆర్పైన ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.. ఈ రాష్ట్రంలో జరిగినట్లుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు చూపించిన నేను రాజీనామా చేస్తాను…
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరికి నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని.. తెలంగాణ రైతులు ఈ ఆందోళన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని, వారితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కేంద్రం వైఖరికి నిరసనగా ఉద్యమించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
Errabelli Dayakar Rao criticizes Chandrababu Naidu: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. ఆంధ్రాలో, తెలంగాణలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. టీడీపీ చంద్రబాబు పార్టీ కాదని అన్నారు. టీడీపీ ఎన్టీరామారావు పార్టీ అని అన్నారు. మధ్యలో వచ్చినవాడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ఎన్టీఆర్ని చంద్రబాబు మోసం చేశాడని.. ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే ఆయన కుటుంబానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కుట్రపూరితంగా తన కొడుకును…
Niranjan Reddy criticizes BJP and Kishan Reddy: ఉపాధి హామీ పనుల కింద కల్లాల నిర్మానాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని.. కానీ ఈ పనులు చేయడానికి వీలు లేదని కేంద్రం తెలంగాణకు నోటీసులు ఇచ్చింది.. రైతుల కోసం కల్లాలు కట్టడం నేరామా..? అని ప్రశ్నించారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఉపాధి హమీ పనుల్లో వ్యవసాయ ఉత్పత్తి పెంచే పనులు చేసుకోవచ్చని చట్టం చెబుతోందని ఆయన అన్నారు. అయినా కేంద్రం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
Minister Harish Rao criticizes BJP: తెలంగాణ రాకపోతే మహబూబ్ నగర్ కు మెడికల్ కాలేజీలు వచ్చేవా..? అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. మహబూబ్ నగర్ లో గురువారం 1000 పడకల సూపర్ స్పెషాలిటి ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. రూ.300 కోట్లతో ఆస్పత్రిని నిర్మిస్తున్నామని అన్నారు. క్యాన్సర్ తో పాటు అన్ని రకాల వైద్యసేవలు ఇక్కడే అందుబాటులో ఉంటాయని తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి మెడికల్ మహబూబ్ నగర్ కి…
CM KCR will visit Maharashtra in ten days, Minister Indrakaran Reddy: భారత రాష్ట్ర సమితిని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు సీఎం కేసీఆర్. ఇప్పటికే వచ్చే కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ మహారాష్ట్రలో కూడా పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా ఈ రోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మహారాష్ట్రలో పర్యటించారు. నాందేడ్ జిల్లా కీనిలో ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలతో సమావేశం అయ్యారు. తెలంగాణలో రైతులు…
Bandi Sanjay criticizes Minister KTR: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా ఉంది. ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్, కేటీఆర్ పై విమర్శలు చేశారు. కేటీఆర్ విత్ డ్రావల్ సిమ్టమ్స్ తో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే పిచ్చిపిచ్చిగా వాగుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన…
Gangula Kamalakar: సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలకతీతంగా అందరూ పోరాటం చేసారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ సంపద పెరిగిందని అన్నారు. హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని అన్నారు. ఉమ్మడి రాజధాని విషయంలో 10 ఏండ్ల గడువుందని పేర్కొన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వై.ఎస్. బిడ్డ వెరైటీ ముసుగుతో ఇక్కడకొచ్చిందని ఎద్దేవ చేశారు.…
బీఆర్ఎస్ ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా చర్చ మొదలైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో బీఆర్ఎస్ను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా అది పేదల కోసమేనని అన్నారు.
తెలంగాణ నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి చంద్ర బాబు అంటూ మంత్రి హరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్ర బాబు ఆంధ్ర ప్రజల చేతుల్లో చిత్కరంకు గురి ఆయ్యారని పేర్కొన్నారు. చంద్ర బాబు పాలన బాగా లేదని ఎపి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని గుర్తు చేశారు.