Congress and BRS Alliance: బీఆర్ఎస్తో పొత్తుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపిందట..! మేం ఎప్పుడో చెప్పాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress and BRS Alliance: తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది.. జాతీయ రాజకీయాల్లో ప్రవేశించిన కేసీఆర్.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేశారు.. అయితే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కలిసి కేసీఆర్ పనిచేస్తారని ఆది నుంచి ఆరోపిస్తూ వస్తోంది భారతీయ జనతా పార్టీ.. మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుపై హాట్ కామెంట్లు చేశారు.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి.. కాంగ్రెస్.. బీఆర్ఎస్తో పొత్తుకు అంగీకారం తెలిపిందని వార్తలు వస్తున్నాయన్న ఆయన.. ఈ విషయాన్ని మేం ఎప్పుడో చెప్పాం అన్నారు.. అధికారం కోసం వాళ్లిద్దరూ ఒక్కటి అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు.. ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టడం చూస్తుంటే.. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మోరిగినట్టు ఉందని విమర్శలు గుప్పించారు.
Read Also: Veera Simha Reddy Pre Release Event Live: వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్
Also Read
- Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
ఇక, రేపు తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించనున్నట్టు వెల్లడించారు ప్రేమేందర్రెడ్డి.. ఈ సమ్మేళనాన్ని ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ గా సందేశం ఇస్తారని తెలిపారు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బూత్ కమిటీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారని.. జూబ్లీ హిల్స్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గద్వాల్ లో డీకే అరుణ, ముషీరాబాద్ లో డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొంటారని వివరించారు.. మరోవైపు.. రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం పట్ల తీవ్ర విముఖతతో ఉన్నారని.. కేసీఆర్ కేవలం కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని ఆరోపించారు.. తెలంగాణ ప్రజలు ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ వైపు చూస్తున్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి.
తాజావార్తలు
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!