Bandi Sanjay: కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్.. రాజీనామా పత్రంతో రమ్మను..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
bandi sanjay fire KTR and KCR: కేంద్ర నిధులపై కేటీఆర్ మీ అయ్యతో చర్చకు సిద్దం.. రాజీనామ పత్రం పట్టుకొని మీ అయ్యను రమ్మను అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సవాల్ చేసి తోక ముడుచుకొని పారిపోయింది మీరంటూ గుర్తు చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడండి .. రాజకీయాలు తర్వాత అంటూ చురకలంటించారు. రుణ మాఫీ చేయక పోవడం వల్ల రైతు బందు నిధులను బ్యాంక్ లు తమ ఖాతాలో వేసుకున్నాయని ఆరోపించారు. నాలుగైదు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని కార్యకర్తలను జైళ్లకు పంపించే కుట్ర కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల లిస్ట్ నుండి బీజేపీ వాళ్ళ ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతుంని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు లిస్ట్ ను చెక్ చేసుకోండని, ఓట్లను నమోదు చేసుకోవాలని, మన వల్ల ఓట్లను నమోదు చేయించండని అన్నారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అంటే పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతోనే సాధ్యమన్నారు. బూత్ కమిటీ సభ్యుడు బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు కావొచ్చు జాతీయ అధ్యక్షుడు కావొచ్చు కేసీఆర్ కుటుంబ సభ్యులు కేంద్ర నిధులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండపిడ్డారు బండి సంజయ్.
Read also: Hyderabad Crime: అమ్మాయిలకు వల.. 60 వేల జీతం అంటూ వ్యభిచారం
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. 22 నోటిఫికేషన్ లు 20 వేల ఉద్యోగాలకు మాత్రమే ఇచ్చిందని, ఎంతమందికి నియామక పత్రాలు ఇచ్చిందో ఈ ప్రభుత్వం చెప్పడం లేదని బండి సంజయ్ అన్నారు. మద్యం వల్ల వచ్చే ఆదాయం అంతకు పది వేలు ఎక్కువ వస్తుందని అన్నారు. మిగతా ఆదాయం అంతా ఎటు పోయింది? అని ప్రశ్నించారు. ప్రజలు కట్టిన పన్ను ఎటు పోయిందో జాడ లేదన్నారు. బీజేపీకి అధికారం ప్రజల కోసమన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఉంటుందని మరో సారి బయట పడ్డదని అన్నారు. ఇప్పుడు పోయి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై ఫిర్యాదు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు నకల్ కొట్ట డానికి అఖల్ ఉండాలని కాంగ్రెస్ ను విమర్శించారు. హిందూ దేవి దేవతలను కించ పరుస్తూ ఉంటే భారిద్దామా? అంటూ ప్రశ్నించారు. హిందూ దేవతలను అవమానిస్తే.. కొడుకులను ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రహించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sankranti Holidays: తెలంగాణ స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు.. ఎప్పటినుంచంటే?
తాజావార్తలు
-
Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్..!
-
Summer: డీహైడ్రేషన్ నుంచి రక్షణ.. వేసవిలో మీరు తాగాల్సిన, వదిలేయాల్సిన పానీయాలు ఇవే!
-
Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
-
Vijay-Trisha: “గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం”.. విజయ్తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!
-
Finn Allen Century: ఒక్క సెంచరీ, ఎన్నో అరుదైన రికార్డులు.. ఫెంటాస్టిక్ ఫిన్ అలెన్!