Pilot Rohith Reddy: ఇది కాంగ్రెస్, బీజేపీ కుట్ర.. నాలుగేళ్ల నుంచి ఏం చేశారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాపై కేసు వెనుక కాంగ్రెస్, బీజేపీ కుట్ర దాగిఉందని ఆరోపించారు బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసిన విషయంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు రోహిత్రెడ్డి.. మాపై మొయినాబాద్ పీఎస్లో ఫిర్యాదు కాంగ్రెస్, బీజేపీ కుట్రగా అభివర్ణించారు.. మేం పార్టీ మారితే.. నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది? అని నిలదీసిన ఆయన.. రాజ్యాంగబద్ధంగా బీఆర్ఎస్లో 12 మంది ఎమ్మెల్యేలం కాంగ్రెస్ పార్టీ నుంచి విలీనం అయ్యామని స్పష్టం చేశారు.. అయితే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరు దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఉందని విమర్శలు గుప్పించారు.. ఏం భయపడే లేదు.. దేనికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లో చేరినట్టు ప్రకటించారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి..
Read Also: CBI: ఎమ్మెల్యేల ఎర కేసు.. సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగింత..
Also Read
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
కాగా, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మొత్తంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కేంద్రంగా నడిచిన విషయం విదితమే.. అయితే, ఆ తర్వాత ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రెండు రోజుల పాటు రోహిత్రెడ్డిని ప్రశ్నించారు.. రోహిత్ రెడ్డి ఆస్తులు, వ్యాపారా లావాదేవీలపై అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఫైలట్ కుటుంబసభ్యుల బ్యాంక్ ఖాతాలు, కంపెనీ వివరాలపై ప్రశ్నించారు. 17 బ్యాంక్ ఖాతాలు, 3 లాకర్ల వివరాలతో ఎమ్మెల్యే విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయమై తనను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిపారు. తాను ఈ కేసులో ఫిర్యాదు చేస్తే.. తనను ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఫైలట్ మీడియాతో వెల్లడించారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తనను ఈడీ ఎందుకు విచారిస్తుందో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే.. మొత్తంగా ఎమ్మెల్యేల ఎరకేసు వెలుగు చూసిన తర్వాత.. రోహిత్ రెడ్డిపై కొత్త కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
#BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. “ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి”
-
Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
-
Jana Nayakudu: ‘జన నాయకుడు’ పోస్టర్తో అంచనాలు పెంచిన విజయ్.. జూలై 23న బాక్సాఫీస్పై దండయాత్ర!
-
Delimitation bill: ఇండియా కూటమికి షాక్.. డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..
-
Kiran Abbavaram: జన నాయగన్ వచ్చినా వెనక్కి తగ్గేది లేదు !
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!