అధికారపక్షం ఆగడాలు శృతిమించాయని.. ఈఅరాచకం ఎక్కువ రోజులు చెల్లదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణలో తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను బీఆర్ఎస్ నేతలు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేధిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ ప్రకటన విడుదల చేసారు. బీఆర్ఎస్ నాందేడ్ సభపై ఆయన విమర్శలు గుప్పించారు. నిన్న మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ నిర్వహించిన జాతీయ సభ తుస్సు మందని ఎద్దేవ చేశారు.
ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. నేడు నాందేడ్ కు సీఎం కేసీఆర్ బయలు దేరనున్నారు. అక్కడ భారీ భహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కేసీఆర్ సమక్షంలో మరాఠా నాయకులు బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
Off The Record: అసమ్మతి.. అసంతృప్తి…! ప్రస్తుతం తెలంగాణలో ఒక మున్సిపాలిటీ నుంచి మరో మున్సిపాలిటీకి పాకుతున్న రాజకీయ అలజడి. పదవులపై ఆశ కలుగుతుందో లేక ఎమ్మెల్యేలు, మంత్రులపై ఉన్న ఆగ్రహమో కానీ.. మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి నుంచి నగర పంచాయితీల వరకు ఒకే సీన్ కనిపిస్తోంది. మొదట్లో రాజధానికి ఆనుకుని ఉన్న కొన్ని పురపాలికల్లో బీజంపడ్డ అసమ్మతి ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ అధికాపార్టీలో కంపనాలు తీసుకొస్తోంది. అధిష్ఠానం వారిస్తున్నా.. ఎమ్మెల్యేలు బుజ్జగిస్తున్నా స్థానిక సంస్థల్లోని ప్రజాప్రతినిధులు…
ఏ పార్టీ వ్యవహారాలకైనా పార్లమెంటు సమావేశాలు చాలా కీలకం. అధికార పార్టీపై విపక్షాలు ఎటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాయి? ఏ అంశాల్లో అధికారపార్టీని ఇరుకున పెడుతున్నాయో తెలిసిపోతుంది. కొన్ని అంశాలపై అజెండాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీలు కలిసి నడుస్తాయి. దేశంలో గుణాత్మక మార్పులు రావాలి.. అది భారత రాష్ట్ర సమితితోనే సాధ్యమని చెబుతున్నారు గులాబీ నేతలు. అందుకే బీజేపీ, కాంగ్రెస్లకు వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలను కలుపుకొని వెళ్లేందుకు చూస్తున్నారు కూడా. ఈ వ్యూహంలో భాగంగా పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు…