Inappropriate posts on Secretariat: సచివాలయంపై అనుచిత వ్యాఖ్యలు.. కరీంనగర్ కు చెందిన వ్యక్తి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inappropriate posts on Secretariat: తెలంగాణ నూతన సచివాలయం కొత్తరూపకల్పనకు రూపుదిద్దుకుంటోంది. అయితే నూతన సచివాలయం మొదలు పెట్టినప్పటి నుంచి సచివాలయంపై పలు పార్టీనేతలు, మరి కొందరు ఆకతాయిలు షోషల్ మీడియా పోస్ట్లు తీవ్ర వివాదానికి సృష్టించాయి. దీనిపై ఫోకస్ పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు వారిని అదుపులో తీసుకున్నారు. నూతన సచివాలయంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ యువకుడు బీజేపీ కార్యకర్తగా గుర్తించారు. ఆయువకుడిపై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు.
Read also: Earthquake in Suryapet: సూర్యాపేట జిల్లాలో భూకంపం.. పరుగులు తీసిన జనం
Also Read
అసలు ఏం జరిగింది:
తెలంగాణ నూతన సచివాలయం అగ్నిప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులను, కామెంట్లు బీజేపీ కార్యర్తలు పెట్టారు. నూతన సచివాలయంలో చలిమాంటల వల్ల ప్రమాదం జరిగిందని ఫెస్బుక్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కు ఓ బీజేపీ కార్యకర్త రీ పోస్ట్ చేస్తూ క్షుద్రపూజలు చేసారంటూ కామెంట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చిన ఆపోస్ట్ తీవ్ర దుమారం రేపింది. సచివాలయంలో క్షుద్రపూజలు చేసారంటూ కరంనగర్ కు చెందిన పరందామయ్యా బీజేపీ కార్యకర్తంగా గుర్తించారు. పరందమయ్యపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై లాఠీ ఝురి చూపించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. సచివాలయం పై పార్టీ కార్యకర్తలపై సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసిన పోస్ట్ లు చేసి వైరల్ చేసి ప్రజలను భయబ్రాంతులు చేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసుల చెబుతున్నారు. ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. పరందామయ్యా తనే ఉద్దేశపూర్వకంగా ఈ పోస్ట్ లు పెట్టాడా? లేక పరందామయ్యను ప్రేరేపించి పోస్ట్లు పెట్టుందుకు సమర్ధించారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తు్న్నారు.
Taraka Ratna: తండ్రిని చూసి వెక్కి వెక్కి ఏడ్చిన కూతురు.. కన్నీధారను ఓదార్చేవారెవరు
అయితే.. ఇది ఉండగా.. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. కరీంనగర్ కి చెందిన బీజేపీ కార్యకర్త పరందామయ్యా పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై, వారి కుటుంబంపై ఏం మాట్లాడినా కేసులు పెడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. బీజేపీ నాయకులపై వాఖ్యలు చేసిన టీఆర్ఎస్ పై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయడంలేదని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Worse in Narsinghi: నార్సింగీ లో దారుణం.. మద్యం తాగించి కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్
తాజావార్తలు
-
Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
-
Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
-
Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!