Supreme Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఆరోజుకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 7న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల 8న విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును నేడు విచారించనున్నట్లు ప్రకటించారు. ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున దుశ్వంత్ ధావే వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల ప్రలోభాలకు సంబంధించిన కీలక అంశాలు సిట్ విచారణలో వెలుగుచూశాయని దుష్యంత్ ధావే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
Read also: Sunday Funday: నగర ప్రజలకు గుడ్ న్యూస్.. మరింత ఆకర్షణీయంగా సన్డే ఫన్డే..
Also Read
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
ఈ ఆధారాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని ధావే హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సాక్ష్యాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని ధావే ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ సాక్ష్యాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని ధావే అన్నారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని దుష్యంత్ ధావే కోరారు. ఈడీ, సీబీఐ, ఐటీ కేసులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మెటీరియల్స్ మీడియాకు లీక్ అవుతున్నాయని, వీటిని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించిన ఆధారాలను మీడియాతో పాటు న్యాయమూర్తులకు పంపించామని దుష్యంత్ ధావే గుర్తు చేశారు. ఈ కేసును ఈ నెల 27న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
Big Breking: పేలిన బెలూన్లు.. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు గాయాలు
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!