BRS Leaders Unity: పొంగులేటికి వ్యతిరేకంగా ఐక్యతా సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేతలు ఒక విషయంలో ఐక్యతారాగం వినిపిస్తున్నారు. వారంతా ఒక్క త్రాటి మీదకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం కొలిక్కి వస్తాయో కాని, వారి సమావేశాలు మాత్రం అందరిని ఆకర్షిస్తున్నాయంట. ఇప్పటికే ఒక్క దఫా హైదరాబాద్ లో సమావేశాలు అయిన నేతలు మరోసారి ఖమ్మంలో సమావేశం కానున్నారు. ఇది అంతా మాజీ ఎంపి పొంగులేటిని ఎదుర్కోవడం కోసం అధిష్టానం చూసించిన మేరకు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ యేడాది ప్రారంభం నుంచి ఆత్మీయ సమావేశాల పేరిట మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీలో సస్పెన్షన్ ల పర్వానికి కూడా తెర తీశారు. అలా అధికార పార్టీలో ఇప్పుడు సంచనాలకు కారణం అవుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపి గా ఉన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డికి వ్యతిరేకంగా బిఆర్ ఎస్ నేతలు ఒక్కటి అవుతున్నారు. ఇప్పటికే ఒక్కసారి హైదరాబాద్ లో నేతలు అందరు సమావేశం అయ్యారు.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ఒక్కసారి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో సమావేశం అయ్యారు. మాజీ ఎంపి పొంగులేటి వర్గం వైపు ఎవ్వరు వెళ్లకుండా కట్టడి చేయాలని అదే విదంగా అందరు కలసి కట్టుగా ఉండాలని భావించారు.
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
Read Also: BRS Leaders Unity: పొంగులేటికి వ్యతిరేకంగా ఐక్యతా సమావేశాలు
అదే విధంగా మరోసారి ఖమ్మంలో కూడా సమావేశం కావాలని గత వారం రోజుల క్రితం నిర్ణయించారు. ఈ మేరకు మళ్లీ ఈరోజు ఆదివారం నాడు ఖమ్మంలోని బిఆర్ఎస కార్యాలయంలో సమావేశం కానున్నారు. మంత్రి అజయ్ కుమార్ తో పాటుగా ఇద్దరు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్ధ సారథి రెడ్డి, ఎంపి నామా నాగేశ్వరరావు, అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని ఎంఎల్ఎ లు, ఎంఎల్ సి లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. గత కొద్ది రోజులుగా మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు అధికార పార్టీ ఊహించని విధంగా అనుచర వర్గం తరలి వస్తోంది. కొన్నిచోట్ల అయితే అధికార పార్టీ నేతలు రాజీనామాలు కూడా చేస్తున్నారు. పొంగులేటి వర్గానికి మద్దతు ఇస్తున్న వారిపై సస్పెన్సన్ వేటు వేస్తున్నప్పటికి అధికార పార్టీని వీడడానికి కూడా వెనకంజు వేయడం లేదు.
ఇటువంటి పరిణామాలు ఎక్కువగా వైరా, ఇల్లెందు, మధిర, పినపాక లో జరుగుతున్నాయి. అయితే ఈ పరిస్థితి ఇంకా అన్ని నియోజకవర్గాలకు వ్యాప్తి చెందితే పరిస్థితి చేజారి పోతుందని బిఆర్ఎస్ నేతలకు భయం భయంగా ఉంది. దీంతో బిఆర్ఎస్ నేతలు ముందస్తు జాగ్రత్తలకు తెర తీస్తున్నారు.ఈనేపథ్యంలో పొంగులేటిని జిల్లాలో కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారంట. అందువల్లనే పొంగులేటిని కట్టడి చేసే దానిలో భాగంగా ఎంపిలు, ఎంఎల్ఎ లు అందరు కలసి కట్టుగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే అందరం ఒక్క త్రాటి మీద ఉండడం కోసం కలసి కట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నారు.సమావేశాలను పెట్టుకుంటే అందరు ఐక్యంగా ఉన్నట్లుగా చాటుకోవాలని ఏ ఒక్కరి నియోజకవర్గంలో కూడా పొంగులేటి వేలు పెడితే అందరం సమిష్టిగా ఎదుర్కొవాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందంట. ఆ ఆదేశాల మేరకు మరోసారి అందరు బిఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారన్న సమాచారం.
Read Also: MLA Sayanna : బీఆర్ఎస్లో విషాదం.. ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!