Bombay High Court: ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తూ, అక్రమంగా నిర్భంధించిన కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వ్యక్తిపై బెయిలబుల్ అభియోగాలు మోపినప్పటికీ పోలీసులు సదరు వ్యక్తి విడుదల చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా నిర్భంధంలో ఉంచినందుకు వ్యక్తికి రూ. 2 లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒక సంగీత ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి అక్రమంగా నిర్భంధించిన కేసులో పోలీసుల వైఖరిని ప్రశ్నించింది.
తన జీవిత భాగస్వామి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనే కారణంతో హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం ఏ వ్యక్తి విడాకులు కోరకూడదని బాంబే హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పులో పేర్కొంది.
Singham: పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సింగం’ వంటి సినిమాల్లో చూపించిన విధంగా న్యాయ ప్రక్రియను పట్టించుకోకుండా సత్వర న్యాయం అందించే హీరో పోలీసు సమాజానికి హానికరమైన సందేశాన్ని పంపుతున్నాడని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ అన్నారు. శుక్రవారం ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ వార్షికోత్సవం, పోలీసు సంస్కరణ దినోత్సవాన్న పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ జస్టిస్ ఉపాధ్యాయ్తో ప్రమాణం చేయించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాలపై బాంబే హైకోర్టు సీరియస్ అయింది. చట్టాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవని వ్యాఖ్యానించింది. కొత్త చట్టాలు అతిగా ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసింది.
బక్రీద్ సందర్భంగా జంతుబలిపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దక్షిణ ముంబైలోని రెసిడెన్షియల్ కాలనీలో జంతుబలిపై బాంబే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.
Bombay High Court: ఇండియాలో న్యాయపరమైన కేసులు కోర్టుల్లో దశాబ్దాలు కొనసాగుతుంటాయి. చివరకు విజయం మాత్రం దక్కుతుంది. బాధితులు న్యాయం కోసం చాలా ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి కొన్ని సార్లు ఉంటుంది. అటువంటి కోవలోకే చెందుతుంది ఓ మహిళ పోరాటం. పది కాదు 20 కాదు ఏకంగా తన ఆస్తిని దక్కించుకోవడానికి 80 ఏళ్లు న్యాయపోరాటం చేసింది. చివరకు 93 ఏళ్ల వయసులో ఆమెకు న్యాయం దక్కింది.
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన సోదరుడిపై పరువు నష్టం కేసు వేశాడు. రూ.100 కోట్ల దావా వేశాడు. ఈ ఇద్దరు సోదరుల మద్య వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Bombay High Court: వివాహ సంబంధ వివాదాల్లో పిల్లలను చరాస్థులుగా పరిగణిస్తున్నారని బాంబే హైకోర్టు మంగళవారం ఓ కేసులో వ్యాఖ్యానించింది. ఒక మహిళలను తన 15 ఏళ్ల కుమారుడితో థాయ్ లాండ్ నుంచి ఇండియాకు తిరిగిరావాలని ఆదేశించింది. పిల్లవాడు తన తండ్రి, తోబుట్టువులను కలుసుకోవచ్చని తీర్పు చెప్పింది. వైవాహిక వివాదాలు దేశంలో అత్యంత తీవ్రమైన కేసులని జస్టిస్ ఆర్డీ ధనుక, గౌరీ గాడ్సేలతో కూడిన బెంచ్ పేర్కొంది. పిల్లలపై తల్లిదండ్రుల హక్కుల కన్నా వారి సంక్షేమమే ముఖ్యమని…