Bombay High Court: మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనే కారణంతో విడాకులు కోరకూడదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: తన జీవిత భాగస్వామి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనే కారణంతో హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం ఏ వ్యక్తి విడాకులు కోరకూడదని బాంబే హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పులో పేర్కొంది. తన భార్య మూర్ఛ వ్యాధితో బాధపడుతోందని, తనకు నయంకాని వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని పేర్కొన్న వ్యక్తికి విడాకులు ఇవ్వడానికి నిరాకరించిన 2016 ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్థిస్తూ జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ ఎస్ఏ మెనెజెస్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. మూర్ఛ వ్యాధి కారణంగా తన భార్య అసాధారణంగా ప్రవర్తించిందని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని, దీంతో వివాహబంధం విచ్ఛిన్నమైందని భర్త ఆరోపించాడు. అయితే ఈ ఆరోపణలతో హైకోర్టు ఏకీభవించలేదు. ‘మూర్ఛ వ్యాధి’ అనేది నయం చేయలేని వ్యాధి కాదు, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(1)(iii) ప్రకారం దీనిని మానసిక రుగ్మతగా పరిగణించలేమని న్యాయమూర్తులు తెలిపారు.
Also Read: Birhor Community: చెల్లెలికి అమ్మగా మారిన ఐదేళ్ల బాలిక.. ఈ అడవి బిడ్డల దీనగాథ కంటతడి పెట్టిస్తోంది!
Also Read
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
- Delhi Police: సీజేపీపై 10 ఎఫ్ఐఆర్లు.. తగ్గేది లేదంటున్న ఢిల్లీ పోలీసులు..
- ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. టాప్లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ..
- IMD Alert: బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వాయుగుండాలు.. దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఈ విషయంలో బెంచ్ రఘునాథ్ గోపాల్ దఫ్తార్దార్ వర్సెస్ విజయ రఘునాథ్ దఫ్తార్దార్ కేసులో సింగిల్ జడ్జి పరిశీలనలపై ఆధారపడింది.ఇది ఇలాంటి కేసు కానప్పటికీ, ప్రస్తుత కేసుకు వర్తించే రీజనింగ్ను ఇచ్చామని డివిజన్ బెంచ్ తెలిపింది. భార్యాభర్తలు కలిసి జీవించడానికి ఇలాంటి వైద్య పరిస్థితి అడ్డంకి కాదనేదానికి పుష్కలమైన వైద్య ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.”తదనుగుణంగా భార్య మూర్ఛ వ్యాధితో బాధపడుతుందని నిరూపించడంలో భర్త విఫలమయ్యాడని లేదా ఆమె అలాంటి పరిస్థితితో బాధపడుతుంటే, విడాకుల డిక్రీని క్లెయిమ్ చేయడంలో సెక్షన్ 13(1)(iii) చట్టం ప్రకారం పరిగణించవచ్చు.” అని ధర్మాసనం వెల్లడించింది.
Also Read: Pakistan: పాకిస్తాన్లో బాంబు పేలుడు.. పిల్లలు ఆడుకుంటుండగా ఘటన..
వైద్యపరమైన ఆధారాల ప్రకారం మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ప్రతి వ్యక్తి సాధారణ జీవితాన్ని గడపవచ్చని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుత కేసులో ఉన్న మహిళ మూర్ఛ వ్యాధితో బాధపడలేదని వైద్య ఆధారాలు సూచిస్తున్నాయి. “అలాంటి వైద్య పరిస్థితి భార్యాభర్తలు కలిసి జీవించడానికి అవరోధంగా ఉంటుందని పిటిషనర్ వైఖరిని సమర్థించలేమని, వైద్యపరమైన ఆధారాలు పుష్కలంగా ఉన్నాయని మేము అభిప్రాయపడుతున్నాము” అని కోర్టు పేర్కొంది. భర్త తరపున న్యాయవాది విశ్వదీప్ మేటి వాదనలు వినిపించారు. భార్య తరఫు న్యాయవాది జ్యోతి ధర్మాధికారి వాదించారు.
తాజావార్తలు
-
Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
-
Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
-
Bhatti Vikramarka : కేటీఆర్కు ‘ఎల్ నినో’పై కనీస అవగాహన లేదు
-
Delhi Police: సీజేపీపై 10 ఎఫ్ఐఆర్లు.. తగ్గేది లేదంటున్న ఢిల్లీ పోలీసులు..
-
Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!