Bombay High Court: మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనే కారణంతో విడాకులు కోరకూడదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: తన జీవిత భాగస్వామి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనే కారణంతో హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం ఏ వ్యక్తి విడాకులు కోరకూడదని బాంబే హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పులో పేర్కొంది. తన భార్య మూర్ఛ వ్యాధితో బాధపడుతోందని, తనకు నయంకాని వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని పేర్కొన్న వ్యక్తికి విడాకులు ఇవ్వడానికి నిరాకరించిన 2016 ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్థిస్తూ జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ ఎస్ఏ మెనెజెస్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. మూర్ఛ వ్యాధి కారణంగా తన భార్య అసాధారణంగా ప్రవర్తించిందని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని, దీంతో వివాహబంధం విచ్ఛిన్నమైందని భర్త ఆరోపించాడు. అయితే ఈ ఆరోపణలతో హైకోర్టు ఏకీభవించలేదు. ‘మూర్ఛ వ్యాధి’ అనేది నయం చేయలేని వ్యాధి కాదు, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(1)(iii) ప్రకారం దీనిని మానసిక రుగ్మతగా పరిగణించలేమని న్యాయమూర్తులు తెలిపారు.
Also Read: Birhor Community: చెల్లెలికి అమ్మగా మారిన ఐదేళ్ల బాలిక.. ఈ అడవి బిడ్డల దీనగాథ కంటతడి పెట్టిస్తోంది!
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
ఈ విషయంలో బెంచ్ రఘునాథ్ గోపాల్ దఫ్తార్దార్ వర్సెస్ విజయ రఘునాథ్ దఫ్తార్దార్ కేసులో సింగిల్ జడ్జి పరిశీలనలపై ఆధారపడింది.ఇది ఇలాంటి కేసు కానప్పటికీ, ప్రస్తుత కేసుకు వర్తించే రీజనింగ్ను ఇచ్చామని డివిజన్ బెంచ్ తెలిపింది. భార్యాభర్తలు కలిసి జీవించడానికి ఇలాంటి వైద్య పరిస్థితి అడ్డంకి కాదనేదానికి పుష్కలమైన వైద్య ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.”తదనుగుణంగా భార్య మూర్ఛ వ్యాధితో బాధపడుతుందని నిరూపించడంలో భర్త విఫలమయ్యాడని లేదా ఆమె అలాంటి పరిస్థితితో బాధపడుతుంటే, విడాకుల డిక్రీని క్లెయిమ్ చేయడంలో సెక్షన్ 13(1)(iii) చట్టం ప్రకారం పరిగణించవచ్చు.” అని ధర్మాసనం వెల్లడించింది.
Also Read: Pakistan: పాకిస్తాన్లో బాంబు పేలుడు.. పిల్లలు ఆడుకుంటుండగా ఘటన..
వైద్యపరమైన ఆధారాల ప్రకారం మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ప్రతి వ్యక్తి సాధారణ జీవితాన్ని గడపవచ్చని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుత కేసులో ఉన్న మహిళ మూర్ఛ వ్యాధితో బాధపడలేదని వైద్య ఆధారాలు సూచిస్తున్నాయి. “అలాంటి వైద్య పరిస్థితి భార్యాభర్తలు కలిసి జీవించడానికి అవరోధంగా ఉంటుందని పిటిషనర్ వైఖరిని సమర్థించలేమని, వైద్యపరమైన ఆధారాలు పుష్కలంగా ఉన్నాయని మేము అభిప్రాయపడుతున్నాము” అని కోర్టు పేర్కొంది. భర్త తరపున న్యాయవాది విశ్వదీప్ మేటి వాదనలు వినిపించారు. భార్య తరఫు న్యాయవాది జ్యోతి ధర్మాధికారి వాదించారు.
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!