Bombay High Court: మహారాష్ట్ర మరణాలపై బాంబే హైకోర్టు సీరియస్.. రేపు అత్యవసర విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High: మహారాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరసగా రోగుల మరణాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నాందేడ్, ఛత్రపతి శంభాజీనగర్, నాగ్పూర్ ఈ రెండు ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో 50 మందికి పైగా రోగులు మరణించారు. నాందేడ్లోని శంకర్రావ్ చవాన్ ఆస్పత్రిల్లో గడిచిన 72 గంటల్లో 16 మంది పిల్లలతో సహా మొత్తం 31 మంది మరణించారు. ఇక శంభాజీనగర్(ఔరంగాబాద్) ఆస్పత్రిలో 18 మరనణాలు సంభవించాయి.
Read Also: Delhi Liquor Policy Case: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
మరోవైపు ఈ రోజు నాగ్పూర్ నగరంలోని రెండు ప్రభుత్వ ఆస్పత్రుల్లో గడిచిన 24 గంటల్లో 23 మంది రోగులు మరణించారు. ఇలా వరస మరణాలపై బాంబే హైకోర్టు సీరియస్ అయింది. నాందేడ్, ఔరంగాబాద్ ఆస్పత్రుల్లో రోగుల మరణాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. రేపు అత్యవసర విచారణకు పిలుపునిచ్చింది. బడ్జెట్ కేటాయింపు గురించిన వివరాలను కోర్టు కోరింది. సిబ్బంది, మందుల కొరత కారణంగా మరణాలు సంభవిస్తే సహించేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఈ వివరాలనను శుక్రవారం మధ్యాహ్నం లోగా సమర్పించాలని చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
బుధవారం ఉదయం మోహిత్ ఖాన్నా అనే న్యాయవాది ఈ విషయాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు. రెండు ఆస్పత్రుల్లో వైద్యులు, పడకలు, సిబ్బంది, మందుల కొరత గురించిన ఫిర్యాదుతో పిటిషన్ దాఖలు చేశారు. నాందేడ్, ఔరంగాబాద్ మరణాల గురించి న్యామవాది ఖన్నా పిటిషన్లో ప్రస్తావించారు. ఈ మరణాలను సీఎం ఏక్నాథ్ షిండే కూడా సీరియస్ గా తీసుకున్నారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. అయితే మందుల కొరత లేదని నిన్న సీఎం చెప్పారు.
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!