Bombay High Court: మహారాష్ట్ర మరణాలపై బాంబే హైకోర్టు సీరియస్.. రేపు అత్యవసర విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High: మహారాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరసగా రోగుల మరణాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నాందేడ్, ఛత్రపతి శంభాజీనగర్, నాగ్పూర్ ఈ రెండు ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో 50 మందికి పైగా రోగులు మరణించారు. నాందేడ్లోని శంకర్రావ్ చవాన్ ఆస్పత్రిల్లో గడిచిన 72 గంటల్లో 16 మంది పిల్లలతో సహా మొత్తం 31 మంది మరణించారు. ఇక శంభాజీనగర్(ఔరంగాబాద్) ఆస్పత్రిలో 18 మరనణాలు సంభవించాయి.
Read Also: Delhi Liquor Policy Case: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్
Also Read
మరోవైపు ఈ రోజు నాగ్పూర్ నగరంలోని రెండు ప్రభుత్వ ఆస్పత్రుల్లో గడిచిన 24 గంటల్లో 23 మంది రోగులు మరణించారు. ఇలా వరస మరణాలపై బాంబే హైకోర్టు సీరియస్ అయింది. నాందేడ్, ఔరంగాబాద్ ఆస్పత్రుల్లో రోగుల మరణాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. రేపు అత్యవసర విచారణకు పిలుపునిచ్చింది. బడ్జెట్ కేటాయింపు గురించిన వివరాలను కోర్టు కోరింది. సిబ్బంది, మందుల కొరత కారణంగా మరణాలు సంభవిస్తే సహించేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఈ వివరాలనను శుక్రవారం మధ్యాహ్నం లోగా సమర్పించాలని చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
బుధవారం ఉదయం మోహిత్ ఖాన్నా అనే న్యాయవాది ఈ విషయాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు. రెండు ఆస్పత్రుల్లో వైద్యులు, పడకలు, సిబ్బంది, మందుల కొరత గురించిన ఫిర్యాదుతో పిటిషన్ దాఖలు చేశారు. నాందేడ్, ఔరంగాబాద్ మరణాల గురించి న్యామవాది ఖన్నా పిటిషన్లో ప్రస్తావించారు. ఈ మరణాలను సీఎం ఏక్నాథ్ షిండే కూడా సీరియస్ గా తీసుకున్నారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. అయితే మందుల కొరత లేదని నిన్న సీఎం చెప్పారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!