Bombay High Court: వ్యక్తిని “అక్రమం”గా నిర్బంధించిన పోలీసులు.. రూ.2 లక్షలు పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తూ, అక్రమంగా నిర్భంధించిన కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వ్యక్తిపై బెయిలబుల్ అభియోగాలు మోపినప్పటికీ పోలీసులు సదరు వ్యక్తి విడుదల చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా నిర్భంధంలో ఉంచినందుకు వ్యక్తికి రూ. 2 లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒక సంగీత ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి అక్రమంగా నిర్భంధించిన కేసులో పోలీసుల వైఖరిని ప్రశ్నించింది.
తన భర్త నితిన్ సంపత్ ని పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, బెయిల్ ఇచ్చే ఆరోపణలు అయినప్పటికీ అరెస్ట్ చేశారని ఆయన భార్య నీలం సంపత్ దాఖలు చేసిన పిటిషన్ని న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే, గౌరీ గాడ్సేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఈ కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (గౌరవంగా జీవించే హక్కు) ప్రకారం నితిన్కి హామీ ఇవ్వబడిని హక్కుల్ని పోలీసులు ధిక్కరించారని, అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను స్పష్టంగా ఉల్లంఘించినట్లు పేర్కొంది. పోలీసులు చర్య వల్ల ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందని, శారీరక, మానసిక వేదనకు గురయ్యాడని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
పిటిషనర్ కి జరిగిన అన్యాయాన్ని డబ్బుతో మాత్రమే భర్తీ చేయలేమని, కానీ అతనికి కొంత ఉపశమనాన్ని ఇస్తుందని మహారాష్ట్ర సర్కార్ ఆరు వారాల్లో అతనికి రూ. 2 లక్షల పరిహారాన్ని అందించాలని ఆదేశించింది.
Read Also: S Jaishankar: “కెనడా తీవ్రవాదానికి ఆశ్రయం ఇస్తోంది”.. అమెరికాకు తేల్చిచెప్పిన జైశంకర్
కేసు ఏంటంటే..?
జూలై 17న ఐపీసీ సెక్షన్లు 354A (లైంగిక వేధింపులు) మరియు 509 (మహిళ అవమానించడం) ఆరోపణలపై టార్డియో పోలీసులు మిస్టర్ నితిన్ను అరెస్టు చేశారు. అయితే ఫీజు పెంచాలని అడిగినప్పుడు సదరు మహిళ కావాలనే తప్పుడు ఫిర్యాదు చేసిందని నితిన్ ఆరోపించారు. ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు లాయర్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. పోలీసులు నితిన్ ని వదిలి పెట్టకుండా, రాత్రంతా లాకప్ లో ఉంచారు. మరుసటి రోజు విడుదల చేశారు. ఈ కేసులో పోలీసులు నితిన్ కి క్షమాపణలు చెప్పారు. బాధ్యులైన పోలీసుల్ని శిక్షిస్తామని కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ని నియమించాలని ముంబై కమిషనర్ని కోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..