Sanju Samson: విరాట్ కోహ్లీ లేకున్నా 196 రన్స్ ఛేజ్ చేశాం.. ప్రెస్ మీట్లో సంజు స్ట్రాంగ్ కౌంటర్!
- చావోరేవో మ్యాచ్లో సంజు శాంసన్ మెరుపు ఇన్నింగ్స్
- 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 97 రన్స్
- ప్రెస్ మీట్లో సంజు చేసిన కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson gives a bold reply about winning without Virat Kohli: టీ20 ప్రపంచకప్ 2026 ముంగిట భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పేలవ ఫామ్తో ఇబ్బంది పడ్డాడు. అయితే మెగా టోర్నీలో ప్లేయర్స్ గాయాల కారణంగా అవకాశం రాగా.. నమీబియాపై 8 బంతుల్లో 22 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభం ఇచ్చాడు. జింబాంబ్వేపై 15 బంతుల్లో 26 పరుగులు చేసి దూకుడు చూపించాడు. ఇక ఆదివారం (మార్చి 1) కోల్కతాలో వెస్టిండీస్తో చావోరేవో మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో జట్టును సెమీస్కు చేర్చాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 97 రన్స్ చేసి టీమిండియా హీరో అయ్యాడు. అయితే మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్లో సంజు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. రికార్డుల కింగ్, ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ లేకున్నా.. డూ ఆర్ డై మ్యాచ్లో 196 రన్స్ ఛేజ్ చేశామని అన్నాడు.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో సంజు శాంసన్ను ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. ‘విరాట్ కోహ్లీ జట్టులో లేకుండా భారత్ టీ20 వరల్డ్ కప్లో 160కి పైగా స్కోర్ను ఎప్పుడూ చేజ్ చేయలేదు. కానీ ఈరోజు 196 పరుగులు ఛేజ్ చేశారు. మీకు ఎలా అనిపిస్తోంది?’ అని ప్రశ్నించగా.. ‘ఇది విరాట్ భాయ్ లేకుండా జరుగుతున్న తొలి టీ20 వరల్డ్ కప్. మేము దక్షిణాఫ్రికాపై మాత్రమే ఓడాం. మేము ఛేజ్ చేస్తూ 10 మ్యాచ్లు ఏమీ ఓడలేదు’ అని సంజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. విరాట్ లేకున్నా తాము పెద్ద స్కోర్స్ ఛేదించగలం అని సంజు చెప్పకనే చెప్పాడు. సంజు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్పై ఘన విజయం..
Also Read: India Schedule 2026: టీమిండియా బిజీ షెడ్యూల్.. రోహిత్, కోహ్లీలకు పండగే!
టీ20 ఫార్మాట్లో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన విరాట్ కోహ్లీ గైర్హాజరీలో భారత జట్టు ఎలా ఆడుతుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా భారత్ కొత్త ఆత్మవిశ్వాసాన్ని చూపింది. సంజు శాంసన్ కీలక ఇన్నింగ్స్తో జట్టును విజయానికి దారి చూపించాడు. కొంతమంది విమర్శకులు విరాట్ లేకుండా జట్టు బలహీనపడిందని వ్యాఖ్యానించగా.. సంజూ తన ప్రదర్శనతో పాటు గణాంకాలతో సమాధానం ఇచ్చాడు. వెస్టిండీస్పై విజయం టీమిండియా బ్యాటింగ్ లోతును, యువ ఆటగాళ్ల ధైర్యాన్ని చాటిచెప్పింది. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ముందుకు దూసుకెళుతోంది. మార్చి 5న రెండో సెమీ ఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ ఢీకొట్టనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే మైదానంలో రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
-
Astrology: జూలై 23 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!