Nawazuddin Siddiqui: సోదరుడిపై పరువు నష్టం కేసు.. 100 కోట్ల దావా వేసిన బాలీవుడు నటుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన సోదరుడిపై పరువు నష్టం కేసు వేశాడు. రూ.100 కోట్ల దావా వేశాడు. ఈ ఇద్దరు సోదరుల మద్య వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, అతని సోదరుడు షమాసుద్దీన్లు తమ మధ్య ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల దృష్ట్యా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఎలాంటి వ్యాఖ్యలను పోస్ట్ చేయవద్దని బాంబే హైకోర్టు ఆదేశించింది.
Also Read:Off The Record: గ్రూపుల గోల.. నిరసనల సెగ.. డిప్యూటీ సీఎంకు తలనొప్పులు..!
సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ.. పరువు నష్టం కలిగించే ప్రకటనలను పోస్ట్ చేసినందుకు తన సోదరుడి నుండి రూ. 100 కోట్ల నష్టపరిహారం కోరుతూ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కోర్టును ఆశ్రయించాడు. ఆయన దాఖలు చేసిన పరువు నష్టం దావాను విచారిస్తున్నప్పుడు జస్టిస్ ఆర్ఐ చాగ్లాతో కూడిన సింగిల్ బెంచ్ కీలక ఆదేశాలు ఇచ్చింది. మే 3న తమ న్యాయవాదులతో కలిసి తన ఛాంబర్లో ఉండాల్సిందిగా సోదరులను ధర్మాసనం ఆదేశించింది.
Also Read
దావాలో నటుడి మాజీ భార్య జైనాబ్ పేరు కూడా ఉంది. అయితే మాజీ జంట తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నందున నటుడు ఆమెపై పరువు నష్టం దావా వేయడానికి ఇష్టపడలేదని బుధవారం నవాజుద్దీన్ సిద్ధిఖీ న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ కోర్టుకు చెప్పారు.
Also Read:MK Stalin Urges : గవర్నర్ వర్సెస్ సర్కార్.. బీజేపీయేతర రాష్ట్రాలకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
హైకోర్టు డివిజన్ బెంచ్ జోక్యంతో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అతని మాజీ భార్య మధ్య సెటిల్మెంట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ బెంచ్ సాయంతో చర్చలు జరుగుతున్నాయని షమాసుద్దీన్ సిద్ధిఖీ తరఫు న్యాయవాది రూమీ మీర్జా హైకోర్టుకు తెలిపారు. పోరాడుతున్న సోదరుల మధ్య ఇదే విధమైన ఏర్పాటు జరగవచ్చు అని అన్నారు.
అయితే, షామసుద్దీన్ సిద్ధిఖీ తన పరువు నష్టం కలిగించే పోస్ట్లను తీసివేసినప్పుడు మాత్రమే సోదరుల మధ్య ఏదైనా చర్చలు ప్రారంభమవుతాయని చంద్రచూడ్ అన్నారు. ఇందులో అవార్డు గెలుచుకున్న నటుడిని “రేపిస్ట్ మరియు వేధింపుదారు” అని పేర్కొన్నారని తెలిపారు.
Also Read:Millie Bobby Brown: అందాల భామల టీనేజ్ మ్యారేజెస్!
వాదనల అనంతరం పోస్ట్లను తొలగించాలని, సోదరులిద్దరూ ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలని కోర్టు సూచించింది. సెటిల్మెంట్ చర్చల దృష్ట్యా, సామరస్యపూర్వకమైన పరిష్కారానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. ఒకరికొకరు వ్యతిరేకంగా ఎలాంటి పోస్ట్లు ఉండకూడదు అని జస్టిస్ చాగ్లా అన్నారు.
తాజావార్తలు
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?