Nawazuddin Siddiqui: సోదరుడిపై పరువు నష్టం కేసు.. 100 కోట్ల దావా వేసిన బాలీవుడు నటుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన సోదరుడిపై పరువు నష్టం కేసు వేశాడు. రూ.100 కోట్ల దావా వేశాడు. ఈ ఇద్దరు సోదరుల మద్య వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, అతని సోదరుడు షమాసుద్దీన్లు తమ మధ్య ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల దృష్ట్యా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఎలాంటి వ్యాఖ్యలను పోస్ట్ చేయవద్దని బాంబే హైకోర్టు ఆదేశించింది.
Also Read:Off The Record: గ్రూపుల గోల.. నిరసనల సెగ.. డిప్యూటీ సీఎంకు తలనొప్పులు..!
సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ.. పరువు నష్టం కలిగించే ప్రకటనలను పోస్ట్ చేసినందుకు తన సోదరుడి నుండి రూ. 100 కోట్ల నష్టపరిహారం కోరుతూ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కోర్టును ఆశ్రయించాడు. ఆయన దాఖలు చేసిన పరువు నష్టం దావాను విచారిస్తున్నప్పుడు జస్టిస్ ఆర్ఐ చాగ్లాతో కూడిన సింగిల్ బెంచ్ కీలక ఆదేశాలు ఇచ్చింది. మే 3న తమ న్యాయవాదులతో కలిసి తన ఛాంబర్లో ఉండాల్సిందిగా సోదరులను ధర్మాసనం ఆదేశించింది.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
దావాలో నటుడి మాజీ భార్య జైనాబ్ పేరు కూడా ఉంది. అయితే మాజీ జంట తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నందున నటుడు ఆమెపై పరువు నష్టం దావా వేయడానికి ఇష్టపడలేదని బుధవారం నవాజుద్దీన్ సిద్ధిఖీ న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ కోర్టుకు చెప్పారు.
Also Read:MK Stalin Urges : గవర్నర్ వర్సెస్ సర్కార్.. బీజేపీయేతర రాష్ట్రాలకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
హైకోర్టు డివిజన్ బెంచ్ జోక్యంతో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అతని మాజీ భార్య మధ్య సెటిల్మెంట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ బెంచ్ సాయంతో చర్చలు జరుగుతున్నాయని షమాసుద్దీన్ సిద్ధిఖీ తరఫు న్యాయవాది రూమీ మీర్జా హైకోర్టుకు తెలిపారు. పోరాడుతున్న సోదరుల మధ్య ఇదే విధమైన ఏర్పాటు జరగవచ్చు అని అన్నారు.
అయితే, షామసుద్దీన్ సిద్ధిఖీ తన పరువు నష్టం కలిగించే పోస్ట్లను తీసివేసినప్పుడు మాత్రమే సోదరుల మధ్య ఏదైనా చర్చలు ప్రారంభమవుతాయని చంద్రచూడ్ అన్నారు. ఇందులో అవార్డు గెలుచుకున్న నటుడిని “రేపిస్ట్ మరియు వేధింపుదారు” అని పేర్కొన్నారని తెలిపారు.
Also Read:Millie Bobby Brown: అందాల భామల టీనేజ్ మ్యారేజెస్!
వాదనల అనంతరం పోస్ట్లను తొలగించాలని, సోదరులిద్దరూ ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలని కోర్టు సూచించింది. సెటిల్మెంట్ చర్చల దృష్ట్యా, సామరస్యపూర్వకమైన పరిష్కారానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. ఒకరికొకరు వ్యతిరేకంగా ఎలాంటి పోస్ట్లు ఉండకూడదు అని జస్టిస్ చాగ్లా అన్నారు.
తాజావార్తలు
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!