Bengaluru: భర్త పక్కన నిద్రిస్తున్న వివాహితను చంపి రూ.65 లక్షల నగలు చోరీ.. ఇందులో ట్విస్ట్ ఏంటంటే..!
- బెంగళూరులో దారుణం
- వివాహితను చంపి రూ.65 లక్షల నగలు చోరీ
- హత్య కేసులో వెలుగులోకి వచ్చిన బిగ్ ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా నేరాలు-ఘోరాలు ఆగడం లేదు. ఈజీ మని కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. మానవత్వం మరిచి ఘాతుకాలకు తెగబడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులో వెలుగు చూసింది.
బెంగళూరులోని హీరాపూర్ ప్రాంతంలో 70 ఏళ్ల వృద్ధురాలు తన భర్త రంగనాథ్తో ఒంటరిగా జీవిస్తోంది. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడం.. పైగా 15 ఏళ్ల నుంచి మానసిక అనారోగ్యంతో రంగనాథ్ మంచానికే పరిమితం అయ్యాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఓ దుర్మార్గుడు ఘాతుకానికి ఒడిగట్టాడు.
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
హోల్సేల్ దుకాణ యజమాని శివకుమార్ వ్యాపారంలో రూ.8 లక్షలు అప్పుల పాలయ్యాడు. ఈ అప్పుల నుంచి బయట పడాలన్న దుర్దేశంతో వృద్ధ దంపతుల ఆస్తులపై కన్నేశాడు. నగలు కొట్టేసి అప్పులు తీర్చుకోవాలని ప్రణాళిక రచించాడు. అంతే కుట్రలో భాగంగా తెల్లవారుజామున 1:03 గంటల ప్రాంతంలో ఇంట్లోకి చొరబడి భర్త పక్కన పడుకున్న శోభను అత్యంత దారుణంగా చంపేసి ఆమె మెడలో ఉన్న రూ.65 లక్షల ఆభరణాలు దోచుకెళ్లాడు.
ఇది కూడా చదవండి: Chhattisgarh: కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోల హతం
అయితే రంగనాథ్కు వైద్యం చేసేందుకు ఫిజియోథెరపీ వైద్యుడు ఇంటికి వచ్చాడు. శోభ రక్తపుమడుగులో ఉండడం చూసి షాక్ అయ్యాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక పోలీసుల రాకతో స్థానికులంతా గుమిగూడారు. వారితో పాటే ఏమీ ఎరగనట్టుగా నిందితుడు శివకుమార్ అక్కడే ఉన్నాడు. దీంతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా అర్ధరాత్రి సమయంలో స్కూటీపై పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. నెంబర్ ప్లేట్ను బట్టి ట్రాక్ చేయగా శివకుమార్దిగా తేలింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకోగా నేరాన్ని అంగీకరించాడు. ఈ పరిణామంతో అందరూ అవాక్కయ్యారు. అప్పుల నుంచి బయట పడేందుకు ఈ హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హంతకుడే ప్రేక్షకుడిలా తిరగడంతో స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Gold-Silver Rates: గోల్డ్ లవర్స్కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?