తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు.. ధన్యాం కొనుగోళ్ల విషయంలో.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. రైతుల తరపున పోరాటం చేస్తామని ప్రకటించిన ఆయన.. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విపక్షాలపై ఫైర్ అయ్యారు.. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని బీజేపీ నేతలను టార్గెట్ చేశారు కేసీఆర్.. ఇక, తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు సీఎం కేసీఆర్.. లైవ్లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..
నల్లగొండ జిల్లా పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఊహించన షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు నల్గొండ పోలీసులు. బండి సంజయ్ కుమార్ తన పర్యటనకు అనుమతి తీసుకోలేదని… ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున అనుమతి లేకుండా పర్యటన సరికాదన్నారు జిల్లా ఎస్పీ రంగనాథ్. నిన్నటి బండి సంజయ్ నల్గొండ జిల్లా…
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఆమె ఢిల్లీలో పర్యటించనున్నారు.. ఈ నెల 22న హస్తినకు వెళ్లనున్న ఆమె.. తిరిగి 25న కోల్కతాకు చేరుకోనున్నారు.. ఈ పర్యటనలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది.. ఇదే సమయంలో.. ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు,…
తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయా? కేసీఆర్ ఫోకస్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి షిఫ్ట్ అయిందా? ఇప్పుడు ఆయన బీజేపీపై చేస్తున్నది ఉత్తుత్తి ఫైటేనా? లేదంటే మ్యాటర్ నిజంగానే సీరియస్సా? తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవి. హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఉప ఎన్నిక తమకు లైట్ అని గులాబీ పార్టీ నేతలు అంటే అనొచ్చు. కానీ దాని తాలూకు ఓటమి అనేకల రకాలుగా ఆ పార్టీ…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నల్గొండ పర్యటనలో జరిగిన దాడిపై నేడు గవర్నర్ తమిళసై సౌందర రాజన్కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ నల్లొండలో పర్యటిస్తున్న సమయంలో ఆయన కాన్వాయ్పై రాళ్లతో దాడి చేశారు. అయితే దీనిపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలుపుతూ గవర్నర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. గ్రామాల్లోకి వెళ్లి రైతుల బాధలు…
రైతులు ఇబ్బందులు పడుతుంటే రాజకీయాల వారిపైనే కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 500,1000 రూపాయలు ఇచ్చి కిరాయి గుండాలతో TRS నేతలు బండి సంజయ్ వెహికిల్ పై రాళ్ళ దాడి చేశారని ఆయన అన్నారు. బీజేపీ కార్యకర్తలు దీటుగా ఎదుర్కొని టీఆర్ఎస్ కార్యకర్తలకు, గుండాలకు సరైన సమాధానం చెప్పారన్నారు. రైతులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి, రైతులను మోసం చేస్తున్నాడు. హుజూరాబాద్ ఎలక్షన్ లో TRS ఓటమిని తట్టుకోలేక…
ఇటీవల ఎప్పుడు ఏదో ఒక కాంట్రావర్సీతో వార్తల్లో నిలుస్తున్న కంగనా పై తాజాగా అసదుద్దీన్ ఓవైసీ సైటైర్లు విసిరారు. స్వాతంత్ర్యంపై కంగనా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కంగనా 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో వచ్చింది కేవలం భిక్ష అని కామెంట్స్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కంగనా పై విమర్శల పాలైంది. తను తీసుకున్న పద్మశ్రీ అవార్డును సైతం వెనక్కి ఇచ్చి వేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అడుగడుగునా బండిని అడ్డుకోవడం.. వాగ్వాదాలు, తోపులాటలు, రాళ్ల దాడులు, కోడిగుడ్లు విసరడం లాంటి ఘటనలు చర్చగా మారాయి.. అయితే.. ఈ పరిణామాలపై స్పందించిన రైతు బంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ధాన్యం సేకరణపై పాలసీ చెబితేనే బండి సంజయ్ని తిరగనిస్తాం అన్నారు.. బండి సంజయ్ను తెలంగాణ రైతుల తరపున వెంటాడతాం… వేటాడుతామన్న ఆయన.. నల్గొండ రైతులపై దాడులు చేసిన…
రేపు టీఆర్స్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం 4గంటలకు శాసనసభ పక్షం భేటీ కానుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రప్రభుత్వ తీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు, రాష్ర్ట బీజేపీ మరో విధంగా వ్యవహరిస్తుందని.. దీంతో రైతులు అయోమయా నికి గురవుతున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పటికే ధర్నాలకు సైతం పిలుపునిచ్చింది. దీనిపై టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో భవి ష్యత్ కార్యచరణను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీజేపీ…