మళ్ళీ ప్రజలకు దగ్గరయ్యేందుకు భక్తి బాట…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనంతో బాగా గ్యాప్ వచ్చిందని ఆ జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీలు ఆందోళన చెందుతున్నారా? మళ్లీ ప్రజలకు దగ్గర య్యేందుకు డివోషనల్ బాట పట్టారా? సడెన్గా ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఇంతకీ ఎవరా నాయకులు?
ప్రజాప్రతినిధుల భక్తి లెక్కలు వేరా?
Also Read
గుస్సాడీ నృత్యాలు.. కార్తీక దీపోత్సవాలు..! ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఇవన్నీ ఏ ధార్మిక సంస్థలో నిర్వహిస్తున్నాయంటే పొరపాటు. ఫౌండేషన్ ద్వారా కొందరు.. సొంతంగా మారికొందరు తమలోని భక్తిని భారీగానే బయటపెడుతున్నారు. పైకి ఇవి సాంస్కృతిక, ఆథ్యాత్మిక కార్యక్రమాలుగా కనిపిస్తున్నా.. వీటిని నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధుల భక్తి లెక్కలు వేరే ఉన్నాయట. వాటిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.
కార్తీక దీపోత్సవాలు.. గుస్సాడీ వేడుకలు..!
నిన్న మొన్నటి వరకు హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో బిజీగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు సొంత నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. వస్తూ వస్తూనే కార్యక్రమాల స్పీడ్ పెంచేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, బీజేపీ ఎంపీ సోయం బాపురావు, కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా కార్తీక దీపోత్సవాలు, గుస్సాడీ వేడుకలు నిర్వహిస్తున్నారు.
జనాలతో వచ్చిన గ్యాప్ పూడ్చే పనిలో ఉన్నారా?
ఆ మధ్య టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో జరిగిన సమావేశంలో ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. ప్రజలకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వచ్చిందని హెచ్చరించారట. ఆ దూరాన్ని తగ్గించుకోవాలంటే జనాల్లోకి వెళ్లాలని పార్టీ పెద్దలు సూచించడంతో.. ఈ విధంగా కార్తీక మాసాన్ని వాడేసుకుంటున్నట్టు సమాచారం. ప్రభుత్వ పథకాల పేరుతో జనాల్లోకి వెళ్లడంతోపాటు.. కార్తీక మాసంలో దీపోత్సవాలు నిర్వహిస్తే.. ఎక్కువ మందిని రీచ్ కావొచ్చని లెక్కలేశారట. దీంతోపాటు ఆదివాసీలలో పట్టు సాధించేందుకు.. గుస్సాడీ వేడుకలు చేపట్టారు.
దండారి పండగ పేరుతో జనాల్లోకి బీజేపీ నేతలు..!
నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ యాక్టివిటీస్ చూశాక.. బీజేపీ నేతలు ఉలిక్కి పడ్డారట. ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో తమకు దక్కాల్సిన క్రెడిట్ను టీఆర్ఎస్ నేతలు కొట్టేస్తున్నారని అనుమానించి.. ఎంపీ సోయం బాపురావ్ ఆధ్వర్యంలో గుస్సాడీలను ఒక్కచోట చేర్చి దండారి పండగను ఘనంగా నిర్వహించారు. ఆదివాసీలలో తమ పట్టు సడలకుండా జాగ్రత్త పడ్డారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి యాదాద్రి ఆలయం కలివచ్చింది. ప్రజాప్రతినిధులను, ప్రజలను ఆహ్వానించి వైభవంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం జరిపించారు. యాదాద్రి ఆలయ విమాన గోపురం బంగార తాపడం కోసం తన వంతుగా ఒక కిలో గోల్డ్ ఇస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. విరాళాల ద్వారా మరో కిలో బంగారం విరాళంగా ఇస్తామని ఆయన తెలిపారు. ఈ విధంగా ఇంద్రకరణ్రెడ్డి సైతం తన టాస్క్లో కొంత వరకు పూర్తి చేసేశారు.
అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోతున్న జనం..!
కార్తీక మాసం కాబట్టి ఈ కార్యక్రమాలు ఘనంగా చేశామని ఎమ్మెల్యేలు, ఎంపీలు పైకి చెబుతున్నా.. అసలు విషయం తెలిసిన వారు మాత్రం.. నోళ్లెళ్ల బెడుతున్నారట. ఎంతైనా మా ఎమ్మెల్యే, ఎంపీల లెక్కలు వేరని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. మరి.. ఈ డివోషనల్ ప్లాన్ ప్రజాప్రతినిధులకు ఎంత వరకు వర్కవుట్ అవుతుందో.. జనాలతో కనెక్టివిటీ పెరుగుతుందో లేదో చూడాలి.
- Tags
- bjp
- off the record
- telangana
- TRS
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!