రగులుతున్న తెలంగాణం.. ఆగమవుతున్న అన్నదాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశానికి వెన్నెముక రైతన్న.. రైతులకు పెద్దపీట అంటూ ఎన్నికల్లో వాగ్దానం చేయడం …గద్దెనెక్కాక దేశానికే వెన్నెముక అయిన రైతు వెన్నెముక విరిచేయడం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. స్వతంత్రం వచ్చిననాటి నుంచి రైతన్న పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన పార్టీలేగాని రైతన్నకు పేరుతెచ్చిన దాఖలాలు లేవు. దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా మట్టిని నమ్ముకున్న రైతులు ఆఖరికి ఆ మట్టిలోనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని చెప్పడంలో ఆతిశయోక్తి లేదు.
గత ఎన్నికల్లో రైతులను సంపన్నులను చేస్తామంటూ కేంద్రంలో బీజేపీ.. తెలంగాణలో మా ప్రభుత్వం వస్తే రైతు ఆత్మహత్య చేసుకోడు అంటూ టీఆర్ఎస్ పార్టీలు వాగ్దానాలు చేశాయి. వీరి మాటలు నమ్మిన రైతులు కూడా ఈ ప్రభుత్వాలతో మా బతుకులు మారుతాయనే నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. తిరిగి రెండోసారి అధికారం అప్పగించారు. తీరా ఇప్పుడు మేము రైతులకు న్యాయం చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం చేయనివ్వడం లేదంటూ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలే రోడ్డెక్కారు. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలేమో రాష్ట్ర ప్రభుత్వానికి సత్తా లేక కేంద్రాన్ని తప్పుపడుతోందని ఆరోపిస్తున్నారు. ఇలా తెలంగాణలో రాజకీయం రగులుతోంది. మధ్యలో నలుగుతున్నది మాత్రం రైతన్నే.
Also Read
అయితే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం… కేంద్రంపై రాష్ట్ర అధికార పార్టీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి డీలా పడ్డ మా బతుకులకు న్యాయం చేస్తారేమోనని వీరిని నమ్ముకుంటే వీళ్లేమో ఒకరిపై ఒకరి మాటల యుద్ధం చేసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలే ఈ విధంగా మాట్లాడితే మా పరిస్థితి ఏంటంటూ.. రైతులు ఆగమైపోతున్నారు.
తాజావార్తలు
-
Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
-
Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. ‘జొనాథన్ డేవిడ్’ హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్పై 6-0 భారీ విజయం.!
-
Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
ట్రెండింగ్
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..