Shashi Tharoor: ఏఐ సమ్మిట్ చాలా బాగా జరిగింది.. మళ్లీ కేంద్రంపై శశిథరూర్ ప్రశంసలు
- కేంద్ర ప్రభుత్వంపై మరోసారి శశిథరూర్ ప్రశంసలు
- ఏఐ సమ్మిట్ చాలా బాగా జరిగిందంటూ పొగడ్తలు
- సమ్మిట్ తీరును తప్పుపట్టిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ చాలా బాగా జరిగిందంటూ కొనియాడారు. పెద్ద కార్యక్రమాల్లో కొన్ని అవాంతరాలు జరుగుతుంటాయని.. అయినా కూడా కేంద్రం చాలా బాగా నిర్వహించిందని మెచ్చుకున్నారు.
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఏఐ సమ్మిట్ను విమర్శించారు. ‘‘అస్తవ్యస్తమైన ప్రజా సంబంధాల ప్రదర్శన’’ అని అభివర్ణించారు. చైనా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా తీవ్రంగా తప్పుపట్టారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ఇది కూడా చదవండి: Trump: బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్లో పాక్ ప్రధానికి అవమానం.. ట్రంప్ ఏం చేశారంటే..!
ఫిబ్రవరి 17న జరిగిన శిఖరాగ్ర సమావేశాల ప్రారంభ రోజున పొడవైన క్యూలు, భారీ జనసమూహం, లాజిస్టికల్ సమస్యలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. భద్రతా సిబ్బంది నుంచి స్పష్టమైన సూచనలు లేకుండానే గేట్లు మూసేశారని సందర్శకులు తెలిపారు. పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. అలాగే గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ విశ్వవిద్యాలయం వివాదానికి దారితీసింది. ‘‘ఓరియన్’’ అనే రోబోటిక్ కుక్కపై విమర్శలు రావడంతో ఆ విశ్వవిద్యాలయాన్ని ఎక్స్పో స్థలాన్ని ఖాళీ చేయమని కోరారు.
ఇది కూడా చదవండి: Trump-Obama: ఒబామా చాలా తప్పు చేశారు.. ఆ వార్త లీక్ చేయడంపై ట్రంప్ అభ్యంతరం
ఇదిలా ఉంటే ఏఐ సమ్మిట్ నిర్వహణను రాహుల్ గాంధీ తప్పుపడితే.. శశిథరూర్ మాత్రం అభినందించారు. ‘‘శిఖరాగ్ర సమావేశానికి వెళ్లే అవకాశం నాకు లభించకపోయినా శుక్రవారం నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నాకు అర్థమైనంత వరకు మొదటి రెండు రోజులు చాలా బాగా గడిచాయి. కొన్ని లోపాలు, కొన్ని సంస్థాగత విషయాలు ఉన్నాయి. ఇవి ఒక పెద్ద కార్యక్రమంలో జరుగుతాయి.’’ అని శశిథరూర్ తెలిపారు.
ఇటీవలే శశిథరూర్తో కాంగ్రెస్ పెద్దలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలపై చర్చించారు. కేరళ ఎన్నికల వేళ ఇదో శుభపరిణామంగా భావించారు. మళ్లీ ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ.. మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని శశిథరూర్ ప్రశంసించారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..