Shashi Tharoor: ఏఐ సమ్మిట్ చాలా బాగా జరిగింది.. మళ్లీ కేంద్రంపై శశిథరూర్ ప్రశంసలు
- కేంద్ర ప్రభుత్వంపై మరోసారి శశిథరూర్ ప్రశంసలు
- ఏఐ సమ్మిట్ చాలా బాగా జరిగిందంటూ పొగడ్తలు
- సమ్మిట్ తీరును తప్పుపట్టిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ చాలా బాగా జరిగిందంటూ కొనియాడారు. పెద్ద కార్యక్రమాల్లో కొన్ని అవాంతరాలు జరుగుతుంటాయని.. అయినా కూడా కేంద్రం చాలా బాగా నిర్వహించిందని మెచ్చుకున్నారు.
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఏఐ సమ్మిట్ను విమర్శించారు. ‘‘అస్తవ్యస్తమైన ప్రజా సంబంధాల ప్రదర్శన’’ అని అభివర్ణించారు. చైనా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా తీవ్రంగా తప్పుపట్టారు.
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
ఇది కూడా చదవండి: Trump: బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్లో పాక్ ప్రధానికి అవమానం.. ట్రంప్ ఏం చేశారంటే..!
ఫిబ్రవరి 17న జరిగిన శిఖరాగ్ర సమావేశాల ప్రారంభ రోజున పొడవైన క్యూలు, భారీ జనసమూహం, లాజిస్టికల్ సమస్యలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. భద్రతా సిబ్బంది నుంచి స్పష్టమైన సూచనలు లేకుండానే గేట్లు మూసేశారని సందర్శకులు తెలిపారు. పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. అలాగే గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ విశ్వవిద్యాలయం వివాదానికి దారితీసింది. ‘‘ఓరియన్’’ అనే రోబోటిక్ కుక్కపై విమర్శలు రావడంతో ఆ విశ్వవిద్యాలయాన్ని ఎక్స్పో స్థలాన్ని ఖాళీ చేయమని కోరారు.
ఇది కూడా చదవండి: Trump-Obama: ఒబామా చాలా తప్పు చేశారు.. ఆ వార్త లీక్ చేయడంపై ట్రంప్ అభ్యంతరం
ఇదిలా ఉంటే ఏఐ సమ్మిట్ నిర్వహణను రాహుల్ గాంధీ తప్పుపడితే.. శశిథరూర్ మాత్రం అభినందించారు. ‘‘శిఖరాగ్ర సమావేశానికి వెళ్లే అవకాశం నాకు లభించకపోయినా శుక్రవారం నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నాకు అర్థమైనంత వరకు మొదటి రెండు రోజులు చాలా బాగా గడిచాయి. కొన్ని లోపాలు, కొన్ని సంస్థాగత విషయాలు ఉన్నాయి. ఇవి ఒక పెద్ద కార్యక్రమంలో జరుగుతాయి.’’ అని శశిథరూర్ తెలిపారు.
ఇటీవలే శశిథరూర్తో కాంగ్రెస్ పెద్దలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలపై చర్చించారు. కేరళ ఎన్నికల వేళ ఇదో శుభపరిణామంగా భావించారు. మళ్లీ ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ.. మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని శశిథరూర్ ప్రశంసించారు.
తాజావార్తలు
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!