Shashi Tharoor: ఏఐ సమ్మిట్ చాలా బాగా జరిగింది.. మళ్లీ కేంద్రంపై శశిథరూర్ ప్రశంసలు
- కేంద్ర ప్రభుత్వంపై మరోసారి శశిథరూర్ ప్రశంసలు
- ఏఐ సమ్మిట్ చాలా బాగా జరిగిందంటూ పొగడ్తలు
- సమ్మిట్ తీరును తప్పుపట్టిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ చాలా బాగా జరిగిందంటూ కొనియాడారు. పెద్ద కార్యక్రమాల్లో కొన్ని అవాంతరాలు జరుగుతుంటాయని.. అయినా కూడా కేంద్రం చాలా బాగా నిర్వహించిందని మెచ్చుకున్నారు.
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఏఐ సమ్మిట్ను విమర్శించారు. ‘‘అస్తవ్యస్తమైన ప్రజా సంబంధాల ప్రదర్శన’’ అని అభివర్ణించారు. చైనా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా తీవ్రంగా తప్పుపట్టారు.
Also Read
ఇది కూడా చదవండి: Trump: బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్లో పాక్ ప్రధానికి అవమానం.. ట్రంప్ ఏం చేశారంటే..!
ఫిబ్రవరి 17న జరిగిన శిఖరాగ్ర సమావేశాల ప్రారంభ రోజున పొడవైన క్యూలు, భారీ జనసమూహం, లాజిస్టికల్ సమస్యలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. భద్రతా సిబ్బంది నుంచి స్పష్టమైన సూచనలు లేకుండానే గేట్లు మూసేశారని సందర్శకులు తెలిపారు. పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. అలాగే గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ విశ్వవిద్యాలయం వివాదానికి దారితీసింది. ‘‘ఓరియన్’’ అనే రోబోటిక్ కుక్కపై విమర్శలు రావడంతో ఆ విశ్వవిద్యాలయాన్ని ఎక్స్పో స్థలాన్ని ఖాళీ చేయమని కోరారు.
ఇది కూడా చదవండి: Trump-Obama: ఒబామా చాలా తప్పు చేశారు.. ఆ వార్త లీక్ చేయడంపై ట్రంప్ అభ్యంతరం
ఇదిలా ఉంటే ఏఐ సమ్మిట్ నిర్వహణను రాహుల్ గాంధీ తప్పుపడితే.. శశిథరూర్ మాత్రం అభినందించారు. ‘‘శిఖరాగ్ర సమావేశానికి వెళ్లే అవకాశం నాకు లభించకపోయినా శుక్రవారం నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నాకు అర్థమైనంత వరకు మొదటి రెండు రోజులు చాలా బాగా గడిచాయి. కొన్ని లోపాలు, కొన్ని సంస్థాగత విషయాలు ఉన్నాయి. ఇవి ఒక పెద్ద కార్యక్రమంలో జరుగుతాయి.’’ అని శశిథరూర్ తెలిపారు.
ఇటీవలే శశిథరూర్తో కాంగ్రెస్ పెద్దలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలపై చర్చించారు. కేరళ ఎన్నికల వేళ ఇదో శుభపరిణామంగా భావించారు. మళ్లీ ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ.. మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని శశిథరూర్ ప్రశంసించారు.
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!