Delhi MLA Fund : ఢిల్లీ ప్రభుత్వం ఎమ్మెల్యే నిధిని రూ.4 కోట్ల నుంచి రూ.7 కోట్లకు పెంచింది. అదే సమయంలో ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు రూ.10 కోట్లకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రోజు మోహన్ యాదవ్ పదవీ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు సీఎం సంచలన ఆదేశాలు జారీ చేశారు. మతపరమైన, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Vishnu Deo Sai: ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా గిరిజన నేత విష్ణుదేవ్ సాయ్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. బుధవారం రాయ్పూర్లో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సాయ్ ప్రమాణస్వీకారం జరిగింది. ఛత్తీస్గఢ్ ఉపముఖ్యమంత్రులుగా బీజేపీ నేతలు అరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
Congress: బీజేపీ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సీఎంలుగా కొత్తవారిని నియమించడంపై కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రుల ఎంపికపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ రాహుల్ గాంధీ మార్గంలో నడుస్తున్నారంటూ పేర్కొన్నారు.
రాజ్యసభలో విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక బిల్లును ఆమోదించుకుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల సెలక్షన్ కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు కేంద్రమంత్రి ఉండనున్నారు.
Bhajan Lal Sharma: రాజకీయ హేమాహేమీలు, దిగ్గజాలు ఉన్నా కూడా వారందరిని పక్కన పెట్టి అనూహ్యమైన వ్యక్తిని రాజస్థాన్ సీఎంగా ప్రకటించింది బీజేపీ. మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్ వంటి వ్యక్తులను పక్కనపెడుతూ.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్లాల్ శర్మకు రాజస్థాన్ అధికార పగ్గాలు అప్పగించింది. ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాగే విష్ణుదేవ్ సాయ్, మోహన్ యాదవ్లను సీఎంలుగా ప్రకటించిన సర్ప్రైజ్ చేసిన బీజేపీ, రాజస్థాన్ సీఎం అభ్యర్థి…
PM Modi: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసాల నుంచి ఐటీ అధికారులు భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. గత బుధవారం నుంచి ఆయనకు సంబంధం ఉన్న మద్యం వ్యాపారాలపై దాడులు నిర్వహించారు. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిపిన దాడుల్లో ఏకంగా రూ. 353 కోట్ల నగదు బయటపడటం దేశాన్ని నివ్వెరపరిచింది.
డీజీపీ రవిగుప్తాను కాంగ్రెస్ నేతలు కలిశారు. ప్రభుత్వం కూలిపోతోంది అని కామెంట్స్ చేసిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డీజీపిని కలిసిన వారిలో.. పీసీసీ ప్రధాన కార్యదర్శులు కైలాశ్ నేత, చారుకొండ వెంకటేశ్, మధుసూదన్ రెడ్డిలు ఉన్నారు. వ్యాఖ్యలు చేసిన వారిలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నారు.
Diya Kumari: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బీజేపీ సంచలన వ్యక్తిని ప్రకటించింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్లాల్ శర్మని సీఎంగా ఎంపిక చేసింది. ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా రాజకుటుంబ నేపథ్యం ఉన్న దియా కుమారిని, ఎస్సీ వర్గానికి చెందిన ప్రేమ్ చంద్ బైర్వాలు ఎన్నికయ్యారు. అయితే, ముందుగా మాజీ సీఎం వసుంధర రాజేని స్థానంలో దియాకుమారి సీఎం అవుతారనే ప్రచారం జరిగింది. చివరకు ఉపముఖ్యమంత్రి పదవి దియాకుమారిని వరించింది.