Diya Kumari: “ప్రజల యువరాణి”.. రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా దియాకుమారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diya Kumari: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బీజేపీ సంచలన వ్యక్తిని ప్రకటించింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్లాల్ శర్మని సీఎంగా ఎంపిక చేసింది. ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా రాజకుటుంబ నేపథ్యం ఉన్న దియా కుమారిని, ఎస్సీ వర్గానికి చెందిన ప్రేమ్ చంద్ బైర్వాలు ఎన్నికయ్యారు. అయితే, ముందుగా మాజీ సీఎం వసుంధర రాజేని స్థానంలో దియాకుమారి సీఎం అవుతారనే ప్రచారం జరిగింది. చివరకు ఉపముఖ్యమంత్రి పదవి దియాకుమారిని వరించింది.
ప్రజల యువరాణిగా గుర్తింపు:
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియాకుమారి మహారాజా మాన్ సింగ్-2 మనవరాలు. ఆమె తండ్రి బ్రిగేడియర్ సవాయ్ భవానీ సింగ్, ఈయన 1971 భారత్-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. ఇతని పరాక్రమానికి మహావీర చక్ర అవార్డు లభించింది. రాజ కుటుంబంలో జన్మించినప్పటికీ, అత్యంత సాధారణ జీవితం గడిపే వ్యక్తిగా ఆమెకు పేరుంది. ‘‘జైపూర్ కుమార్తె’’, ‘‘వీధుల్లో నడిచే యువరాణి’’గా దియాకుమారికి పేరుంది. ఈ గుర్తింపే ఆమెను రాజస్థాన్ రాష్ట్రంలో ప్రముఖ వ్యక్తిని చేసింది.
దియా కుమారి నరేంద్ర సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇందులో ప్రస్తుత జైపూర్ ప్రస్తుత మహారాజా పద్మనాభ్ సింగ్ కూడా ఒకరు. దియాకుమారి 2018లో తన భర్తతో విడాకులు తీసుకున్నారు.

2013లో బీజేపీలో చేరిన దియా కుమారి వరసగా మూడు సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. తొలిసారిగా 2013లో సవాయ్ మాధోపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో లోక్ సభ ఎన్నికల్లో రాజ్సమంద్ నుంచి 5.5 లక్షల భారీ ఓట్ల మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విద్యాధర్ నగర్ నుంచి గెలుపొందారు.
52 ఏళ్ల దియా కుమారి పర్యావరణం, విద్యా, ఆరోగ్యం, మహిళా సాధికారత వంటి అంశాలపై ఎన్నికల్లో ప్రసంగించారు. రాజకీయాలకు అతీతంగా ఆమె పాఠశాలలు, ట్రస్టులు, హోటళ్లు వంటి అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈమె మహారాజా మాన్ సింగ్-2 మ్యూజియం ట్రస్ట్, జైఘర్ ఫోర్ట్ ఛారిటబుల్ ట్రస్టులను కూడా పర్యవేక్షిస్తు్న్నారు. తన పేరు మీదనే ‘‘ప్రిన్సెస్ దియాకుమారి ఫౌండేషన్’’ని నడుపుతోంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!