Diya Kumari: “ప్రజల యువరాణి”.. రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా దియాకుమారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diya Kumari: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బీజేపీ సంచలన వ్యక్తిని ప్రకటించింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్లాల్ శర్మని సీఎంగా ఎంపిక చేసింది. ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా రాజకుటుంబ నేపథ్యం ఉన్న దియా కుమారిని, ఎస్సీ వర్గానికి చెందిన ప్రేమ్ చంద్ బైర్వాలు ఎన్నికయ్యారు. అయితే, ముందుగా మాజీ సీఎం వసుంధర రాజేని స్థానంలో దియాకుమారి సీఎం అవుతారనే ప్రచారం జరిగింది. చివరకు ఉపముఖ్యమంత్రి పదవి దియాకుమారిని వరించింది.
ప్రజల యువరాణిగా గుర్తింపు:
Also Read
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
- CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
- Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
- Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియాకుమారి మహారాజా మాన్ సింగ్-2 మనవరాలు. ఆమె తండ్రి బ్రిగేడియర్ సవాయ్ భవానీ సింగ్, ఈయన 1971 భారత్-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. ఇతని పరాక్రమానికి మహావీర చక్ర అవార్డు లభించింది. రాజ కుటుంబంలో జన్మించినప్పటికీ, అత్యంత సాధారణ జీవితం గడిపే వ్యక్తిగా ఆమెకు పేరుంది. ‘‘జైపూర్ కుమార్తె’’, ‘‘వీధుల్లో నడిచే యువరాణి’’గా దియాకుమారికి పేరుంది. ఈ గుర్తింపే ఆమెను రాజస్థాన్ రాష్ట్రంలో ప్రముఖ వ్యక్తిని చేసింది.
దియా కుమారి నరేంద్ర సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇందులో ప్రస్తుత జైపూర్ ప్రస్తుత మహారాజా పద్మనాభ్ సింగ్ కూడా ఒకరు. దియాకుమారి 2018లో తన భర్తతో విడాకులు తీసుకున్నారు.

2013లో బీజేపీలో చేరిన దియా కుమారి వరసగా మూడు సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. తొలిసారిగా 2013లో సవాయ్ మాధోపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో లోక్ సభ ఎన్నికల్లో రాజ్సమంద్ నుంచి 5.5 లక్షల భారీ ఓట్ల మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విద్యాధర్ నగర్ నుంచి గెలుపొందారు.
52 ఏళ్ల దియా కుమారి పర్యావరణం, విద్యా, ఆరోగ్యం, మహిళా సాధికారత వంటి అంశాలపై ఎన్నికల్లో ప్రసంగించారు. రాజకీయాలకు అతీతంగా ఆమె పాఠశాలలు, ట్రస్టులు, హోటళ్లు వంటి అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈమె మహారాజా మాన్ సింగ్-2 మ్యూజియం ట్రస్ట్, జైఘర్ ఫోర్ట్ ఛారిటబుల్ ట్రస్టులను కూడా పర్యవేక్షిస్తు్న్నారు. తన పేరు మీదనే ‘‘ప్రిన్సెస్ దియాకుమారి ఫౌండేషన్’’ని నడుపుతోంది.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
-
Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
-
David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
-
CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
-
Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!