ఢిల్లీలో తదుపరి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయనున్నారో నేటితో తేలనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం ఆసన్నమైంది. మూడంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో కౌంటింగ్ నిరహిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వరుసగా మూడోసారి గెలుస్తుందా? లేదా రాజధానిలో బీజేపీ 27 ఏళ్ల అధికార కరువును అంతం చేస్తుందా? అనే దానిపై అందరి దృష్టి ఉంది. అదే సమయంలో గత రెండు…
Arvind Kejriwal: ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. తొలి ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. ఆప్ వెనకంజలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ సత్తా చూపలేకపోతోందని వెల్లడైంది. ప్రస్తుతం సమచారం ప్రకరాం, బీజేపీ -18, ఆప్ -13, కాంగ్రెస్-1 స్థానంలో ముందంజలో ఉన్నాయి.
Delhi Election Results 2025 Live Updates: దేశ రాజధానిలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఆమ్ ఆద్మీ పార్టీ.. ఆ పార్టీని గద్దె దించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఢిల్లీ పాలనా పగ్గాలు దక్కించుకోవాలన్న కసితో భారతీయ జనతా పార్టీ!
Delhi Election Results: దేశవ్యాప్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీజేపీ గత వైభవాన్ని సాధిస్తుందా..? లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) హ్యాట్రిక్ కొడుతుందా.? అని చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని సాధించి 26 ఏళ్లు అవుతోంది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ గత రెండు సార్లు అధికారాన్ని సాధించింది. ఈసారి మాత్రం విజయం అంత సులువు కాదనే భావన అందరిలో ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నిలక పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించాయి. నాలుగోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఆప్, సుధీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలతో పనిచేశాయి. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు తేలనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నేడు కౌంటింగ్ నిర్వహించనున్నారు.…
కరీంనగర్లో జరగనున్న పట్టభద్రుల సంకల్ప యాత్రకు రండి.. తరలిరండి.. అంటూ బీజేపీ పిలుపునిచ్చింది.. ఉమ్మడి కరీంనగర్ - ఆదిలాబాద్ - మెదక్ - నిజామాబాద్ పట్టభద్రుల ఓటరు లారా.. మన గళమై వస్తున్న మన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గొంతును బలపరిచేందుకు.. మన హక్కుల సాధన కోసం.. మన శక్తిని ప్రదర్శించేందుకు రండి అని సూచించారు..
లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు తమ విభేదాలను పక్కన పెట్టాయి. ఇండియా అలయన్స్ గా ఏర్పడి 2024 ఎన్నికల్లో బీజేపీకి చెమటలు పట్టించాయి. ఫలితంగా బీజేపీ మెజారిటీని కోల్పోయింది. ప్రధాని మోడీ మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మిత్రదేశాల మద్దతు తీసుకోవలసి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి టెన్షన్ పెంచిన అఖిల భారత కూటమి ఢిల్లీ ఎన్నికల్లో చెల్లాచెదురుగా కనిపించింది. కాంగ్రెస్ ఒంటరిగా మారింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. దేశ వ్యాప్తంగా ఢిల్లీ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈసారి ఏ పార్టీ గెలుస్తుందోనన్న ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థుల కొనుగోలు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. 16 మంది ఆప్ అభ్యర్థుల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. తాజాగా అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఆరోపణలపై లిఖిత పూర్వకంగా స్పందిస్తామని ఈసీ స్పష్టం చేసింది. అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. "రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం ప్రాధాన్యత ఇస్తుంది.