Delhi: బీజేపీ ముఖ్యమంత్రి ‘శీష్ మహల్’లో ఉండరు.. అధికారిక వర్గాల సమాచారం
- బీజేపీ ముఖ్యమంత్రి ‘శీష్ మహల్’ ఉండరు
- అధికారిక వర్గాల సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫలితాలు వచ్చి రెండు రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు. నేటి నుంచి 4 నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ వెళ్తున్నారు. ఈ పర్యటన ముగించుకుని తిరిగి భారత్కు వచ్చాకే.. ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి ఎవరన్నది తేలుతుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు వినిపిస్తోంది. వర్మ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.
ఇది కూడా చదవండి: Delhi Elections : అప్పుడు అతిషి డ్యాన్స్.. ఇప్పుడు సౌరభ్ భరద్వాజ్ ఏడుపు.. వైరల్ అవుతున్న వీడియోలు
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
సీఎం రేసులోకి మరికొంది పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మాలవీయ నగర్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి విజయం సాధించకుండా ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతిని అడ్డుకున్న సతీష్ ఉపాధ్యాయ, జనక్పురి స్థానం నుంచి కొత్త ఎమ్మెల్యే ఆశిష్ సూద్, ప్రస్తుతం రోహ్తాస్ నగర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న జితేంద్ర మహాజన్, రోహిణి స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విజేందర్ గుప్తా పేర్లు కూడా వినిపిస్తున్నాయి.ముఖ్యమంత్రి ఎవరనేది మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ నివాసం ఉన్న ప్రభుత్వ బంగ్లా ‘‘శీష్ మహల్’’లో బీజేపీ ముఖ్యమంత్రి ఉండబోరని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ నివసించిన సివిల్ లైన్స్లోని ఫ్లాగ్స్టాఫ్ రోడ్ బంగ్లా ‘‘శీష్ మహల్’’ను ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి నివసించరని వర్గాలు తెలిపాయి. ఎన్నికల సమయంలో బంగ్లా పునరుద్ధరణలో భారీ స్కామ్ జరిగిందని బీజేపీ ఆరోపించింది. ఎంతేకాకుండా శీష్ మహల్ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి అందులో ఉండబోరని వర్గాలు స్పష్టం చేశాయి.
ఇది కూడా చదవండి: Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఇంకెప్పుడమ్మా!
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలను గెలుచుకుంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాకే.. ఢిల్లీ సీఎం ఎంపిక ఉండనుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీ ఈనెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఎప్పుడు ఉంటుందో ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!