Delhi: బీజేపీ ముఖ్యమంత్రి ‘శీష్ మహల్’లో ఉండరు.. అధికారిక వర్గాల సమాచారం
- బీజేపీ ముఖ్యమంత్రి ‘శీష్ మహల్’ ఉండరు
- అధికారిక వర్గాల సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫలితాలు వచ్చి రెండు రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు. నేటి నుంచి 4 నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ వెళ్తున్నారు. ఈ పర్యటన ముగించుకుని తిరిగి భారత్కు వచ్చాకే.. ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి ఎవరన్నది తేలుతుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు వినిపిస్తోంది. వర్మ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.
ఇది కూడా చదవండి: Delhi Elections : అప్పుడు అతిషి డ్యాన్స్.. ఇప్పుడు సౌరభ్ భరద్వాజ్ ఏడుపు.. వైరల్ అవుతున్న వీడియోలు
Also Read
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సీఎం రేసులోకి మరికొంది పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మాలవీయ నగర్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి విజయం సాధించకుండా ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతిని అడ్డుకున్న సతీష్ ఉపాధ్యాయ, జనక్పురి స్థానం నుంచి కొత్త ఎమ్మెల్యే ఆశిష్ సూద్, ప్రస్తుతం రోహ్తాస్ నగర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న జితేంద్ర మహాజన్, రోహిణి స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విజేందర్ గుప్తా పేర్లు కూడా వినిపిస్తున్నాయి.ముఖ్యమంత్రి ఎవరనేది మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ నివాసం ఉన్న ప్రభుత్వ బంగ్లా ‘‘శీష్ మహల్’’లో బీజేపీ ముఖ్యమంత్రి ఉండబోరని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ నివసించిన సివిల్ లైన్స్లోని ఫ్లాగ్స్టాఫ్ రోడ్ బంగ్లా ‘‘శీష్ మహల్’’ను ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి నివసించరని వర్గాలు తెలిపాయి. ఎన్నికల సమయంలో బంగ్లా పునరుద్ధరణలో భారీ స్కామ్ జరిగిందని బీజేపీ ఆరోపించింది. ఎంతేకాకుండా శీష్ మహల్ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి అందులో ఉండబోరని వర్గాలు స్పష్టం చేశాయి.
ఇది కూడా చదవండి: Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఇంకెప్పుడమ్మా!
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలను గెలుచుకుంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాకే.. ఢిల్లీ సీఎం ఎంపిక ఉండనుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీ ఈనెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఎప్పుడు ఉంటుందో ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు.
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?