Delhi: బీజేపీ ముఖ్యమంత్రి ‘శీష్ మహల్’లో ఉండరు.. అధికారిక వర్గాల సమాచారం
- బీజేపీ ముఖ్యమంత్రి ‘శీష్ మహల్’ ఉండరు
- అధికారిక వర్గాల సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫలితాలు వచ్చి రెండు రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు. నేటి నుంచి 4 నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ వెళ్తున్నారు. ఈ పర్యటన ముగించుకుని తిరిగి భారత్కు వచ్చాకే.. ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి ఎవరన్నది తేలుతుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు వినిపిస్తోంది. వర్మ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.
ఇది కూడా చదవండి: Delhi Elections : అప్పుడు అతిషి డ్యాన్స్.. ఇప్పుడు సౌరభ్ భరద్వాజ్ ఏడుపు.. వైరల్ అవుతున్న వీడియోలు
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
సీఎం రేసులోకి మరికొంది పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మాలవీయ నగర్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి విజయం సాధించకుండా ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతిని అడ్డుకున్న సతీష్ ఉపాధ్యాయ, జనక్పురి స్థానం నుంచి కొత్త ఎమ్మెల్యే ఆశిష్ సూద్, ప్రస్తుతం రోహ్తాస్ నగర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న జితేంద్ర మహాజన్, రోహిణి స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విజేందర్ గుప్తా పేర్లు కూడా వినిపిస్తున్నాయి.ముఖ్యమంత్రి ఎవరనేది మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ నివాసం ఉన్న ప్రభుత్వ బంగ్లా ‘‘శీష్ మహల్’’లో బీజేపీ ముఖ్యమంత్రి ఉండబోరని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ నివసించిన సివిల్ లైన్స్లోని ఫ్లాగ్స్టాఫ్ రోడ్ బంగ్లా ‘‘శీష్ మహల్’’ను ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి నివసించరని వర్గాలు తెలిపాయి. ఎన్నికల సమయంలో బంగ్లా పునరుద్ధరణలో భారీ స్కామ్ జరిగిందని బీజేపీ ఆరోపించింది. ఎంతేకాకుండా శీష్ మహల్ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి అందులో ఉండబోరని వర్గాలు స్పష్టం చేశాయి.
ఇది కూడా చదవండి: Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఇంకెప్పుడమ్మా!
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలను గెలుచుకుంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాకే.. ఢిల్లీ సీఎం ఎంపిక ఉండనుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీ ఈనెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఎప్పుడు ఉంటుందో ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు.
తాజావార్తలు
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
-
Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
-
I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
-
ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!