Delhi Elections: తెరపైకి దళిత ముఖ్యమంత్రి!, డిప్యూటీ సీఎం పోస్టు కూడా..! బీజేపీ స్ట్రాటజీ ఇదేనా?
- ఢిల్లీలో తెరపైకి దళిత ముఖ్యమంత్రి!
- డిప్యూటీ సీఎం పోస్టు కూడా ఏర్పాటు..!
- ఇప్పటికే రాష్ట్రపతిగా ఎస్టీ మహిళ
- ఇప్పుడు ఢిల్లీ పీఠంపైకి దళిత సీఎం
- దేశ వ్యాప్తంగా ఆ వర్గాలకు దగ్గరయ్యే ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తిరిగి లేని మెజార్టీని కమలం పార్టీ అందుకుంది. అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు. ఈ విషయంలో కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రధాని మోడీ రెండు దేశాల విదేశీ పర్యటనకు వెళ్లారు. ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాక.. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: నేడు వరంగల్కు రాహుల్ గాంధీ.. పార్టీ శ్రేణులతో భేటీ!
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
అయితే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో చాలా మాస్టర్ ప్లాన్తో వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచేలా దేశ రాజధాని ఢిల్లీలో ఒక దళిళ ముఖ్యమంత్రిని ఎంపిక చేయొచ్చని వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇప్పటికే రాష్ట్రపతిగా ఎస్టీ వర్గానికి చెందిన మహిళను కూర్చోబెట్టారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఒక దళిత మహిళను ఎంపిక చేయాలని కమలనాథులు భావిస్తున్నట్లు సమాచారం. ఇలా ఎస్సీ, ఎస్టీ వర్గాలను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని కాషాయ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి పోస్టుతో పాటు ఉప ముఖ్యమంత్రి ఎంపిక కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఇలా కేబినెట్ అంతా బలహీన వర్గాలతో నింపాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ఆల్రెడీ హైకమాండ్ పెద్దలు తీవ్ర కసరత్తు చేస్తు్న్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: AP Government: మాదక ద్రవ్యాలపై యుద్ధం.. విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు..
తొలుత ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ బీజేపీ పెద్దలు మాత్రం… అందుకు భిన్నంగా మహిళా ముఖ్యమంత్రి కోసం కసరత్తు చేస్తున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ నుంచి నలుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. షాలిమార్బాగ్ నుంచి రేఖా గుప్తా ఆప్ నేత బందన కుమారిని 29,595 ఓట్లతో ఓడించారు. గ్రేటర్ కైలాష్ నుంచి శిఖా రాయ్.. ఆప్ కీలక నేత సౌరభ్ భరద్వాజ్ని 3,188 ఓట్ల తేడాతో ఓడించారు. వజీర్పూర్ నుంచి పూనమ్ శర్మ… ఆప్ అభ్యర్థి రాజేష్ గుప్తాను మట్టికరిపించారు. నీలం పెహల్వాన్ నాజాఫ్గఢ్ నుంచి ఆప్ నేత తరుణ్ కుమార్పై 29 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఏదేమైనా ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో మాత్రం చాలా వ్యూహాత్మకంగా బీజేపీ వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా… బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకుంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. ఇక కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి రాజకీయ ఉద్దండులంతా ఇంటి బాట పట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి మాత్రం అతి కష్టం మీద స్వల్ప మెజార్టీతో కల్కాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: UK: హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్న బ్రిటన్ ప్రధాని.. ఆదర్శంగా నిలిచిన స్టార్మర్
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!