Anurag Thakur: రాహుల్ గారు ‘సున్నా’ని చెక్ చేయండి.. పార్లమెంట్లో కాంగ్రెస్ పరువుతీసిన బీజేపీ..
- రాహుల్ గాంధీ గారు ‘‘సున్నా’’ని చెక్ చేయండి..
- ఢిల్లీ ఫలితాలపై కాంగ్రెస్ని ఎగతాళి చేసిన అనురాగ్ ఠాకూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anurag Thakur: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీనిని ఉద్దేశిస్తూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్సభలో రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ట్రాక్ రికార్డుని మరోసారి గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఉన్న ఆదాయపు పన్నుపై అనురాగ్ ఠాకూర్ వివరణాత్మకంగా విశ్లేషించారు.
రూ. 12 లక్షల ఆదాయం వరకు ‘‘సున్నా పన్ను’’ అని రాసిన పోస్టర్ని బీజేపీ ఎంపీలు ప్రదర్శించారు. కాంగ్రెస్ ఈ ‘‘సున్నా’’ గురించి బాధపడొచ్చు, కానీ ప్రభుత్వం కోట్లాది మంది సామాన్యుల్లో ఆనందాన్ని చూస్తోందని ఠాకూర్ అన్నారు. ‘‘రాహుల్ గారు సున్నాని చెక్ చేయండి’’ అని ఆయన ఎగతాళి చేశారు. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా స్థానాలకు పరిమితమైన తర్వాత, రాహుల్ గాంధీ పెట్రోల్ పంప్లో ‘‘సున్నా’’ని చెక్ చేస్తున్న మీమ్స్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
Read Also: Allu Aravind : తండేల్ పైరసీ.. అరెస్ట్ చేయిస్తాం.. గ్రూప్ అడ్మిన్స్ కి అల్లు అరవింద్ హెచ్చరిక
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను స్లాబ్లను ప్రకటించారు, ఇది సంవత్సరానికి రూ. 12.75 లక్షల వరకు సంపాదించే జీతగాళ్లకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చింది. ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ని ఉద్దేశిస్తూ, అనురాగ్ ఠాకూర్ ఆ పార్టీ పరాజయాల లిస్ట్ని వెల్లడించారు. ఠాకూర్ ప్రశ్నించిన ప్రతీసారి, బీజేపీ ఎంపీలు సున్నా అంటూ ప్రతిస్పందించారు. ఇలాంటి రికార్డుని కేవలం రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీనే సృష్టిస్తుందని ఆయన సెటైర్లు వేశారు.
ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మొత్తం 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 48 స్థానాలను బీజేపీ, 22 స్థానాలను ఆప్ గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం సున్నా స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 67 చోట్ల డిపాజిట్ కోల్పోయింది.
राहुल जी, ज़ीरो चेक कर लीजिए 👉🏻 0️⃣ pic.twitter.com/0Sg9IEy09I
— Anurag Thakur (@ianuragthakur) February 10, 2025
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..