Delhi: పంజాబ్ ప్రభుత్వంలో అలజడి.. కేజ్రీవాల్తో కేబినెట్, ఎమ్మెల్యేల భేటీ
- పంజాబ్ ప్రభుత్వంలో అలజడి
- కేజ్రీవాల్తో కేబినెట్, ఎమ్మెల్యేల భేటీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత.. పంజాబ్ ప్రభుత్వంలో గుబులు మొదలైంది. భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. దాదాపు 35 మంది ఆప్ ఎమ్మెల్యేలు గట్టు దాటేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఆప్ హైకమాండ్ సీరియస్గా తీసుకుంది. పంజాబ్లో ప్రభుత్వం మార్పులు జరిగే సూచనలు కనిపించడంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో సహా మంత్రులు, ప్రజాప్రతినిధులందరినీ కేజ్రీవాల్ ఢిల్లీకి పిలిపించారు. కపుర్తలా హౌస్లో పంజాబ్ నేతలందరితో సమావేశం అయ్యారు. తాజాగా రాజకీయ పరిణామాలపై వారితో చర్చిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Sperm Count: వీటిని తీసుకోవడం ఆపకపోతే స్పెర్మ్ కౌంట్ తగ్గడం గ్యారెంటీ.. జాగ్రత్త సుమీ
Also Read
- AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..
- Jabalpur Boat Tragedy: "లైఫ్ జాకెట్" ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
- Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
- AI Viral Story: సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి వెయిటర్గా.. ఏఐ దెబ్బకు తలకిందులైన జీవితం..
2027లో పంజాబ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై వారితో కేజ్రీవాల్ చర్చిస్తు్నట్లు సమాచారం. అలాగే వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ తీరును పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు సుఖ్జిందర్ సింగ్ రాంధావ్ తప్పుపట్టారు. ఒక్కడు (కేజ్రీవాల్) పంజాబ్ వస్తే సరిపోతుంది కదా?.. అలాంటిది పంజాబ్ ప్రతినిధుల్ని తన దగ్గరకు రప్పించుకోవడం ఏ మాత్రం భావ్యంగా ఉందా? అని నిలదీశారు.
ఇది కూడా చదవండి: Delhi: పంజాబ్ ప్రభుత్వంలో అలజడి.. కేజ్రీవాల్తో కేబినెట్, ఎమ్మెల్యేల భేటీ
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు కైవసం చేసుకున్నాయి. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి ఉద్దండులంతా ఓటమి చెందారు. ఇక 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక బీజేపీ.. ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక చేయలేదు. అయితే మహిళను ముఖ్యమంత్రిగా చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దళిత ముఖ్యమంత్రి ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చాకే.. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపిక ఉండనుంది.
ఇది కూడా చదవండి: RC 16: క్రికెట్ విత్ కుస్తీ.. టైటిల్ వేటలో యూనిట్
91 MLAs traveling Punjab to Delhi to meet one person.
Who’s paying for this? Taxpayers. 🥲 https://t.co/lrWzL4EGJO
— maithun (@Being_Humor) February 11, 2025
తాజావార్తలు
-
Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
-
Varanasi: మహేష్ బాబు వారణాసికి నీటి కష్టాలు.. జక్కన్న రిక్వెస్ట్కు సింపుల్గా నో చెప్పిన జలమండలి!
-
Jio Rs 209 Plan: జియో యూజర్స్కు షాక్.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఇక బంద్! కారణం ఇదేనా?
-
Egg Biryani Recipe: 10 నిమిషాల్లోనే కుక్కర్ లో ఎగ్ బిర్యానీ.. ఇలా చేస్తే టెస్ట్ అదుర్స్..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!