Delhi: పంజాబ్ ప్రభుత్వంలో అలజడి.. కేజ్రీవాల్తో కేబినెట్, ఎమ్మెల్యేల భేటీ
- పంజాబ్ ప్రభుత్వంలో అలజడి
- కేజ్రీవాల్తో కేబినెట్, ఎమ్మెల్యేల భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత.. పంజాబ్ ప్రభుత్వంలో గుబులు మొదలైంది. భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. దాదాపు 35 మంది ఆప్ ఎమ్మెల్యేలు గట్టు దాటేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఆప్ హైకమాండ్ సీరియస్గా తీసుకుంది. పంజాబ్లో ప్రభుత్వం మార్పులు జరిగే సూచనలు కనిపించడంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో సహా మంత్రులు, ప్రజాప్రతినిధులందరినీ కేజ్రీవాల్ ఢిల్లీకి పిలిపించారు. కపుర్తలా హౌస్లో పంజాబ్ నేతలందరితో సమావేశం అయ్యారు. తాజాగా రాజకీయ పరిణామాలపై వారితో చర్చిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Sperm Count: వీటిని తీసుకోవడం ఆపకపోతే స్పెర్మ్ కౌంట్ తగ్గడం గ్యారెంటీ.. జాగ్రత్త సుమీ
Also Read
2027లో పంజాబ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై వారితో కేజ్రీవాల్ చర్చిస్తు్నట్లు సమాచారం. అలాగే వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ తీరును పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు సుఖ్జిందర్ సింగ్ రాంధావ్ తప్పుపట్టారు. ఒక్కడు (కేజ్రీవాల్) పంజాబ్ వస్తే సరిపోతుంది కదా?.. అలాంటిది పంజాబ్ ప్రతినిధుల్ని తన దగ్గరకు రప్పించుకోవడం ఏ మాత్రం భావ్యంగా ఉందా? అని నిలదీశారు.
ఇది కూడా చదవండి: Delhi: పంజాబ్ ప్రభుత్వంలో అలజడి.. కేజ్రీవాల్తో కేబినెట్, ఎమ్మెల్యేల భేటీ
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు కైవసం చేసుకున్నాయి. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి ఉద్దండులంతా ఓటమి చెందారు. ఇక 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక బీజేపీ.. ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక చేయలేదు. అయితే మహిళను ముఖ్యమంత్రిగా చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దళిత ముఖ్యమంత్రి ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చాకే.. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపిక ఉండనుంది.
ఇది కూడా చదవండి: RC 16: క్రికెట్ విత్ కుస్తీ.. టైటిల్ వేటలో యూనిట్
91 MLAs traveling Punjab to Delhi to meet one person.
Who’s paying for this? Taxpayers. 🥲 https://t.co/lrWzL4EGJO
— maithun (@Being_Humor) February 11, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!