యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా బీహార్ ప్రభుత్వం పారిపోతుందని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఆరోపించారు. నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ఛార్జ్ కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో రాహుల్గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
బీహార్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. బీజేపీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. ఇక కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ కొద్దిరోజులుగా ‘‘పలయన్ రోకో, నౌక్రీ దో’’ (వలసలను ఆపండి, ఉద్యోగాలు కల్పించండి) పేరుతో పాదయాత్ర చేస్తున్నారు.
Thane: క్యాన్సర్ పేషెంట్ అని చూడకుండా 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిని మహారాష్ట్ర థానే పోలీసులు అరెస్ట్ చేసినట్లు శనివారం తెలిపారు. 29 ఏళ్ల నిందితుడిని బీహార్ నుంచి అరెస్ట్ చేసినట్లు సీనియర్ అధికారి తెలిపారు. బీహార్లో బాలిక కుటుంబం ఉన్న అదే గ్రామానికి చెందిన నిందితుడు రెండు నెలల క్రితం బద్లాపూర్లో వారి కోసం ఒక అద్దె వసతిని ఏర్పాటు చేశాడు. బాలిక చికిత్సకు సాయం చేశాడు.
JDU: బీహార్లో ఎన్నికలకు మరికొన్ని నెలలు సమయం ఉంది. ఈ సమయంలో జేడీయూ పార్టీ ‘‘వక్ఫ్ బిల్లు’’ కల్లోలంలో ఇరుక్కుంది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీకి చెందిన మైనారిటీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా, మరో నేత పార్టీని వీడారు. తాజాగా, ఆ పార్టీ యూత్ వింగ్ ఉపాధ్యక్షుడు తబ్రేజ్ హసన్ పార్టీకి రాజీనామా చేశారు.
illicit Relationship: బీహార్లోని సీతామర్హిలో దారుణం చోటు చేసుకుంది. తన స్నేహితుడి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో 22 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.
Black Magic: బీహార్ ఔరంగాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చేతబడి, తంత్ర విద్యకు ఓ వ్యక్తి బలయ్యాడు. అత్యంత దారుణంగా అతడి తల నరికి, మొండాన్ని అగ్నిలో కాల్చేశారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని 65 ఏళ్ల యుగుల్ యాదవ్గా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో తాంత్రికుడి బంధువు కూడా ఉన్నాడు.
కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్కు బీహార్లో చేదు అనుభవం ఎదురైంది. పర్యటనలో భాగంగా సహర్సా జిల్లాలోని బంగావ్ గ్రామంలో దుర్గా ఆలయాన్ని కన్హయ్య కుమార్ సందర్శించారు. ‘పలయన్ రోకో, నౌక్రీ దో’ పాదయాత్ర సందర్భంగా ఆలయాన్ని సందర్శించారు.
Bihar: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కి దేశ అత్యున్నత పురస్కారం ‘‘భారతరత్న’’ ఇవ్వాలని ఆ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. అయితే, తాజాగా ఆర్జేడీకి గట్టి ఎదురుదెబ్బ తాకింది. లాలూకు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనను బీహార్ అసెంబ్లీ బుధవారం తిరస్కరించింది. బుధవారం ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ మరోసారి బీహార్ అసెంబ్లీలో ప్రతిపాదించారు. బీహార్ ప్రభుత్వం అత్యున్నత అవార్డు కోసం లాలూ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరారు.
బీహార్లోని అరా రైల్వే స్టేషన్లో మంగళవారం సాయంత్రం ముగ్గురు మృతి చెందారు. 16 ఏళ్ల బాలికను, ఆమె తండ్రిని ఒక వ్యక్తి కాల్చి చంపాడు. దీని తర్వాత నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. అరా రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నంబర్ 2, ప్లాట్ఫామ్ నంబర్ 3 లను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ సంఘటన జరిగింది. కాల్పులు జరిపిన వ్యక్తిని అమన్ కుమార్గా గుర్తించినట్లు భోజ్పూర్ జిల్లా…
iPhone: ఇటీవల యువత తమ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ఆత్మహత్య చేసుకుంటామని ఓ విధంగా పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేసి, తమకు కావాల్సినవి సాధించుకుంటున్నారు. పిల్లల కోరికల్ని తీర్చేందుకు తల్లిదండ్రులు నలిగిపోవాల్సి వస్తోంది. తాజాగా, ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఐఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్యాయత్నాన్నికి పాల్పడింది. ఈ ఘటన బీహార్లోని ముంగేర్లో జరిగింది.