Tej Pratap Yadav: 12 ఏళ్లుగా ప్రేమలో ఉంటే, ఐశ్వర్యా రాయ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్..
- బీహార్ రాజకీయాలను కుదిపేస్తున్న తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యవహారం..
- పార్టీ నుంచి కొడుకును సస్పెండ్ చేసిన లాలూ ప్రసాద్ యాదవ్..
- ఒక అమ్మాయిలో 12 ఏళ్లు ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా పోస్ట్..
- మరి, ఐశ్వర్యారాయ్ని ఎందుకు వివాహం చేసుకున్నావంటూ ప్రశ్నలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tej Pratap Yadav: బీహార్ ఎన్నికల ముందు ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ నుంచి తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ని 6 ఏళ్లు బహిష్కరిస్తున్నట్లు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాన్ని ఆర్జేడీ నేత, లాలూ మరో కుమారుడు తేజస్వీ యాదవ్ సమర్థించారు. ఈ వివాదంపై తేజస్వీ మాట్లాడుతూ.. తన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పెద్దవాడని, సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయనకు ఉందని అన్నారు. కానీ తన సోదరుడి బహిష్కరణపై అతని తండ్రి నిర్ణయం నిలుస్తుందని, పార్టీ ఇలాంటి వాటిని సహించదని అన్నారు. మరోవైపు, బీజేపీ, జేడీయూలు ఆర్జేడీ, లాలూ ప్రసాద్ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు.
శనివారం, తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రేమ, ప్రియురాలు గురించి ఓ ఫేస్బుక్ పోస్టులో పంచుకోవడం వివాదాస్పదమైంది. అనుష్క యాదవ్గా చెప్పబడుతున్న అమ్మాయితో తాను 12 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నానని, రిలేషన్ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఆ తర్వాత తన ఫేస్బుక్ పేజీ హ్యాక్ అయిందని తేజ్ ప్రతాప్ చెప్పారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
తేజ్ ప్రతాప్ యాదవ్ 2018లో బీహార్ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్ని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకే వీరిద్దరు విడిపోయారు. అనుష్క యాదవ్తో 12 ఏళ్లుగా ప్రేమలో ఉంటే ఐశ్వర్యని ఎందుకు పెళ్లి చేసుకున్నారని బీజేపీ, జేడీయూ నేతలు ప్రశ్నిస్తున్నారు. తేజ్ ప్రతాప్ ఇద్దరు అమ్మాయిల జీవితాలను నాశనం చేశారని విమర్శిస్తున్నారు. ఆ సమయంలో రాజకీయ కారణాలు, ఇతర సమీకరణాల్లో భాగంగా, కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే తేజ్ ప్రతాప్ ఈ వివాహానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు దీనిపై బీజేపీ, జేడీయూలు లాలూ ఫ్యామిలీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై స్పందించిన లాలూ ప్రసాద్ యాదవ్, నైతిక విలువలు విస్మరించిందుకు తేజ్ ప్రతాప్ యాదవ్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై తేజస్వీ యాదవ్ ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇందులో ‘‘మేము ఇలాంటి వాటిని సహించలేము. మేము బీహార్ ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తున్నాము’’ అని పోస్ట్ చేశారు. “నా అన్నయ్య గురించి అయితే, రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం వేరు. ఆయనకు తన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది… మా పార్టీ అధినేత స్పష్టం చేశారు” అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..