Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం నితీశ్ కుమార్ కీలక నిర్ణయం.. ట్రిపులైన పెన్షన్లు!
- బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయం..
- వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు అందించే పింఛను పెంచిన బీహార్ సర్కార్..
- రూ. 400 నుంచి రూ. 1,100 ఇవ్వనున్నట్లు ప్రకటించిన సీఎం నితీన్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీహార్లోని వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు అందించే పింఛను సొమ్మును పెంచేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.400 పెన్షన్ మొత్తాన్ని దాదాపు ట్రిపుల్ చేసి.. రూ.1,100లకు పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Nani : ఆ విషయంలో.. సెంటిమెంట్ను పక్కన పెట్టిన న్యాచురల్ స్టార్ !
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
అయితే, పెంచిన పెన్షన్లు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల కోటి మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు అందుతాయి. సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులైన మహిళలు అందరికీ ఇకపై రూ.1,100 మా ప్రభుత్వం అందించనుంది అని ప్రకటించారు. ఈ విషయం మీకు తెలియజేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది.. జులై 1 నుంచి లబ్ధిదారులకు ఈ మొత్తం పెన్షన్ పంపిణీ చేయనున్నామని తేల్చి చెప్పారు. అదే నెల 10వ తేదీ వరకు అందరికీ అందించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం నితీశ్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: DGCA: ఎయిర్ ఇండియాపై డీజీసీఏ కఠిన చర్యలు.. ముగ్గురు అధికారులను తొలగించాలని ఆదేశాలు
కాగా, బీహార్ రాష్ట్రంలోని వృద్ధులు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకే మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. ఆ దిశగా తాము కృషి చేస్తున్నాం అని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు. ఇదిలాఉండగా.. ఈ ఏడాది చివర్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు జనతాదళ్ (యూనైటెడ్), ఎన్డీయే, ఆర్జేడీ తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే నితీశ్ కుమార్ తన ఎన్నికల వ్యూహాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!