Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం నితీశ్ కుమార్ కీలక నిర్ణయం.. ట్రిపులైన పెన్షన్లు!
- బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయం..
- వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు అందించే పింఛను పెంచిన బీహార్ సర్కార్..
- రూ. 400 నుంచి రూ. 1,100 ఇవ్వనున్నట్లు ప్రకటించిన సీఎం నితీన్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీహార్లోని వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు అందించే పింఛను సొమ్మును పెంచేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.400 పెన్షన్ మొత్తాన్ని దాదాపు ట్రిపుల్ చేసి.. రూ.1,100లకు పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Nani : ఆ విషయంలో.. సెంటిమెంట్ను పక్కన పెట్టిన న్యాచురల్ స్టార్ !
Also Read
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
- Abhishek Banerjee:అభిషేక్ దాడి వెనుక బీజేపీనా? టీఎంసీనా? బెంగాల్లో కొత్త రాజకీయ తుఫాన్
- West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. "కట్మనీ"పై టీఎంసీలో భయం..
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
అయితే, పెంచిన పెన్షన్లు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల కోటి మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు అందుతాయి. సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులైన మహిళలు అందరికీ ఇకపై రూ.1,100 మా ప్రభుత్వం అందించనుంది అని ప్రకటించారు. ఈ విషయం మీకు తెలియజేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది.. జులై 1 నుంచి లబ్ధిదారులకు ఈ మొత్తం పెన్షన్ పంపిణీ చేయనున్నామని తేల్చి చెప్పారు. అదే నెల 10వ తేదీ వరకు అందరికీ అందించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం నితీశ్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: DGCA: ఎయిర్ ఇండియాపై డీజీసీఏ కఠిన చర్యలు.. ముగ్గురు అధికారులను తొలగించాలని ఆదేశాలు
కాగా, బీహార్ రాష్ట్రంలోని వృద్ధులు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకే మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. ఆ దిశగా తాము కృషి చేస్తున్నాం అని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు. ఇదిలాఉండగా.. ఈ ఏడాది చివర్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు జనతాదళ్ (యూనైటెడ్), ఎన్డీయే, ఆర్జేడీ తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే నితీశ్ కుమార్ తన ఎన్నికల వ్యూహాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
తాజావార్తలు
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!