Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం నితీశ్ కుమార్ కీలక నిర్ణయం.. ట్రిపులైన పెన్షన్లు!
- బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయం..
- వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు అందించే పింఛను పెంచిన బీహార్ సర్కార్..
- రూ. 400 నుంచి రూ. 1,100 ఇవ్వనున్నట్లు ప్రకటించిన సీఎం నితీన్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీహార్లోని వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు అందించే పింఛను సొమ్మును పెంచేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.400 పెన్షన్ మొత్తాన్ని దాదాపు ట్రిపుల్ చేసి.. రూ.1,100లకు పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Nani : ఆ విషయంలో.. సెంటిమెంట్ను పక్కన పెట్టిన న్యాచురల్ స్టార్ !
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
అయితే, పెంచిన పెన్షన్లు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల కోటి మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు అందుతాయి. సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులైన మహిళలు అందరికీ ఇకపై రూ.1,100 మా ప్రభుత్వం అందించనుంది అని ప్రకటించారు. ఈ విషయం మీకు తెలియజేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది.. జులై 1 నుంచి లబ్ధిదారులకు ఈ మొత్తం పెన్షన్ పంపిణీ చేయనున్నామని తేల్చి చెప్పారు. అదే నెల 10వ తేదీ వరకు అందరికీ అందించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం నితీశ్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: DGCA: ఎయిర్ ఇండియాపై డీజీసీఏ కఠిన చర్యలు.. ముగ్గురు అధికారులను తొలగించాలని ఆదేశాలు
కాగా, బీహార్ రాష్ట్రంలోని వృద్ధులు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకే మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. ఆ దిశగా తాము కృషి చేస్తున్నాం అని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు. ఇదిలాఉండగా.. ఈ ఏడాది చివర్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు జనతాదళ్ (యూనైటెడ్), ఎన్డీయే, ఆర్జేడీ తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే నితీశ్ కుమార్ తన ఎన్నికల వ్యూహాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
తాజావార్తలు
-
India vs England: భారత్ చెత్త రికార్డు.. ఏడేళ్ల తర్వాత…!
-
Lenin Review : అక్కినేని అఖిల్ ‘లెనిన్’ ఓవర్శీస్ రివ్యూ..
-
Humanoid Robots: తొలిసారిగా టెలిఆపరేటెడ్ హ్యూమనాయిడ్ రోబోట్లతో శస్త్రచికిత్స.. వైద్య రంగంలో కొత్త అధ్యాయం
-
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. అమరావతి అభివృద్ధిపై ఫోకస్.. వారికి గుడ్న్యూస్..!
-
900 Snakes Escape: పాముల పెంపక కేంద్రం మునిగి 900 నాగుపాములు బయటకు.. ప్రాణ భయంతో వణుకుతున్న ప్రజలు (వీడియో)
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!