PM Modi: నేడు పలు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన.. బీహార్లో లోకోమోటివ్ను ప్రారంభిచనున్న మోడీ
- నేడు పలు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన
- బీహార్లో లోకోమోటివ్ను ప్రారంభిచనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ శుక్రవారం పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు బీహార్. ఒడిశాలో మోడీ పర్యటించనున్నారు. రూ.18,600 కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక బీహార్ నుంచి గినియాకు మొట్టమొదటి సారిగా లోకోమోటివ్ ఎగుమతిని ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. గతంలో భారతీయ రైల్వేలకు అంకితం చేయబడిన మార్హౌరా ప్లాంట్.. ఇప్పుడు అక్కడ తయారు చేయబడిన లోకోమోటివ్ను విదేశాలకు ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి.
ఇది కూడా చదవండి: Suicide : పెళ్లయిన మూడున్నర నెలలకే వేధింపులు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
Also Read
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
- AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
బీహార్లోని సరన్ జిల్లాలోని మార్హౌరా ప్లాంట్లో డీజిల్ లోకోమోటివ్ ప్లాంట్ను నిర్మించారు. ఈ లోకోమోటివ్ను పశ్చిమ ఆఫ్రికాలోని రిపబ్లిక్ ఆఫ్ గినియాకు పంపనున్నారు. “మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” చొరవతో నిర్మించారు. మేక్ ఇన్ ఇండియాలో ఇదొక ప్రధాన మైలురాయిగా చెప్పొచ్చు. ఇక బీహార్లోని సివాన్లో రూ.400 కోట్లకు పైగా విలువైన కొత్త వైశాలి-డియోరియా రైల్వేలైన్ను ప్రారంభించనున్నారు. అనంతరంర ముజఫర్పూర్-బెట్టియా మీదుగా పాటలీపుత్ర-గోరఖ్పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ను కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం రూ.1,800 కోట్లకు పైగా విలువైన ఆరు మురుగునీటి శుద్ధి కర్మాగారాలను ప్రారంభించనున్నారు. ఇక బీహార్లోని వివిధ పట్టణాల్లో రూ.3,000 కోట్ల విలువైన నీరు, పారిశుద్ధ్య ప్రాజెక్ట్లకు శంకుస్థాపన చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Fake Gold : తక్కువ ధరకే బంగారం కోటి లూటీ..
ఇక ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన దార్శనిక పత్రాన్ని కూడా విడుదల చేయనున్నారు.
తాజావార్తలు
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?