PM Modi: నేడు పలు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన.. బీహార్లో లోకోమోటివ్ను ప్రారంభిచనున్న మోడీ
- నేడు పలు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన
- బీహార్లో లోకోమోటివ్ను ప్రారంభిచనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ శుక్రవారం పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు బీహార్. ఒడిశాలో మోడీ పర్యటించనున్నారు. రూ.18,600 కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక బీహార్ నుంచి గినియాకు మొట్టమొదటి సారిగా లోకోమోటివ్ ఎగుమతిని ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. గతంలో భారతీయ రైల్వేలకు అంకితం చేయబడిన మార్హౌరా ప్లాంట్.. ఇప్పుడు అక్కడ తయారు చేయబడిన లోకోమోటివ్ను విదేశాలకు ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి.
ఇది కూడా చదవండి: Suicide : పెళ్లయిన మూడున్నర నెలలకే వేధింపులు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
బీహార్లోని సరన్ జిల్లాలోని మార్హౌరా ప్లాంట్లో డీజిల్ లోకోమోటివ్ ప్లాంట్ను నిర్మించారు. ఈ లోకోమోటివ్ను పశ్చిమ ఆఫ్రికాలోని రిపబ్లిక్ ఆఫ్ గినియాకు పంపనున్నారు. “మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” చొరవతో నిర్మించారు. మేక్ ఇన్ ఇండియాలో ఇదొక ప్రధాన మైలురాయిగా చెప్పొచ్చు. ఇక బీహార్లోని సివాన్లో రూ.400 కోట్లకు పైగా విలువైన కొత్త వైశాలి-డియోరియా రైల్వేలైన్ను ప్రారంభించనున్నారు. అనంతరంర ముజఫర్పూర్-బెట్టియా మీదుగా పాటలీపుత్ర-గోరఖ్పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ను కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం రూ.1,800 కోట్లకు పైగా విలువైన ఆరు మురుగునీటి శుద్ధి కర్మాగారాలను ప్రారంభించనున్నారు. ఇక బీహార్లోని వివిధ పట్టణాల్లో రూ.3,000 కోట్ల విలువైన నీరు, పారిశుద్ధ్య ప్రాజెక్ట్లకు శంకుస్థాపన చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Fake Gold : తక్కువ ధరకే బంగారం కోటి లూటీ..
ఇక ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన దార్శనిక పత్రాన్ని కూడా విడుదల చేయనున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..