Bihar: లాలూ కుటుంబంలో మళ్లీ బలపడుతున్న రక్తసంబంధం.. తండ్రిని కలిసిన తేజ్ ప్రతాప్
- లాలూ కుటుంబంలో మళ్లీ బలపడుతున్న రక్తసంబంధం
- తల్లిదండ్రులు, సోదరుడిని కలిసిన తేజ్ ప్రతాప్
- దహీ-చురా విందుకు ఆహ్వానం
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తర్వాత లాలూ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎన్నికలకు ముందు ఆర్జేడీ నుంచి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ను బహిష్కరించారు. ఇక ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమి తర్వాత కుటుంబంలో విభేదాలు నానా రచ్చ చేశాయి. ఘర్షణ కారణంగా సోదరీమణులు-సోదరులు విడిపోయారు. తాజాగా ఆ బంధాలు మరోసారి చిగురిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Ravi Shankar Prasad: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇంట్లో అగ్నిప్రమాదం
Also Read
- Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
- Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
- Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో 'మాన్' ప్రభుత్వం కూలిపోతుందా!
- Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
మకర సంక్రాంతిని పురస్కరించుకుని తేజ్ ప్రతాప్ విందు ఏర్పాటు చేశాడు. ఈ విందుకు తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ను, తల్లి రబ్రీ దేవిని ఆహ్వానించారు. అనంతరం తమ్ముడు తేజస్వి యాదవ్కు ఆహ్వాన పత్రిక అందజేశాడు. ముందుగా తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఆహ్వాన పత్రికలు అందజేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దహీ-చురా విందుకు తల్లిదండ్రులను, సోదరుడిని ఆహ్వానించినట్లు తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ఈ విందు జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించబడుతోంది.
ఇది కూడా చదవండి: Thailand: థాయ్లాండ్లో ఘోర విషాదం.. ట్రైన్పై క్రేన్ పడి 22 మంది మృతి
చాలా కాలం తర్వాత లాలూ ప్రసాద్ కుటుంబాన్ని పాట్నాలో తేజ్ ప్రతాప్ కలిశారు. బహిష్కరణ తర్వాత రక్తసంబంధికులను కలవడం ఇదే తొలిసారి. ‘ఈరోజు నేను నా తండ్రిని లాలూ ప్రసాద్ యాదవ్ను, తల్లిని గౌరవించాను. రబ్రీ దేవి జీని 10 సర్క్యులర్ రోడ్లోని నివాసంలో కలిశాను. వారి ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే నా తమ్ముడు, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్విని కలిశాను. ‘దహి-చురా భోజ్’ కోసం ఆహ్వానించాను.’’ అని ఎక్స్లో తేజ్ ప్రతాప్ పోస్ట్ చేశారు. తాజా ఫొటోలను బట్టి మళ్లీ సంబంధం మెరుగుపడుతున్నట్లుగా కనిపిస్తోంది. తేజ్ ప్రతాప్ ఆర్జేడీ నుంచి బహిష్కరించిన తర్వాత సొంత పార్టీ ‘జనశక్తి జనతాదళ్’ను స్థాపించారు.
ఇక మంగళవారం బీజేపీ సీనియర్ నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ఏర్పాటు చేసిన విందుకు తేజ్ ప్రతాప్ హాజరయ్యారు. మకర సంక్రాంతి సందర్భంగా జరిగిన ఈ విందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సిఎం సామ్రాట్ చౌదరి, జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా, హిందూస్థానీ అవామ్ మోర్చా చీఫ్ సంతోష్ కుమార్ సుమన్ హాజరయ్యారు.
आज अपने पिताजी आदरणीय श्री लालू प्रसाद यादव जी, माता जी आदरणीय श्रीमती राबड़ी देवी जी से 10 सर्कुलर रोड स्थित आवास पहुंचकर मुलाकात कर आशीर्वाद प्राप्त किया और अपने छोटे भाई और बिहार विधानसभा में नेता प्रतिपक्ष तेजस्वी से भी भेंट मुलाकात कर कल 14 जनवरी को मकर संक्रांति के अवसर पर… pic.twitter.com/T2nZ5qz3x6
— Tej Pratap Yadav (@TejYadav14) January 13, 2026
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!