Bihar: లాలూ కుటుంబంలో మళ్లీ బలపడుతున్న రక్తసంబంధం.. తండ్రిని కలిసిన తేజ్ ప్రతాప్
- లాలూ కుటుంబంలో మళ్లీ బలపడుతున్న రక్తసంబంధం
- తల్లిదండ్రులు, సోదరుడిని కలిసిన తేజ్ ప్రతాప్
- దహీ-చురా విందుకు ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తర్వాత లాలూ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎన్నికలకు ముందు ఆర్జేడీ నుంచి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ను బహిష్కరించారు. ఇక ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమి తర్వాత కుటుంబంలో విభేదాలు నానా రచ్చ చేశాయి. ఘర్షణ కారణంగా సోదరీమణులు-సోదరులు విడిపోయారు. తాజాగా ఆ బంధాలు మరోసారి చిగురిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Ravi Shankar Prasad: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇంట్లో అగ్నిప్రమాదం
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
మకర సంక్రాంతిని పురస్కరించుకుని తేజ్ ప్రతాప్ విందు ఏర్పాటు చేశాడు. ఈ విందుకు తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ను, తల్లి రబ్రీ దేవిని ఆహ్వానించారు. అనంతరం తమ్ముడు తేజస్వి యాదవ్కు ఆహ్వాన పత్రిక అందజేశాడు. ముందుగా తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఆహ్వాన పత్రికలు అందజేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దహీ-చురా విందుకు తల్లిదండ్రులను, సోదరుడిని ఆహ్వానించినట్లు తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ఈ విందు జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించబడుతోంది.
ఇది కూడా చదవండి: Thailand: థాయ్లాండ్లో ఘోర విషాదం.. ట్రైన్పై క్రేన్ పడి 22 మంది మృతి
చాలా కాలం తర్వాత లాలూ ప్రసాద్ కుటుంబాన్ని పాట్నాలో తేజ్ ప్రతాప్ కలిశారు. బహిష్కరణ తర్వాత రక్తసంబంధికులను కలవడం ఇదే తొలిసారి. ‘ఈరోజు నేను నా తండ్రిని లాలూ ప్రసాద్ యాదవ్ను, తల్లిని గౌరవించాను. రబ్రీ దేవి జీని 10 సర్క్యులర్ రోడ్లోని నివాసంలో కలిశాను. వారి ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే నా తమ్ముడు, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్విని కలిశాను. ‘దహి-చురా భోజ్’ కోసం ఆహ్వానించాను.’’ అని ఎక్స్లో తేజ్ ప్రతాప్ పోస్ట్ చేశారు. తాజా ఫొటోలను బట్టి మళ్లీ సంబంధం మెరుగుపడుతున్నట్లుగా కనిపిస్తోంది. తేజ్ ప్రతాప్ ఆర్జేడీ నుంచి బహిష్కరించిన తర్వాత సొంత పార్టీ ‘జనశక్తి జనతాదళ్’ను స్థాపించారు.
ఇక మంగళవారం బీజేపీ సీనియర్ నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ఏర్పాటు చేసిన విందుకు తేజ్ ప్రతాప్ హాజరయ్యారు. మకర సంక్రాంతి సందర్భంగా జరిగిన ఈ విందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సిఎం సామ్రాట్ చౌదరి, జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా, హిందూస్థానీ అవామ్ మోర్చా చీఫ్ సంతోష్ కుమార్ సుమన్ హాజరయ్యారు.
आज अपने पिताजी आदरणीय श्री लालू प्रसाद यादव जी, माता जी आदरणीय श्रीमती राबड़ी देवी जी से 10 सर्कुलर रोड स्थित आवास पहुंचकर मुलाकात कर आशीर्वाद प्राप्त किया और अपने छोटे भाई और बिहार विधानसभा में नेता प्रतिपक्ष तेजस्वी से भी भेंट मुलाकात कर कल 14 जनवरी को मकर संक्रांति के अवसर पर… pic.twitter.com/T2nZ5qz3x6
— Tej Pratap Yadav (@TejYadav14) January 13, 2026
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!