Bihar: లాలూ కుటుంబంలో మళ్లీ బలపడుతున్న రక్తసంబంధం.. తండ్రిని కలిసిన తేజ్ ప్రతాప్
- లాలూ కుటుంబంలో మళ్లీ బలపడుతున్న రక్తసంబంధం
- తల్లిదండ్రులు, సోదరుడిని కలిసిన తేజ్ ప్రతాప్
- దహీ-చురా విందుకు ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తర్వాత లాలూ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎన్నికలకు ముందు ఆర్జేడీ నుంచి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ను బహిష్కరించారు. ఇక ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమి తర్వాత కుటుంబంలో విభేదాలు నానా రచ్చ చేశాయి. ఘర్షణ కారణంగా సోదరీమణులు-సోదరులు విడిపోయారు. తాజాగా ఆ బంధాలు మరోసారి చిగురిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Ravi Shankar Prasad: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇంట్లో అగ్నిప్రమాదం
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
మకర సంక్రాంతిని పురస్కరించుకుని తేజ్ ప్రతాప్ విందు ఏర్పాటు చేశాడు. ఈ విందుకు తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ను, తల్లి రబ్రీ దేవిని ఆహ్వానించారు. అనంతరం తమ్ముడు తేజస్వి యాదవ్కు ఆహ్వాన పత్రిక అందజేశాడు. ముందుగా తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఆహ్వాన పత్రికలు అందజేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దహీ-చురా విందుకు తల్లిదండ్రులను, సోదరుడిని ఆహ్వానించినట్లు తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ఈ విందు జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించబడుతోంది.
ఇది కూడా చదవండి: Thailand: థాయ్లాండ్లో ఘోర విషాదం.. ట్రైన్పై క్రేన్ పడి 22 మంది మృతి
చాలా కాలం తర్వాత లాలూ ప్రసాద్ కుటుంబాన్ని పాట్నాలో తేజ్ ప్రతాప్ కలిశారు. బహిష్కరణ తర్వాత రక్తసంబంధికులను కలవడం ఇదే తొలిసారి. ‘ఈరోజు నేను నా తండ్రిని లాలూ ప్రసాద్ యాదవ్ను, తల్లిని గౌరవించాను. రబ్రీ దేవి జీని 10 సర్క్యులర్ రోడ్లోని నివాసంలో కలిశాను. వారి ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే నా తమ్ముడు, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్విని కలిశాను. ‘దహి-చురా భోజ్’ కోసం ఆహ్వానించాను.’’ అని ఎక్స్లో తేజ్ ప్రతాప్ పోస్ట్ చేశారు. తాజా ఫొటోలను బట్టి మళ్లీ సంబంధం మెరుగుపడుతున్నట్లుగా కనిపిస్తోంది. తేజ్ ప్రతాప్ ఆర్జేడీ నుంచి బహిష్కరించిన తర్వాత సొంత పార్టీ ‘జనశక్తి జనతాదళ్’ను స్థాపించారు.
ఇక మంగళవారం బీజేపీ సీనియర్ నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ఏర్పాటు చేసిన విందుకు తేజ్ ప్రతాప్ హాజరయ్యారు. మకర సంక్రాంతి సందర్భంగా జరిగిన ఈ విందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సిఎం సామ్రాట్ చౌదరి, జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా, హిందూస్థానీ అవామ్ మోర్చా చీఫ్ సంతోష్ కుమార్ సుమన్ హాజరయ్యారు.
आज अपने पिताजी आदरणीय श्री लालू प्रसाद यादव जी, माता जी आदरणीय श्रीमती राबड़ी देवी जी से 10 सर्कुलर रोड स्थित आवास पहुंचकर मुलाकात कर आशीर्वाद प्राप्त किया और अपने छोटे भाई और बिहार विधानसभा में नेता प्रतिपक्ष तेजस्वी से भी भेंट मुलाकात कर कल 14 जनवरी को मकर संक्रांति के अवसर पर… pic.twitter.com/T2nZ5qz3x6
— Tej Pratap Yadav (@TejYadav14) January 13, 2026
తాజావార్తలు
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
-
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!