కాంగ్రెస్ మైనార్టీలకు టికెట్ ఇచ్చింది .. కానీ ఓడిపోయామన్నారు షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవి ఇవ్వలేదని, ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారన్నారు. టీఎస్పీఎస్సీలో.. మెంబర్ ఇచ్చామన్నారు షబ్బీఆర్ అలీ. హైకోర్టు జీపీ వస్తున్నారని, కాంగ్రెస్ ఏ పోస్టింగ్ ఇచ్చినా మైనార్టీ కోటా ఉంటుందన్నారు. కేటీఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు అంటూ షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఏం పదవులు ఇచ్చిందని, ఆకాశం మీద ఉమ్మితే మొఖం…
ఒక చిన్న వివాదం చిలికిచిలి కి గాలి వానగా మారింది. విద్యార్థులు కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. తమను బెదిరించారని ఒక జట్టు గట్టిన 13 మంది విద్యార్థులు తోటి విద్యార్థిని చితకబాదిన ఘటన ఇది. వీరంతా చదువుతున్నది కేవలం ఆరవ తరగతి మాత్రమే. ఆరవ తరగతిలోనే కక్షలు కార్పన్యాలతో ప్రతీకారం తీర్చుకునే స్థాయికి వెళ్లిన ఘటన ఇది. ఇది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలోని tswrjc హాస్టల్లో ఈ ఘటన జరిగింది. ఆరవ తరగతి చదువుతున్న…
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎవరు అధైర్య పడవద్దు….119 సీట్లలో 39 సీట్లు గెలిచినం…బలమైన ప్రతిపక్షంగా ఉన్నామన్నారు. 14 సీట్లు ఐదు వేల ఓట్లతో ఓటమి పాలైనం…అందులో సగం గెలిచినా హంగ్ వచ్చేదని, 14 ఏళ్ళు అభివృద్ధి బాటలో కారు వంద కిలోమీటర్ల స్పీడ్ తో పోయిందన్నారు కేటీఆర్. కారు సర్వీసింగ్ కు పోయింది… మళ్లీ వంద స్పీడుతో దూసుకొస్తదని,…
మా ఫొటోలకు బాక్సింగ్ బ్యాగులు పెట్టి తన్నారు.. ఇది న్యాయమేనా..? విశాఖలో వైసీపీ ‘సిద్ధం’ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభ నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. కాగా.. సభకు హాజరైన సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఫొటోలు పెట్టి కొందరు కార్యకర్తలు ఆ ఫొటోలపై బాక్సింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి కొట్టారు. కాగా.. ఆ వీడియోపై స్పందించిన…
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు చాలా బాగుతున్నాయని, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్నది మంచి ఆలోచన అని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబునిచ్చారు. సోమవారం నాడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వీ హబ్ లో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, బెంగళూరు కాన్సూలేట్ జనరల్ హిలరి మెక్ గెచ్చి రాష్ల్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన…
ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం పై బలపరీక్ష తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. చైర్మన్ డివీ కి వ్యతిరేకంగా 19 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి అవిశ్వాస నోటీసు ఇచ్చిన నేపథ్యంలో.. ఫిబ్రవరి 5న ఇల్లెందు మున్సిపల్ ఆఫీసులో ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసు అందిన వెంటనే ప్రత్యేక క్యాంపుకు తరలిన బీఆర్ఎస్ కౌన్సిలర్లకు…
వచ్చే నెల 2, 3 తేదీల్లో తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు, దేశ రాజకీయ పరిస్థితులు పరిగణనలోకి తీసుకొని చర్చిస్తామన్నారు. దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కక్కిన కూడును తినేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆశపడ్డాడని, కక్కిన కూడు కుక్కలు కూడా తినవ్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిని బలహీన పర్చేందుకు బీజేపీ…
మధ్య ప్రదేశ్ లో పీడిత్ అధికార్ యాత్రను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. కేసీఆర్ ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీలకు కాంగ్రెస్ ఎందుకు న్యాయం చేయలేదని, కేంద్రంలో బీసీలకు ప్రత్యే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీల కులగణనను వెంటనే చేపట్టాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు సీఎంగా ఉండి అన్ని వర్గాల…
వరంగల్కు మంజూరైన సైనిక్ స్కూల్ ను రీ లోకేట్ చేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తమ పలుకుబడిని ఉపయోగించి దేశవ్యాప్తంగా ప్రారంభించే 100 సైనిక్ స్కూళ్లలో అదనంగా ఒకటి రాష్ట్రానికి తీసుకురావాలన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు కొత్తగా విద్యాసంస్థలు తేకున్నా పర్వాలేదు , రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వరంగల్లోనే సైనిక్ స్కూల్ ను నెలకొల్పాలని, గత ప్రభుత్వం మంజూరు…
లోక్సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోపు తమ ఆరు హామీల కింద మొత్తం 13 హామీల అమలుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఆరు హామీల నుంచి దృష్టి మళ్లించడం, వాగ్దానం చేసిన 100 రోజులకు మించి అమలు చేయడంలో జాప్యం చేయడంతో బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ నేతలు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. హామీలపై రాష్ట్ర ప్రభుత్వానికి…