రాష్ట్ర హోదా కల్పించాలని లడఖ్లో నిరసనలు.. బీజేపీ ఆఫీస్ దగ్ధం రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ లడఖ్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బుధవారం బంద్కు పిలుపునిచ్చారు. దీంతో నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. దీంతో నిరసనకారులకు పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీస్ వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు. అలాగే బీజేపీ కార్యాలయానికి కూడా నిప్పుపెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుధవారం ఉదయం లడఖ్లోని లేహ్…
ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదు.. సమాజానికి అందించే బాధ్యత! ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదని, సమాజానికి అందించే ఓ బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మానవ వనరులు అత్యంత బలమైన పెట్టుబడి అని, మానవ వనరులకు మంచి తర్ఫీదు ఇస్తే రాష్ట్రానికి ఉపయోగపడతారని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. గతేడాది అభయ హస్తం పొందిన వారిలో 10 మంది సెలెక్ట్ అయ్యారని, 178 మందిలో గత ఏడాది కంటే ఎక్కువ మంది…
కవిత దీక్షకు కోర్టు నో.. ఇంటికి కవిత హైదరాబాద్ ధర్నాచౌక్లో కొనసాగుతున్న MLC కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్ష మంగళవారం డ్రామాటిక్ మలుపు తిరిగింది. కోర్టు అనుమతి నిరాకరించడంతో, పోలీసులు కవితను దీక్షా స్థలం నుంచి ఇంటికి తరలించే ఏర్పాట్లు ప్రారంభించారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే, పోలీసులు మరోసారి కవితను దీక్ష విరమించాలని కోరారు. అయితే కవిత అనుచరులు, జాగృతి కార్యకర్తలు దీక్ష కొనసాగించాలని పట్టుబట్టారు. పోలీసులు వారిని అడ్డుకుంటూ, వర్షం తగ్గిన…
‘‘పరువు హత్య’’.. 25 ఏళ్ల దళిత యువకుడి దారుణ హత్య.. తమిళనాడులో 25 ఏళ్ల దళిత యువకుడి హత్య సంచలనంగా మారింది. దీనిని ‘‘పరువు హత్య’’గా భావిస్తున్నారు. తూత్తుకుడికి చెందిన కవిన్ తిరునెల్వెలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి సమీపంలో హత్యకు గురయ్యాడు. కవిన్ ఒక ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి కేటీసీ నగర్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నా తన మాజీ స్కూల్ విద్యార్థినితో సంబంధం ఉందని తెలుస్తోంది. అమ్మాయి కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చినా,…
గ్రూప్-1 అభ్యర్థులు పరీక్ష తేదీలను మార్చాలని కోరుతూ నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నిరసనల్లో పాల్గొన్న గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత దుమారం రేగింది. అయితే.. దీనిపై తాజాగా కేటీఆర్ స్పందిస్తూ.. గ్రూప్ వన్ అభ్యర్థులను కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం దుర్మార్గమన్నారు. గ్రూప్ వన్ అభ్యర్థులను పశువుల్లా చూస్తుంది ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. గ్రూప్ వన్ అభ్యర్థులు ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాతలు అని,…
చదువుకుంది ఇంజనీరింగ్. చేస్తున్న వృత్తి మోడల్ ఫోటోగ్రఫీ. తిరిగేది ఖరీదైన కార్లు, బైకుల్లో, వాడుతున్న సెల్ ఫోన్లు చూస్తే రూ. లక్షల ఐ ఫోన్లు . ఖరీదైన అద్దె నివాసముంటు, సమాజంలో బడా బాబుల్లా వ్యహారం. కాని మూడోకంటికి తెలియకుండా గుర్తు చప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం చేస్తూ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులకు పట్టుబ డి ఉన్న పరువు కాస్తా.. బజార్లో పడేసి.. కటకటాల పాలైన యువకుల చీకటి బాగోతం. వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లి వసంతనగర్…
యువత డ్రగ్స్ కు బానిస కావద్దని సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వెళ్లాలని తమ ఎంచుకున్న గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ముందుకు వెళ్లాలని మేడ్చల్ డిసిపి యువతకు పిలుపు నిచ్చారు.. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పి.యస్ పరిధిలో జరిగిన ఫ్రెండ్లీ పోలీసు లో భాగంగా ఈ రోజు జీడిమెట్ల గ్రామంలో జరిగిన క్రికెట్ పోటీల ముగింపు వేడుకలకు ముఖ్య అతిధి గా మేడ్చల్ డి.సి.పి కోటిరెడ్డి హాజరయ్యారు.. ఈ పోటీలలో మెత్తం 8 ఎనిమిది టీం…
భద్రాద్రి ఆలయం పేరును దుర్వినియోగం చేస్తున్నారని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆరోపిస్తూ అమెరికాలోని రామమందిరంపై దేవస్థానం అధికారులు వివాదంలో చిక్కుకున్నారు. అమెరికాకు చెందిన ఓ సంస్థ భద్రాద్రి దేవాలయం పేరును ఉపయోగించి విరాళాలు సేకరిస్తున్న నేపథ్యంలో ఆలయ పేరు దుర్వినియోగం కాకుండా న్యాయపోరాటం చేసేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఆలయం పేరుకు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకునే యోచనలో ఆలయ అధికారులు ఉన్నట్లు సమాచారం. కానీ న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పేటెంట్ చట్టాలు పేరు లేదా…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్కు చేరుకునే ముందు గన్పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన గౌడ్ అనంతరం ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. బాధ్యతలు స్వీకరించే ముందు గాంధీభవన్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ,…
“Prophet for the World” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు లభించిందన్నారు. గీత, బైబిల్, ఖురాన్ సారాంశం ప్రపంచ శాంతి మాత్రమేనని, కలిసికట్టుగా దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్ని మత గ్రంథాలు చెబుతున్నాయని, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మన ప్రాంతానికి చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. గతంలో హైదరాబాద్ లో ఒక వైపు ఓవైసీ, మరో…