ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి భరోసా కల్పిస్తూ హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ కోసం కొత్త రూట్లు ఖరారయ్యాయి. మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇటీవల అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సోమవారం తన ముందు ఉంచిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైల్ రూట్లు నగర జనాభాలో పెద్ద వర్గానికి అందడం లేదని పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. దీని…
కార్యకర్తలు మంచి సూచనలు చేశారని, పార్టీకి ద్రోహం చేసిన వారిపై చర్యల కోసం డిమాండ్లు వచ్చాయని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు. ఇవాళ నల్లగొండ లోక్ సభ నియోజక వర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సంస్థాగత బలోపేతం పై సూచనలు వచ్చాయని, గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా ముందుకు సాగుదామని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కష్టపడ్డ వారికే పార్టీ లో గుర్తింపు ఇస్తామని, ఉద్యమ కారులకు పార్టీ లో సముచిత…
మూసీ నది పునరుజ్జీవన ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు, మూసీ ప్రాజెక్టుకు అపెక్స్ బాడీ మద్దతు మరియు భాగస్వామ్యానికి హామీ ఇచ్చింది. థేమ్స్ నది అపెక్స్ గవర్నింగ్ బాడీ అధికారులతో ముఖ్యమంత్రి బహు కోణాల అంశాలు మరియు విభిన్న వాటాదారుల ప్రభావ అధ్యయనాలపై చర్చించారు. మూసీ నది కానీ హుస్సేన్సాగర్ సరస్సు చుట్టూ కేంద్రీకృతమై ఉండటం మరియు ఉస్మాన్సాగర్ వంటి ఇతర ప్రధాన నీటి వనరుల…
జాంబియాకు చెందిన 7 ఏళ్ల బాలిక తన 14 ఏళ్ల సోదరుడికి బోన్ మ్యారోను దానం చేయడంతో సికింద్రాబాద్లోని కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) హాస్పిటల్లోని సర్జన్లు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ (BMT)ని విజయవంతంగా పూర్తి చేశారు. జాంబియాలోని లుసాకాకు చెందిన కుటుంబం సికిల్ సెల్ వ్యాధితో తీవ్రంగా పోరాడుతున్న తమ కొడుకు కోసం కిమ్స్ ఆసుపత్రిలో వైద్య సహాయం కోరింది. BMT విభాగాధిపతి, హెమటో-ఆంకాలజిస్ట్ మరియు BMT నిపుణుడు డాక్టర్ నరేందర్ కుమార్…
గతంలో ఒకే క్లాత్పై జి20 లోగోను నేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన సిరిసిల్ల టెక్స్టైల్ టౌన్కు చెందిన నేత వెల్ది హరిప్రసాద్, అయోధ్య శ్రీరామ మందిరంలోని సీతాదేవికి బంగారు చీరను నేసి మరో రికార్డు సృష్టించారు. జనవరి 22న జరగనున్న శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా హరిప్రసాద్ బంగారు చీరను నేసారు. 900 గ్రాముల చీరను ఎనిమిది గ్రాముల బంగారం, 20 గ్రాముల పట్టు చారలతో 20 రోజులు వెచ్చించి నేశారు. శ్రీరాముని చిత్రాలతో పాటు,…
ప్రజలపై భారం మోపకుండ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణపై దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుదామని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐ అండ్ పిఆర్, ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్తులు సృష్టించి, సృష్టించిన ఆస్తులతో వచ్చిన ఆదాయం…
మహిళపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.వివాహం చేసుకుంటానని మోసం చేసిన పూడూరు గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి అనే వ్యక్తిని నిలదీసేందుకు వెళ్లిన తనపై కర్రలు,పైపులతో విచక్షణ రహితంగా నరేందర్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు దాడి చేశారని బాధితురాలు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు బుధవారం మేడ్చల్ పోలీసులు ఐపిసి సెక్షన్లు 324,342,506,509, కింద కేసు నమోదు చేశారు. పూడూరు…
సైబరాబాద్ పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షల అమలు చేస్తున్నామన్నారు ట్రాఫిక్ డీసీపీ మాదాపూర్ డీవీ శ్రీనివాస్. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ట్రాఫిక్ రద్దీ దృశ్య నిబంధనలు కటినతరం చేసామని, సైబరాబాద్ లిమిట్స్ లో ట్రాఫిక్ వాయిలేశన్ 11వేల కేసులు నమోదు చేసామన్నారు. రాంగ్ రూట్ లో వాహనం నడిపి ఆక్సిడెంట్ చేస్తే 304 పార్ట్2 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. హేవి వాహనాలు డిసిఎం, వాటర్ ట్యాంకర్స్, ఆర్ ఎంసీ, జేసీబీ, ట్రాక్టర్ వాహనాలు ఉదయం…
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ లో రామోజీ ఫౌండేషన్ సహకారంతో నూతన ఆర్టీఏ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ముఖ్య అతిధిగా హాజరై ఆర్టీఏ నూతన కార్యాలయాన్ని రవాణా & బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కే. శశాంక్, జడ్పి చైర్మన్ తీగల అనితారెడ్డి, తుర్కాయంజల్ మున్సిపల్ చైర్మన్ మల్రెడ్డి అనురాధ రాంరెడ్డి, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్…
జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ (JSW Energy) అనుబంధ సంస్థ JSW నియో ఎనర్జీ, తెలంగాణ లో రూ.9,000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం JSW నియో ఎనర్జీ మధ్య ఈ అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. దావోస్ లో జేఎస్ డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. ఈ కొత్త…