CPI Narayana : వచ్చే నెల 2, 3 తేదీల్లో తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే నెల 2, 3 తేదీల్లో తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు, దేశ రాజకీయ పరిస్థితులు పరిగణనలోకి తీసుకొని చర్చిస్తామన్నారు. దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కక్కిన కూడును తినేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆశపడ్డాడని, కక్కిన కూడు కుక్కలు కూడా తినవ్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిని బలహీన పర్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని సీపీఐ నారాయణ అన్నారు. అయోధ్య రామాలయం ఎన్నికల స్టంట్ అని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఎన్నికల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ గా అయోధ్య రామాలయమని, రాముడు ఇంటింటికీ అక్షింతలు పంపించి లబ్ధి పొందాలని అర్ఎస్ఎస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. తీర్పులు చెప్పే న్యాయ మూర్తులు సైతం అయోధ్యకు వెళ్ళారని, అందరినీ అయోధ్యకు రమ్మని ఆహ్వానించారు కానీ ఎల్కే అద్వానీకి మాత్రం రావద్దని ఆహ్వానం పంపారన్నారు. న్యాయస్థానాలు, విచారణ సంస్థలు బీజేపీ గుప్పెట్లో ఉన్నాయని, రాముడి పేరు చెప్పి బీజేపీ ఓట్లడగటం మొదలుపెట్టిందన్నారు. కుల ఘనన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన మండిపడ్డారు. మోడీ పదేళ్ల పాలనలో పబ్లిక్ సెక్టార్ లు అమ్మడం తప్ప కొత్తగా స్థాపించినవి లేవన్నారు. దేశంలో పబ్లిక్ సెక్టార్ లన్నీ ధ్వంసం అయ్యాయన్నారు. రాముడి పేరుతో, మత విద్వేషాలు రెచ్చ గొట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారీ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
అంతేకాకుండా..’ భారత దేశం హిందు దేశం కాదు.. ఇక్కడ అన్ని మతాల వారు ఉన్నారు.. దేశాన్ని విచ్ఛిన్నం చేసి ఓటు బ్యాంక్ పెంచుకోవాలని బీజేపీ కుట్రలు చేస్తోంది.. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో విశాల దృక్పదం తో ముందుకు రావాలి… కాంగ్రెస్ లో అనేక సమస్యలు ఉన్నాయి.. వాటిని సరిదిద్దుకుని ముందుకు రావాల్సిన అవసరం ఉంది.. తెలంగాణలో కలుపుకుని పోవడం వల్లే కాంగ్రెస్ విజయం సాధించింది.. చంద్రబాబు బీజేపీకి బయపడుతున్నాడు.. రేవంత్ రెడ్డికున్న దైర్యం చంద్రబాబుకు లేకపోవడం సిగ్గుచేటు.. 17ఏ కు చంద్రబాబు ఉద్యమం చేయాలి తప్ప బయపడీ బీజేపీకి లొంగిపోకూడదు.. అన్న ప్రసన్న చేసే ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దానికి ఆవకాయ పచ్చడి తగలించడానికి ప్రయత్నం చేయవద్దు.. రాష్ట్రంలో ఐదు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం.. ఆ ప్రపోజల్ కాంగ్రెస్ ముందు ఉంచాం.. కేటీఆర్ నేనే ముఖ్యమంత్రిననే భావనలో ఉండి మాట్లాడుతున్నారు..’ అని సీపీఐ నారాయణ మండిపడ్డారు.
Also Read
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!