Home
Bcci
Bcci News
-
ఇంగ్లండ్ సిరీస్ కు ఇషాంత్ అందుబాటులో
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో గాయపడ్డా ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ కుడి చేతి వేళ్లలో చీలిక వచ్చింది. మధ్య వేలు, నాలుగవ వేలికి కుట్లు వేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇశాంత్ గాయం అంత సీరియస్గా లేదని తెలిపారు. పది రోజుల తర్వాత కుట్లు తీసివేస్తారన్నారు. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ఆరు వారాల సమయం ఉండడంతో… అప్పటిలోగా ఇశాంత్ కోలుకుంటాడని…ఇంగ్లండ్ సిరీస్ కు ఇషాంత్ అందుబాటులో ఉంటాడు అని బీసీసీఐ అధికారి… -
నేటితో ముంబైలో టీమిండియా క్వారంటైన్ పూర్తి…
త్వరలో శ్రీలంక పర్యటనకు బయలుదేరే టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ముంబయిలోని ఓ స్టార్ హోటల్లో క్వారంటైన్లో ఉన్నారు. నేటితో వారికి క్వారంటైన్ గడువు ముగుస్తుంది. ఈ ఆటగాళ్లకు బీసీసీఐ సకల సౌకర్యాలు కల్పించింది. వారికెంతో ఇష్టమైన ‘మాక్డక్’ అనే వెజిటేరియన్ రెసిపీని ప్రత్యేకంగా తయారు చేయించింది. అదెలా చేశారనే విషయాన్ని కూడా ఒక వీడియోలో బీసీసీఐ పంచుకుంది. ఈ వీడియోలో ప్రధాన చెఫ్ రాకేశ్ కాంబ్లే తన సిబ్బందిని పరిచయం చేస్తూ వివరంగా ‘మాక్డక్’ను ఎలా వండుతారో… -
డబ్ల్యూటీసీ తుది జట్టును ప్రకటించిన బీసీసీఐ…
నేడు ప్రారంభం కానున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కు బీసీసీఐ తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా గిల్, రోహిత్ శర్మ ఆడనున్నారు. ఆ తర్వాత వరుసగా పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్ బ్యాటింగ్ కు రానున్నారు. ఇక జట్టులోకి జడేజాను తీసుకోవడంతో విహారి చోటు కోల్పోయాడు. మరో స్పిన్నర్గా అశ్విన్ అలాగే పేస్ విభాగంలో బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీలకు చోటు దక్కింది.… -
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జట్టును ప్రకటించిన బీసీసీఐ…
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఈ మ్యాచ్ కోసం కొన్ని రోజుల కిందట ఇంగ్లండ్ కు వెళ్లిన భారత జట్టు అక్కడ క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ ప్రారంభించాయి. ఇక తాజాగా బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఆసీస్ సిరీస్ లో గాయం బారిన పడిన ఆల్రౌండర్ జడేజా, హనుమ విహారి, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్లు తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే డబ్ల్యూటీసీ… -
లంక పర్యటనకు జట్టును ప్రకటించిన బీసీసీఐ…
ప్రస్తుతం టీం ఇండియా మొదటి జట్టు ఇంగ్లండ్ లో ఉన్న న్యూజిలాండ్తో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో.. ఆ తర్వాత ఆగస్టులో ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్లో పోటీపడనుండగా రెండో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. అయితే ఈ రెండో జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీఎంపిక చేసింది. లంక పర్యటనలో భారత జట్టుకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్గా వ్యవరించనున్నాడు. ఇక ఐపీఎల్ లో సత్తా… -
టీమిండియాకు బీసీసీఐ గుడ్న్యూస్.. ఆ 20 రోజులు మీ ఇష్టం..!
ఇంగ్లండ్లో పర్యటిస్తున్న టీమిండియా క్రికెటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. న్యూజిలాండ్తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయ్యాక 20 రోజుల పాటు రిలాక్స్ అయ్యే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. కోహ్లీ సేన జూన్ 23న బయో బబుల్ను వీడితే.. తిరిగి జులై 14న బబుల్లోకి ప్రవేశించనుంది. ఈ మూడు వారాల పాటు భారత బృందం.. యూకే పరిధిలో ఎక్కడ గడుపుతారన్నది వారి వ్యక్తిగత విషయమని బీసీసీఐ తేల్చింది. నాలుగున్నర నెలల పాటు సాగే సుదీర్ఘ పర్యటన… -
‘భారత్ బి’ శ్రీలంక పర్యటన ఇదే…
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే సయమంలో మరో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ వెలువడింది. జులై 5 న లంకకు బయలుదేరనున్న భారత్ బి జట్టు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20 ల్లో పోటీ పడనున్నాయి. ఇందులో జులై 13న మొదటి వన్డే మ్యాచ్ అలాగే వరుసగా 16,18 న రెండు,… -
క్వారంటైన్ ముగించుకున్న టీంఇండియా…
జూన్ 18 న న్యూజిలాండ్ తో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ లో తలపడనున్న టీంఇండియా ఇంగ్లండ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈరోజుతో అక్కడ మూడు రోజుల క్వారంటైన్ ముగియడంతో నేడు మైదానంలోకి అడుగు పెట్టి ప్రాక్టీస్ ప్రారంభించింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనకు ముందు ముంబైలో రెండు వారాల క్వారంటైన్ లో… -
యూఏఈలోనే నాలుగు వేదికలో టీ20 ప్రపంచకప్…?
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యంపై నిర్ణయం ప్రకటించేందుకు బీసీసీఐకి నాలుగు వారాల సమయమిచ్చినా ఐసీసీ భారత్ లో టోర్నీ నిర్వహించకపోతే.. యూఏఈనే వేదికని చెప్పిందట. బీసీసీఐ కూడా దానికి అంగీకరించినట్టు సమాచారం. అయితే యూఏఈలో టోర్నీ నిర్వహిస్తే అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికలే కాకుండా.. నాల్గవ వేదికగా మస్కట్ను కూడా ఆ జాబితాలో చేర్చనున్నారట. అయితే ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచులను యూఏఈలోనే గత ఏడాది జరిగిన మూడు వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ప్లాన్ చేసింది. ఐపీఎల్… -
బీసీసీఐకి ఈ నెలాఖరు వరకు అవకాశం ఇచ్చిన ఐసీసీ…
కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కానీ ఈ ఏడాది భారత్ లో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ ను ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలి అనే విషయంలో ఆలోచనలో పడింది. అయితే భారత్లో టీ20 ప్రపంచకప్ నిర్వహణ ఇండియాలో సాధ్యపడుతుందా? లేదా? అనేది స్పష్టం చేయాలని ఐసీసీ ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్టోబర్ నాటికి భారత్లో టీ20 ప్రపంచకప్ నిర్వహించగలదా… లేదా అనే విషయంపై నివేదికను అందజేయాలని బీసీసీఐ అధినేత సౌరవ్…
తాజావార్తలు
-
Rohit Sharma TV Show: రెండు లైన్లకే ఇంత వైరల్ అయితే.. మొత్తం షో రిలీజ్ అయితే ఇంకెంత రచ్చ అవుతుందో!
-
Suvendu Adhikari: “సువేందు అధికారి అనే నేను”.. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!
-
Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?
-
Norovirus Outbreak: క్రూయిజ్ షిప్లో నోరోవైరస్ కలకలం.. 115 మందికి అస్వస్థత
-
Vijay TVK Controversy: సినిమా నిర్మాతకు లోక్ భవన్లో ఏం పని? విజయ్ గవర్నర్ భేటీలో బయటి వ్యక్తులు..