ఈసారి టీమిండియా సెలెక్టర్లు ఎవరినీ స్టాండ్బై ఆటగాళ్లను ప్రకటించకపోవడం విశేషం. సాధారణంగా ఐసీసీ టోర్నమెంట్లకు స్టాండ్బై ప్లేయర్లను ప్రకటించడం తప్పనిసరి అయినప్పటికీ, ఈసారి అలాంటి జాబితా మాత్రం భారత జట్టులో కనిపించలేదు..
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. స్టేడియం పరిసరాల్లో భారీ పొగమంచు కారణంగా టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.25 వరకు అంపైర్లు పలుమార్లు మైదానాన్ని పరిశీలించారు. పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో చివరికి మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశతో మైదానం వీడారు. మరోవైపు అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత జాతీయ జట్టు ప్లేయర్స్ అందరూ 2025 విజయ్ హజారే ట్రోఫీలో కనీసం రెండు మ్యాచ్లు ఆడాలని ఆదేశించింది. విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని టీమిండియా ప్లేయర్లకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. దేశవాళీ క్రికెట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కోసమే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ఆరంభం కానుంది.…
2026 T20 World Cup Ticket Booking: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026కి సంబంధించిన ఫేజ్–1 టికెట్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 11 సాయంత్రం 6.45 గంటల నుంచి అధికారికంగా టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. భారత్లో టికెట్ ధరలు కేవలం రూ.100 నుంచి మొదలవుతున్నాయి. శ్రీలంకలో LKR 1000 (సుమారు రూ.270) నుంచి టికెట్ ధరలు మొదలవుతాయి. మొదటి విడతలో 20 లక్షలకు పైగా టికెట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఫేజ్–2 టికెట్ వివరాలను…
డిసెంబర్ 22న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. ఈ సమావేశంలో టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సెంట్రల్ కాంట్రాక్టులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రో-కోలను ‘A+’ కేటగిరీ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి. టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి.. కేవలం వన్డే ఫార్మాట్ల్లోనే కొనసాగుతున్న కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనుంది. దేశీయ క్రికెట్లో మహిళా క్రీడాకారుల చెల్లింపుల…
పాండిచ్చేరి క్రికెట్ అసోసియేషన్ (సీఏపీ) అండర్-19 హెడ్ కోచ్ ఎస్.వెంకటరామన్పై దాడి జరిగింది. సోమవారం ముగ్గురు స్థానిక క్రికెటర్లు కోచ్పై దాడి చేశారు. దాడిలో కోచ్ వెంకటరామన్ తలకు గాయం కాగా.. భుజం విరిగిందని సేదరపేట పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ ఎస్.రాజేష్ ధ్రువీకరించారు. వెంకటరామన్ నుదిటిపై 20 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న జాతీయ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ నుంచి ఆటగాళ్లను తొలగించడమే ఈ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలంలో పాల్గొనడానికి 1,355 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. ఈసారి 350 మంది ఆటగాళ్లు వేలంకు అందుబాటులో ఉన్నారు. డిసెంబర్ 16న అబుదాబిలో మధ్యాహ్నం 2.30కు వేలం జరగనుంది. ఫ్రాంచైజీలతో చర్చ తర్వాత బీసీసీఐ ఆటగాళ్ల జాబితాను రిలీజ్ చేసింది. వేలం జాబితాలో 35 కొత్త పేర్లు జోడించబడ్డాయి. 350 మంది ప్లేయర్స్ ఫుల్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంకు రంగం సిద్దమైంది. అబుదాబిలో డిసెంబర్ 16న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో వేలం జరగనుంది. వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది. మినీ వేలంలో పాల్గొనడానికి 1,355 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా.. ఏకంగా 1,005 మంది పేర్లను బీసీసీఐ తొలగించింది. 350 మంది ఆటగాళ్లు మినీ వేలంకు అందుబాటులో ఉన్నారు. ఇందులో 35 మంది…
Ravi Shastri: టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెరీర్పై అనవసరంగా విమర్శలు చేస్తూ, వారి భవిష్యత్తును గందరగోళంలోకి నెడుతున్న వారికి భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి గట్టి హెచ్చరిక జారీ చేశారు.